- Home
- Entertainment
- Savitri: మహానటి సావిత్రి చివరిగా స్నేహితురాలిని కలిసి చెప్పిన మాటలివే.. కన్నీళ్లు ఆపుకోలేరు
Savitri: మహానటి సావిత్రి చివరిగా స్నేహితురాలిని కలిసి చెప్పిన మాటలివే.. కన్నీళ్లు ఆపుకోలేరు
Savitri: మహానటి సావిత్రి చివరి రోజుల్లో తన మనసులోని బాధని బయటపెట్టింది. తన బెస్ట్ ఫ్రెండ్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. తాను చేసిన తప్పేంటో వెల్లడించిందట.

సావిత్రి తెలుగు తెరకు దొరికిన ఒక అద్భుతం
మహానటి సావిత్రి తెలుగు చిత్ర పరిశ్రమ దొరికిన ఒక అద్భుతం. కానీ ఆ అద్భుతం తక్కువ కాలంలోనే ఈ లోకాలను విడిచి వెళ్లిపోయింది. దీంతో ఇప్పుడు చరిత్రగా మిగిలిపోయింది. సావిత్రి జీవితం ఒక ఎమోషన్. ఆమెని ప్రత్యక్షంగా చూసినా, చూడకపోయినా, ఆమె గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు భావోద్వేగానికి గురవుతారు. అయ్యే అని ఫీలవుతారు. ఉన్నన్ని రోజులు అద్భుతమైన నటనతోనే కాదు, గొప్పమనసుతోనూ ఆకట్టుకుంది. అందరి మనసులు దోచుకుంది సావిత్రి.

స్నేహితురాలి వద్ద ఆవేదన వ్యక్తం చేసిన సావిత్రి
సావిత్రి తాను చివరి రోజుల్లో పడిన బాధని తన ఫ్రెండ్స్ వద్ద చెప్పుకుందట. తాను ఏం తప్పు చేశానో వెల్లడించిందట. ఒక్క తప్పు తన జీవితాన్ని మార్చేసిందని, సుఖం, సంతోషం లేదని ఆమె తన స్నేహితురాలి వద్ద వాపోయిందట. సావిత్రికి చిన్ననాటి నుంచి ఉన్న ఏకైక స్నేహితురాలు మద్దాలి సుశీల. క్లాసికల్ డాన్స్ లో శిక్షణ తీసుకునే టైమ్లో వీరి స్నేహం ప్రారంభమైంది. చివరి వరకు కంటిన్యూ అయ్యింది. సావిత్రి సినిమాల్లోకి వెళ్లేంత వరకు ఆమె మహానటితోనే ఉంది. ఆ తర్వాత కూడా సావిత్రి ఆమెని తనతో ఉండాలని కోరుకుంది. కానీ అప్పటికే సుశీలకి పెళ్లి అయ్యింది. పిల్లలు కూడా ఉన్నారు. దీంతో సావిత్రితో వెళ్లలేకపోయింది.
ఎప్పుడొచ్చినా సుశీలని కలిసేది సావిత్రి
కానీ ఊరొస్తే మాత్రం కచ్చితంగా సుశీలని కలిసేదట. లేదంటే తన ఇంటికి పిలిపించుకునేదట. ఇలా తరచూ వీరిద్దరు కలిసేవారు. తన సినిమాల ఈవెంట్లకి వచ్చినప్పుడు కూడా కచ్చితంగా ఫ్రెండ్ని కలిసేదట. తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలన్నింటినీ సుశీలతో పంచుకునేవారట సావిత్రి. అయితే చివరి రోజుల్లో సుశీలని కలిసి తన మనసులోని బాధమొత్తాన్ని కక్కేసిందట. తాను ఎలాంటి తప్పు చేశానో అప్పటికి రియలైజ్ అయ్యిందట.
సుఖం లేదు, సంతోషం లేదంటూ సావిత్రి ఆవేదన
ఏలూరులో మెయిన్ రోడ్డు మీద సావిత్రి వాళ్లకి చెందిన విజయ స్పిన్నింగ్ మిల్ ఉండేదట. చనిపోవడానికి ముందు కొన్నేళ్ల క్రితం అక్కడ ఏదో పనిమీద విజయవాడ వచ్చినప్పుడు సావిత్రి, సుశీల కలుసుకున్నారట. ఆ సమయంలో ఓపెన్ అయ్యిందట సావిత్రి. అప్పట్లో తనతో సుశీల రాలేదని కోపం ఉండేదట. ఆ విషయాన్ని చెబుతూ, `మొదట్లో నీ మీద కొప్పడ్డాను, కానీ ఆ తర్వాత నువ్వు రాకపోవడమే మంచిదైంది. నేను అక్కడికి వెళ్లాననే గానీ, కోట్లు సంపాదించినా సుఖం లేదు, సంతోషం లేదు, భర్త పట్టించుకోదు, నాకు తొచింది తినలేను, నచ్చింది కట్టుకోలేను, నేను దిక్కులేని దానినైపోయాను. నువ్వయ్యినా ఇక్కడ సుఖంగా భర్త, పిల్లలతో ఉన్నావ్ అంతే చాలు` అని బాధతో చెప్పిందట సావిత్రి.
సుశీల చెప్పినా వినలేదు
సావిత్రి అన్న ఆ మాటకి సుశీలకి కన్నీళ్లు ఆగలేదట. జెమినీ గణేషన్తో పెళ్లి వద్దు అని తను చాలా చెప్పిందట, కానీ సావిత్రి వినలేదని, చివరికి తన పరిస్థితి చూసి చాలా బాధేసిందని వెల్లడించింది సుశీల. సావిత్రి ఎంతో సంపాదించింది, ఎందరో అభిమానుల్ని సంపాదించింది. కానీ ఆఖరుకి ఏది లేకుండా, ఎవరూ లేకుండా ఒంటరిగా వెళ్లిపోయింది. ఆ సావిత్రిని ఇలా సినిమా ద్వారా అయినా చూసుకోవడం ఆనందంగా ఉంది అని సుశీల తెలిపింది. మహానటి మూవీ విడుదల సమయంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.

