- Home
- Entertainment
- Singer Sujatha Mohan: ఐదేళ్లుగా ఒక్క పాట కూడా పాడలేదు.. స్టేజ్ పైనే ఏడ్చేసిన సింగర్
Singer Sujatha Mohan: ఐదేళ్లుగా ఒక్క పాట కూడా పాడలేదు.. స్టేజ్ పైనే ఏడ్చేసిన సింగర్
Singer Sujatha Mohan: ప్రముఖ స్టార్ సింగర్ సుజాత మోహన్ ఈ మధ్యకాలంలో పాటలు పాడటం పూర్తిగా తగ్గించేశారు. అయితే.. తాను అలా చేయడానికి గల కారణాన్ని ఆమె తాజాగా తెలియజేశారు.

Sujatha Mohan
ప్రముఖ సింగర్ సుజాత మోహన్ కి పరిచయం అవసరం లేదు. ఆమె తన మధురమైన గొంతుతో దాదాపు 20వేలకు పైగా పాటలు పాడి అలరించారు. ఆమె పాటలకు, ఆమె గొంతుకు విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే.. గత ఐదేళ్లుగా స్టేజ్ పెర్ఫార్మెన్స్ లకు దూరంగా ఉండటం అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయంపై తాజాగా ఆమె ఓ అవార్డు వేదికపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
స్టేజీ మీదే ఏడ్చేసిన సింగర్...
సుజాత గత ఐదేళ్లుగా తీవ్రమైన గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ ఆరోగ్య సమస్య కారణంగా ఆమె మునుపటిలా పాడలేకపోయారు. ముఖ్యంగా లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే సమయంలో తన గొంతు సహకరించకపోవడం తో ఆమె స్టేజ్ పర్ఫార్మెన్స్ లకు దూరంగా ఉంటున్నానని చెప్పారు. ఈ విషయాన్ని చెబుతూ ఆమె వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘ ఒక గాయనిగా గొంతు సరిగ్గా లేకపోవడం అనేది ఎంతటి నరకమూ మాటల్లో చెప్పలేను’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 20వేలకు పైగా పాటలు పడిన తనకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం.
కాగా, సమస్య ఉన్నప్పటికీ తాను సంగీతాన్ని విడిచి పెట్టలేదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా మళ్లీ తన గొంతును సరిచేసుకోవడానికి నిరంతరం సాధన చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మళ్లీ పూర్తి స్థాయిలో పాడతానని చెప్పారు.
స్పందించిన ఏఆర్ రెహమాన్ సోదరి..
సుజాత పరిస్థితిని చూసి ఏఆర్ రెహమాన్ సోదరి రీహానా కూడా స్పందించారు. సుజాత గొంతు మళ్లీ మనుపటిలా మారేలా మెరుగైన చికిత్స అందించాలని, ఎవరైనా వైద్యులు దీనికి సహాయం చేయగలిగితే ముందుకు రావాలని ఆమె సోషల్ మీడియా వేదికగా కోరడం విశేషం. కాగా, సుజాత మోహన్ కుమార్తె శ్వేతా మోహన్ కూడా పాపులర్ సింగర్. ఆమె తెలుగు, తమిళ భాషల్లో పాటలు పాడారు.
