అడ్డంగా దొరికినా.. : బికినీలో తెలుగు పాప..బీభత్సం!
శోభిత దూళిపాళ్ల..ఎక్కడో ఈ పేరు విన్నట్లుందే అనిపిస్తోందా...ఎక్కడో కాదు ఇక్కడే..మన తెలుగు అమ్మాయే...ఆ మధ్యన అడివి శేష్ నటించిన 'గూఢచారి' సినిమాలో కనిపించిన అందమే. ఆమె ఇప్పుడో వివాదంలో ఇరుక్కుంది. రీసెంట్ గా ఆమె ఓ మ్యాగజైన్ కోసం ఫొటోషూట్లో పాల్గొంది. ఆ ఫొట వైరల్ అయ్యింది. అయితే ఆ ఫొటోలో ఓ తప్పు ని పట్టుకున్నారు జనం. అందరూ కరోనా కారణంగా సోషల్ డిస్టెన్సిన్గ్ పాటిస్తుంటే శోభితా మాత్రం కెమెరా మ్యాన్ ని పెట్టుకొని ఫోటో షూట్లు చేస్తోంది. బాధ్యతగల సెలబ్రిటీలుగా వుంటూ పది మందికి ఆదర్శంగా నిలవాల్సింది పోయి ఇలా చేస్తోంది’ అంటూ విపరీతంగా కామెంట్లు పెట్టడం మొదలెట్టారు. అనవసరంగా ఆ ఫొటోలు పెట్టానే ఆమె ఫీలవ్వాల్సిన పరిస్దితి వచ్చింది.
'లాక్డౌన్ కారణంగా మా ఇంటి దగ్గరే ఈ ఫొటోషూట్ చేసుకున్నాను. నాకు నేనే మేకప్ వేసుకుని.. సెల్ఫ్ టైమర్ తో స్వయంగా నేనే ఫొటోలు తీసుకున్నాను' అని శోభితా అంది.
అయితే ఈ ఫొటోషూట్ ఫొటోలు బయటకు రావడంతో.. అందులోని ఓ ఫొటోలో ఆమెను మరో వ్యక్తి ఫొటో తీస్తున్నట్లు ఉంది. దీంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు చేయడం ప్రారంభించారు.
‘శోభితా అబద్ధం చెప్పింది. సెల్ఫ్ టైమర్ పెట్టి ఫొటోషూట్ చేస్తే ఈ ఫొటోగ్రాఫర్ ఏం చేస్తున్నాడు అని విమర్శలు మొదలెట్టారు. వాటికి సమాదానం ఇవ్వలేక సైలెంట్ అయ్యిపోతుందనుకున్నారు అంతా. కానీ శోభిత ఊరుకునే రకం కాదు.
ఈ క్రమంలో శోభిత అసలు ఫొటో షూట్ ఎలా ఇరిగింది.. తను సెల్ఫ్ టైమర్ తో ఫొటోలకు ఎలా పోలిజిచ్చింది అనే వాటిని ఒక పెద్ద లెటర్ ద్వారా వివరించే ప్రయత్నం చేసింది.
'నెటిజన్ల ట్రోలింగ్ గురించి విని ఎంతో బాధపడ్డాను. పూర్తి విషయం తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి ఎలా వస్తారో అనిపించింది. దీనివల్ల నేను ఒక విలువైన పాఠం నేర్చుకున్నాను. నా ఫొటో షూట్ ఎలా జరిగిందో మీకు చెప్పాలని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చింది.
ఫొటోషూట్ కోసం రెడీ అయ్యాక.. ఓ కాఫీ కప్పు నా ఫోన్తో ఫొటోషూట్ తీయడానికి మా టెర్రస్ పైకి వెళ్లాను. ఆ సమయంలో టెర్రస్ పై చాలామంది వ్యక్తులు ఉన్నారు. నేను ఫొటోలు తీసుకోవడంలో ఇబ్బంది పడడం చూసిన ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి సాయం చేస్తానని చెప్పారు అని వివరించే ప్రయత్నం చేసింది.