Intinti Gruhalakshmi: లాస్య నిజ స్వరూపం తెలుసుకున్న పరంధామయ్య, అనసూయ.. శ్రుతి మీద కోప్పడిన నందు?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు డిసెంబర్ 13వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
ఈరోజు ఎపిసోడ్లో సామ్రాట్ అమ్మవారు ఎంతమందికని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు వారి ప్రాబ్లమ్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా అని ఫన్నీగా మాట్లాడగా మన ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసి అమ్మవారికి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంది అని అంటుంది తులసి. అయినా మీరు ఏమైనా అమ్మవారిని మణులు మాణిక్యాలు అడిగారా అమ్మవారి తీర్చకపోవడానికి అని అనగా ఏమో అడిగానేమో అనడంతో వెంటనే సామ్రాట్ మీరు నాకు ఒక విషయంలో థాంక్స్ చెప్పాలండి అని అంటాడు. ఎందుకు అని అడగగా మిమ్మల్ని గుడి దగ్గరికి పిలుచుకొని వెళ్లాను కదా అని అనడంతో ముందుగా గుడి దగ్గరికి వెళ్లాలని ప్లాన్ ఇచ్చింది ఎవరు అనడంతో మీరే అనడంతో అప్పుడు మీరే నాకు థాంక్స్ చెప్పాలి కదా అని అంటుంది తులసి.
అప్పుడు సామ్రాట్ రేపు ఉదయాన్నే మనం ఒక ప్రాజెక్టు మీద విలేజ్ కి వెళ్ళాలి రెడీగా ఉండండి అని అబద్ధం చెబుతాడు. మరొకవైపు అనసూయ,పరంధామయ్య వారి పనులు చేసుకుంటుండగా నందు అక్కడే ఉండి లాప్టాప్ లో పనిచేసుకుంటూ ఉంటాడు. అప్పుడు పరంధామయ్య అనసూయ సరదాగా జోకులు వేసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఫుడ్ డెలివరీ బాయ్ అక్కడికి వచ్చి ప్రేమ్ అనే వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేశాడు అని అనగా నందు ఆలోచనలో పడతాడు. అప్పుడు నందు లోపలికి వెళ్ళగా ప్రేమ్ ఆర్డర్ చేశాడా అని అనడంతో అవును అనగా గెస్ చేశాను అని అంటే ఎలా గెస్ చేసావు లాస్య అనడంతో నువ్వే చెప్పు నందు మనం ఉన్న పరిస్థితులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వంటకాలు అవసరమా అని అంటుంది లాస్య.
అది సరే ఇప్పుడు ఏం జరిగింది అనడంతో లాస్య జరిగింది మొత్తం వివరించి ప్రేమ్ శృతి లదే తప్పు అన్నట్టుగా నందుని నమ్మిస్తుంది. అప్పుడు నందు లాస్య చెప్పింది కూడా మన కోసమే కదా ప్రస్తుతం ఇంట్లో పరిస్థితులు బాగా లేవు నువ్వు కూడా కొంచెం చూసుకుని వాడుకో శృతి. ఇంకొకసారి ఇలాంటి కంప్లైంట్ రాకుండా చూసుకో అని చెబుతాడు. అప్పుడు లాస్య కావాలనే శృతిని వెక్కిరిస్తున్నట్లుగా మాట్లాడుతూ నేను చెప్పిందే నందుకు చెప్పాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదంతా చూసిన అనసూయ,పరంధామయ్య శృతి దగ్గరికి వెళ్తారు.
శృతిని ఓదారుస్తూ ఉండగా చూశారు కదా మామ చిన్న విషయాన్ని ఇంత పెద్ద గొడవ చేసిందో నేను ఏమీ అనకనే అంకుల్ని రెచ్చగొట్టి నన్ను తిట్టేలా చేసింది అని అనగా వెంటనే అనసూయ చూశారా ఇలాంటివి చూడడానికైనా మనం ఇంట్లో ఉండేది వాళ్ళు ఉండమంటేనే ఉన్నాము కదా అని అంటుంది. అప్పుడు పరంధామయ్య ఎన్నాళ్ళు జరుగుతుందో జరగని అమ్మ శృతి నువ్వు ఈ విషయాన్ని ప్రేమ్ కి తెలియకుండా జాగ్రత్త పడు అని నచ్చ చెబుతాడు. మరొకవైపు సామ్రాట్ ఇంటికి వెళ్ళగా హనీ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.
అప్పుడు సామ్రాట్ ఏం జరిగిందా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అసలేం జరిగిందంటే అమ్మ అని చెబుతుండగా వెంటనే హనీ మాట తప్పావు నాన్న మోసం చేశావు నాన్న అని అంటుంది. దేవుడికి చెప్పమని చెప్పాను కదా నాన్న చెప్పావా అని అడగగా చెప్పడం మాత్రమే కాదు దేవుడికి ముడుపు కూడా కట్టాను అని అంటాడు సామ్రాట్. సెకండ్ ర్యాంకు వచ్చిందా అయినా పర్లేదులే అమ్మ అని హనీకి నచ్చ చెబుతూ ఉంటాడు సామ్రాట్. అప్పుడు హనీ సామ్రాట్ తో నాకు ఫస్ట్ ర్యాంకు వచ్చింది అని అనడంతో సామ్రాట్ సంతోష పడుతూ ఉంటాడు. మరి ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు అని అనడంతో సర్ప్రైజ్ నాన్న అని అంటుంది.
అప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే సామ్రాట్ కి తులసి ఫోన్ చేస్తుంది. ఇప్పుడే నేను మీ గురించి అనుకుంటున్నాను అని అనగా ఎందుకో అని అనడంతో సామ్రాట్ అసలు విషయం చెప్పగా తులసి సంతోషపడుతూ ఉంటుంది. అంటే అమ్మవారి ముడుపు నిజమైంది అన్నమాట అని అనగా అంతే కదా మరి అని సామ్రాట్ అనడంతో వెంటనే తులసి నా ముడుపు మీద కూడా నేను ఆశలు పెట్టుకుంటాను అని అంటుంది తులసి. మరొకవైపు పరంధామయ్య ఆకలి వేస్తుంది అని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కిచెన్ లోకి వెళ్దామంటే లాస్య భయం ఈ అనసూయ ఏం చేస్తుంది నాకు ఆకలి దంచేస్తోంది అనుకుంటూ ఉంటాడు పరంధామయ్య.
అనసూయ అక్కడికి పరంధామయ్య కోసం ఆహారం తీసుకుని వచ్చి ఇస్తుండగా లాస్య వచ్చి గుంజుకొని తాను తింటూ ఉంటుంది. అప్పుడు పరందామయ్య ఇటు ఇవ్వమ్మా అని అనగానే నేను ఇవ్వను కదా అని అంటుంది. ఎందుకు ఇవ్వవు అనడంతో అల్సర్ ఉన్న పేషంట్లకు ఇలాంటివి పెట్టకూడదు అంటూ నీతులు చెబుతూ ఉంటుంది లాస్య. అప్పుడు కడుపులో మండుతుంది అని అనడంతో కావాలంటే బిస్కెట్లు చాక్లెట్స్ ఏవో ఒకటి తినండి అని అంటుంది లాస్య. ఇప్పుడు లాస్య ఊరికే ఉండి కాలక్షేపం చేసేవాళ్ళు నాకు ఇలాంటివి చేసి పెట్టొచ్చు కదా అని అనసూయకు ఆర్డర్లు వేస్తుంది.
తర్వాత లాస్య అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అనసూయ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు చెప్పింది కదా లాస్య ఈ పూటకు ఏవో ఒకటి తినమని చెప్పి అంటే అవి కూడా లేవండి అనడంతో నీళ్లు తాగి సరిపెట్టుకుంటాను అని అంటాడు పరంధామయ్య. అప్పుడు పరందామయ్య బాధగా మాట్లాడుతూ ఉంటాడు. మరొకవైపు తులసి, సామ్రాట్ ఇద్దరూ కలిసి ఒక విలేజ్ కి వెళ్తూ ఉంటారు. అప్పుడు వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.