- Home
- Entertainment
- సౌందర్య నటించిన ఏకైక హిందీ మూవీ ఏంటో తెలుసా? ఓపెనింగ్లో పోటీ పడ్డ కృష్ణ, వెంకటేష్, నాగార్జున.. కారణమిదే?
సౌందర్య నటించిన ఏకైక హిందీ మూవీ ఏంటో తెలుసా? ఓపెనింగ్లో పోటీ పడ్డ కృష్ణ, వెంకటేష్, నాగార్జున.. కారణమిదే?
Soundarya: సౌందర్య తెలుగులోనే ఎక్కువ మూవీస్ చేసింది. వీటితోపాటు తమిళం, కన్నడలో కూడా సినిమాలు చేసింది. కానీ బాలీవుడ్లో మాత్రం ఒకే ఒక్క చిత్రం చేసింది. ఆ మూవీ ఏంటో చూస్తే.
- FB
- TW
- Linkdin
Follow Us
)
soundarya, Sooryavansham movie opening
Soundarya: సౌందర్య ఎవర్ గ్రీన్ ఇండియన్ మూవీ నటి. ఆమె చేసిన సౌత్ సినిమాలే అయినా, ఇండియా వైడ్గా గుర్తింపు తెచ్చుకుంది. అభిమానులను ఏర్పర్చుకుంది. హీరోయిన్లలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న సౌందర్య తక్కువ ఏజ్లోనే మనకు దూరమయ్యింది.
అయితే ఆమె సినిమా ఓపెనింగ్లో సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున, వెంకటేష్ పోటీ పడ్డారు. బ్రహ్మానందం, రామానాయుడు, విజయ నిర్మల, నరేష్ వంటి వారు సందడి చేశారు. మరి సౌందర్య ఫస్ట్ మూవీ కోసం ఇంత మంది బిగ్ స్టార్స్ రావడమేంటి? ఇంతకి ఆ మూవీ ఏంటి? అనేది చూస్తే.
soundarya, Sooryavansham opening
సౌందర్య తెలుగులో మేజర్గా సినిమాలు చేసింది. తమిళంలో కొన్ని, కన్నడలో కొన్ని చిత్రాల్లో నటించింది. కానీ సౌందర్యకి పేరు తెచ్చింది మాత్రం టాలీవుడ్ అనే చెప్పాలి. ఆమె బాలీవుడ్లో ఒకే ఒక్క మూవీ చేసింది. అదే `సూర్యవంశం`.
ఈ చిత్రంతోనే ఆమె హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అమితాబ్ బచ్చన్. ఫస్ట్ టైమ్ వీరిద్దరు జోడీగా నటించారు. దీంతో అందరిలోనూ ఈ మూవీపై క్రేజ్ ఏర్పడింది. పేరుకే ఇది హిందీ చిత్రమైనా అంతా తెలుగు ఫ్లేవరే ఉంది.
soundarya, Sooryavansham opening
ఈ మూవీకి దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. తెలుగులో `సూర్యవంశం` మూవీకి కూడా ఆయన దర్శకుడు. తెలుగులో దీన్ని వెంకటేష్, మీనా జంటగా రూపొందించారు. ఇక హిందీ `సూర్యవంశం` చిత్రాన్ని పద్మాలయ స్టూడియో నిర్మించింది.
ఆదిశేషగిరి రావు, కృష్ణ నిర్మాతలు. అందుకే కృష్ణ, విజయ నిర్మల, నరేష్ ఈ ఓపెనింగ్లో పాల్గొన్నారు. వీరితోపాటు బ్రహ్మానందం పాల్గొన్నారు. ఆయన ఇందులో కమెడియన్ పాత్ర పోషించారు.
Sooryavansham
మరోవైపు వెంకటేష్, రామానాయుడు కూడా పాల్గొన్నారు. తెలుగు సినిమాని వీరే రూపొందించిన విషయం తెలిసిందే. అందుకే వీరు పాల్గొన్నారు. అలాగే నాగార్జున సైతం ఇందులో పాల్గొన్నారు. ఆయన అమితాబ్ బచ్చన్కి చాలా క్లోజ్. పైగా హైదరాబాద్లోనే ఓపెనింగ్ కావడంతో వీరంతా అటెండ్ అయ్యారు. అయితే ఓపెనింగ్ టైమ్లో వీరంతా పోటీపడ్డట్టుగా కనిపించారు.
నాగార్జున క్లాప్ నివ్వగా, ఆయనతోపాటు వెంకటేష్, కృష్ణ దాదాపు చాలాసేపు అక్కడే ఉన్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలోనూ పక్కనే కనిపించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే అప్పటికే కృష్ణ, నాగ్, వెంకటేష్ వంటి హీరోలంతా సౌందర్యతో సినిమాలు చేశారు. ఆ అనుబంధం కూడా ఆమె బాలీవుడ్ డెబ్యూ మూవీకి సపోర్ట్ చేయడానికి వచ్చారని చెప్పొచ్చు.
Sooryavansham
అయితే 1992లోవిడుదలైన ఈ బాలీవుడ్ `సూర్యవంశం` పెద్దగా ఆడలేదు. ఏడు కోట్లతో రూపొందించగా, 12కోట్లు వసూలు చేసింది. కనీసం బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు. 15కోట్లకుపైగా వసూళ్లు వచ్చి ఉంటే హిట్ అయ్యేది. కానీ ఇది దాదాపు రెండు కోట్ల నష్టాలను తెచ్చిపెట్టిందని టాక్.
ఆ తర్వాత సౌందర్య మళ్ళీ హిందీ సినిమా చేయలేదు. దీంతో సౌందర్య చేసిన ఏకైక బాలీవుడ్ మూవీగా `సూర్యవంశం` గా మిగిలింది. సౌందర్య 2004లో హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.