- Home
- Entertainment
- SuperStar Krishna కి చుక్కలు చూపించిన వెంకటేష్.. `సంక్రాంతి` దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన సినిమాలివే
SuperStar Krishna కి చుక్కలు చూపించిన వెంకటేష్.. `సంక్రాంతి` దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన సినిమాలివే
విక్టరీ వెంకటేష్ బాక్సాఫీసు వద్ద 2005లో సూపర్ స్టార్ కృష్ణకి చుక్కలు చూపించారు. ఆయన నటించిన రెండు సినిమాలను `సంక్రాంతి` మూవీతో కోలుకోలేని దెబ్బ కొట్టారు.

రెండు సూపర్ స్టార్ సినిమాలను దెబ్బ కొట్టిన వెంకటేష్
సినిమాల మధ్య పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. స్టార్ హీరోల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుంది. సంక్రాంతి పండగ సమయంలో పోటీ ఊహించినదే, కానీ ఎలాంటి అకేషన్ లేకుండా వచ్చినప్పుడు నెలకొనే పోటీ ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. 2005లో వాలెంటైన్స్ డే సమయంలో ఇంట్రెస్టింగ్ పోటీ నడిచింది. వెంకటేష్, సూపర్ స్టార్ కృష్ణ మధ్య రసవత్తరమైన పోటీనడిచింది. కృష్ణ రెండు సినిమాలను కోలుకోలేని దెబ్బకొట్టాడు వెంకటేష్. `సంక్రాంతి` మూవీతో ఆయన హిట్ అందుకున్నారు.
సంక్రాంతితో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్
వెంకటేష్ ఫ్యామిలీ చిత్రాలకు, లవ్ స్టోరీస్కి కేరాఫ్. ఆయన ఫ్యామిలీ కథతో `సంక్రాంతి` అనే చిత్రం చేశారు. ఈ మూవీ సంక్రాంతికి కాకుండా వాలెంటైన్స్ డే స్పెషల్గా 2005 ఫిబ్రవరి 18న విడుదలయ్యింది. ఈ చిత్రానికి ముప్పలనేని శివ దర్శకత్వం వహించారు. వెంకటేష్, శ్రీకాంత్, శివ బాలాజీ, శర్వానంద్, స్నేహా, ఆర్తి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఎలాంటి సీజన్ లేకుండా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. వెంకటేష్, శ్రీకాంత్ల `సంక్రాంతి` మూవీ దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన చిత్రాలేంటనేది చూస్తే,
`సంక్రాంతి`తో పోటీలో డిజాస్టర్గా నిలిచిన కృష్ణ `ఎవరు నేను`
సూపర్ స్టార్ కృష్ణ.. వెంకీ `సంక్రాంతికి` వారం ముందే వచ్చారు. `ఎవరు నేను` అనే చిత్రంలో నటించారు. దీనికి ముందులూరి భీమేశ్వరరావు దర్శకత్వం వహించారు. కృష్ణ సరసన రాధిక, రమ్యశ్రీ వంటి వారు నటించారు. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఫిబ్రవరి 10న విడుదలైంది. దారుణమైన పరాజయం చెందింది. ప్రారంభంలో ఎంతో కొంత ఆడినా, `సంక్రాంతి` సినిమా దెబ్బకి థియేటర్ల నుంచి ఎత్తేయాల్సి వచ్చింది.
కృష్ణ `శ్రావణమాసం` కూడా డిజాస్టర్
ఇక వెంకటేష్ `సంక్రాంతి` విడుదలైన వారం తర్వాత ఫిబ్రవరి 26న సూపర్ స్టార్ కృష్ణ, హరికృష్ణ నటించిన `శ్రావణమాసం` విడుదలయ్యింది. ఈ చిత్రానికి పోసాని కృష్ణమురళీ దర్శకత్వం వహించగా, ఇందులో కృష్ణ, హరికృష్ణతోపాటు కార్తికేయ గౌడ్, గజాల, కళ్యాణి, విజయ నిర్మల, భాను ప్రియా, నాగబాబు, సుమన్ వంటి వారు నటించారు. భారీ తారాగణంతో వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ఫ్లాప్ మూవీగా నిలిచింది. `సంక్రాంతి` మూవీ ఫ్యామిలీ స్టోరీనే, `శ్రావణమాసం` కూడా ఫ్యామిలీ స్టోరీనే, కానీ వెంకీ ముందు కృష్ణ, హరికృష్ణలు కూడా నిలవలేకపోయారు.
నితిన్ `ధైర్యం` పరాజయం
వాలెంటైన్స్ డే స్పెషల్గా వచ్చిన నితిన్ `ధైర్యం` కూడా నిలవలేకపోయింది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా, తేజ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇందులో రీమా సేన్ హీరోయిన్గా నటించింది. ఫిబ్రవరి 12న ఈ చిత్రం విడుదలైంది. ప్రారంభంలో ఫర్వాలేదనిపించుకుంది. కానీ ఆ తర్వాత `సంక్రాంతి` మూవీ దెబ్బకి చిత్తైపోయింది.
సచిన్ `ఒరేయ్ పండు` మూవీకి తప్పని నిరాశ
అలాగే వాలెంటైన్స్ డే స్పెషల్గా సచిన్ హీరోగా నటించిన `ఒరేయ్ పండు` మూవీ విడుదలయ్యింది. ఎస్వీకృష్ణారెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందడం విశేషం. రొమాంటిక్ డ్రామాగా ఇది తెరకెక్కింది. సండలి సిన్హా హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ఇలా వెంకటేష్ దెబ్బకి రెండు కృష్ణ సినిమాలు, నితిన్ మూవీ, సచిన్ చిత్రం పరాజయం చెందాయని చెప్పొచ్చు.
సంక్రాంతితో పోటీలో నిలబడ్డ శ్రీకాంత్ రాధాగోపాళం`
అయితే `సంక్రాంతి` వచ్చిన వారం తర్వాత శ్రీకాంత్, స్నేహ జంటగా నటించిన `రాధా గోపాళం` మూవీ విడుదలయ్యింది. బాపు రూపొందించిన చిత్రమిది. రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామాగా వచ్చి ఆకట్టుకుంది. `సంక్రాంతి` మూవీని తట్టుకొని నిలబడ్డ ఒకే ఒక్క చిత్రం ఇదే అని చెప్పొచ్చు. మిగిలిన చిత్రాలు ఆకట్టుకోలేకపోవడంతో అది ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది. పైగా ఆ సమయంలో శ్రీకాంత్ కూడా హీరోగా పీక్లో ఉన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అది ఈ మూవీకి కలిసి వచ్చింది.

