- Home
- Entertainment
- Madhavi latha: నిన్ను కనేముందు మీ నాన్న కండోమ్ వాడాల్సింది.. నా అన్వేష్పై మాధవీలత బోల్డ్ స్టేట్మెంట్
Madhavi latha: నిన్ను కనేముందు మీ నాన్న కండోమ్ వాడాల్సింది.. నా అన్వేష్పై మాధవీలత బోల్డ్ స్టేట్మెంట్
Madhavi latha: నా అన్వేషణ అన్వేష్పై నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత ఫైర్ అయ్యింది. అతను చేసిన ఒక వీడియో చూపిస్తూ రెచ్చిపోయింది. దారుణమైన కామెంట్స్ చేసింది.

నా అన్వేష్పై మాధవీలత ఫైర్
నా అన్వేషణ అన్వేష్పై ఫైర్ అయ్యింది మాధవీలత. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది. వీడియోలు పోస్ట్ చేస్తూ ఆశ్చర్యపరుస్తుంది. సామాజిక అంశాలపై స్పందిస్తుంది. తాజాగా ఆమె నా అన్వేష్పై మండిపడింది. నువ్వు కుక్క చావు చస్తావని, నిన్ను కనేముందు మీ నాన్న కండోమ్ వాడాల్సింది అంటూ రెచ్చిపోయింది. దారుణమైన పదాలు వాడుతూ చెడుగుడు ఆడుకుంది. మరి ఇంతకి నా అన్వేషణ అన్వేష్ ఏం చేశాడు? మాధవీలత ఎందుకు ఫైర్ అయ్యిందనేది చూస్తే,

నా అన్వేష్ని ఆడుకున్న మాధవీలత
తెల్లారి మూడున్నర గంటలకు మాధవీలతకి నిద్ర పట్టకపోతే ఫోన్ స్వైప్ చేస్తుంటే యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ రీల్ కనిపించింది. ఇందులో ఆయన జగద్గురువుని ఎగతాళి చేస్తూ కనిపించాడు. దీనిపై మాధవీలత ఒక వీడియో పెట్టింది. ఇందులో నా అన్వేష్ చేసిన కామెంట్పై ఆమె ఫైర్ అయ్యింది. వీడే ఒక బోకుగాడు, మోసగాడు అంటూ రెచ్చిపోయింది.
మనిషి జన్మకే అనర్హుడివి
`మామూలుగా కళ్లు కనిపించని వ్యక్తి అంధత్వాన్ని హేళన చేయడమనేది అసహ్యమైన పని. ఒక మనిషిగా పుట్టి, మరొక మనిషి అవయవ లోపాన్ని ఎత్తి చూపించడం వాడు మనిషి జన్మకే అనర్హుడు. అలాంటిది జగద్గురువుని పట్టుకొని, ఆయనకు కంటిచూపు లేదు, కానీ ఆయన జ్ఞానం అమోగమైనది. ఆయన కాలుకి అంటుకున్న ఒక దుమ్ము రేణువుతో సమానం కాదు. ఈ గజ్జి కుక్క, ఈ కమ్యూనిస్టు, క్రిస్టియన్ దేశాలు పెంచి పోషిస్తున్న ఒక గజ్జికుక్క సాక్షాత్తు ఆ జగద్గురువుని పట్టుకొని ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు. వీడికి పోయే కాలం దగ్గరపడింది. రామజన్మభూమికి సంబంధించి సుప్రీంకోర్టు ఆయన సాక్ష్యాన్ని పరిగణించి, ఆయన చెప్పినదాన్ని కోర్ట్ అణువణువు పరీక్షించిన తర్వాత ఆయన చెప్పన ప్రతిదీ అక్షర సత్యం అని, అది కూడా మన పురాణాల్లో ఉన్నదని భావించి రామజన్మభూమి మనకు ఇవ్వడం జరిగింది.
మీ నాన్న కండోమ్ వాడాల్సింది
అంతటి మహానుభావుడిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడతావురా.. మీ నాన్న కండోమ్ వాడాల్సింది రా దరిద్రపు ఎదవ. నువ్వు భారతదేశంలో ఉండి ఉంటే, ఇప్పటికే నీకు సమాధి కట్టి ఉండేవారు. వేరే దేశం వెళ్లి బతికిపోయావు, నువ్వు నాశనం అయ్యే కాలం దగ్గరపడిందిరా కుక్క. ఎవ్వరైనా గుర్తుపెట్టుకోండి, వాడి కర్మని వాడే అనుభవిస్తాడు. త్వరలో వీడు కుక్క చావు చస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి` అంటూ మండిపడింది మాధవీలత. ఆమె వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
సినిమాల్లో సక్సెస్ కాని మాధవీలత
మాధవీలత.. 2007లో మహేష్ బాబు నటించిన `అతిథి` చిత్రంలో హీరోయిన్కి ఫ్రెండ్గా నటించి వెండితెరకు పరిచయం అయ్యింది. 2008లో `నచ్చావులే` చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది. తొలి చిత్రంతోనే హిట్ అందుకుంది. `ష్`, `స్నేహితుడా`, వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. `అరవింద్ 2`, `చూడాలని చెప్పాలని` వంటి చిత్రాలు చేసింది. కానీ మాధవీలతకు సక్సెస్ రాలేదు. దీంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా సక్సెస్ కాలేకపోయింది. దీంతో సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్లింది. ప్రస్తుతం బీజేపీ పార్టీలో యాక్టివ్ మెంబర్గా ఉంది.

