సావిత్రి నుండి సిల్క్ స్మిత వరకు... దుర్భర స్థితిలో తారల మరణాలు
సినిమా ఒక మాయ ప్రపంచం... తెరపై మెరిసే నటుల జీవితాలు కూడా కనిపించినంత అందంగా ఏమీ ఉండవు. కెరీర్ సాగినంత కాలం ఫేమ్, స్టేటస్, విలాసవంతమైన జీవితం ఉంటుంది. ఒక్కసారి ఫేడవుట్ అయితే పట్టించుకొనే నాధుడే ఉండదు. వెండితెరపై తిరుగులేని స్టార్డం అనుభవించి జీవిత చరమాంకంలో దుర్భర పరిస్థితుల మధ్య ప్రాణాలు విడిచిన నటులు అనేక మంది...వారెవరో ఒకసారి చూద్దాం..
సౌత్ ఇండియాలో తిరుగులేని స్టార్ గా ఎదిగింది సావిత్రి. ఇండియాలోనే తొలి లేడీ సూపర్ స్టార్ గా సావిత్రిని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి స్టార్స్ కి మించిన ఇమేజ్ సొంతం చేసుకున్న సావిత్రి, లెక్కలేనంత ఆస్థిని సంపాదించారు. దాన గుణం, నమ్మినవారు మోసం చేయడం వలన, ముందుకు బానిసై, చివరి రోజుల్లో కడు పేదరికంలో మరణించారు. తొమ్మిది నెలలు కోమాలో ఉన్న సావిత్రి 1981లో మరణించారు.
బాలీవుడ్ లో మీనా కుమారిని ట్రాజెడీ క్వీన్ అంటారు. వెండితెరపై తిరుగులేని స్టార్ డమ్ అనుభవించిన ఆమె చివరి రోజుల్లో హాస్పిటల్ బిల్స్ కూడా కట్టలేని స్థితిలో మరణించారు. మద్యానికి మీనాకుమారి బానిసగా మారారు. దీనితో ఆమె లివర్ పూర్తిగా చెడిపోవడం జరిగింది.
శృంగార తారగా సౌత్ ఇండియాను ఏలిన సిల్క్ స్మిత మరణం కూడా విషాదమే. 1996లో సిల్క్ స్మిత చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించారు. ఆమె మరణానికి కారణం కెరీర్ మసక బారడమే అని సూసైడ్ నోట్ లో తెలిపారు.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత గురు దత్ అధికంగా ఆల్కహాల్ మరియు నిద్ర మాత్రలు తీసుకోని ఆత్మహత్య చేసుకున్నారు. భార్యతో విభేదాలు, ఒంటరితనం గురు దత్ ని ఆత్మహత్యకు పురిగొల్పాయి.
సీనియర్ నటి అచల సచ్ దేవ్ పుణేలో అత్యంత దయనీయ స్థితిలో మరణించారు. అమెరికాలో ఉంటున్న కొడుకు, ముంబైలోని కూతురు తనను నిర్లక్ష్యం చేయడంతో, మనో వేదనతో ఆమె మరణించడం జరిగింది.
225పైగా సినిమాలలో నటించిన బాలీవుడ్ సీనియర్ నటుడు ఏకే హంగల్ కడు పేదరికంలో మరణించారు. అనేక సక్సెస్ ఫుల్ చిత్రాలలో నటించిన హంగల్ 2012లో మరణించే నాటికి హాస్పిటల్ బిల్స్ కూడా కట్టలేని స్థితికి చేరుకున్నారు.
1967లో విడుదలైన హమ్రాజ్ మూవీతో వెండితెరకు పరిచమైన హీరోయిన్ విమి, అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అయితే భర్త శివ్ అగర్వాల్ తో విడాకుల తరువాత ఆమె జీవితం తలకిందులైంది. 1977లో ఆమె మరణించగా , చివరి రోజులు నానావతి హాస్పిటల్ లోని జనరల్ వార్డ్ లో గడిపారట.
నటుడు భరత్ భూషణ్ జీవితం విషాదాల మయం. కోట్ల ఆస్థి కలిగిన భరత్ జూదం వ్యసనం వలన అన్నీ కోల్పోయాడు. తన ఆస్తులన్నీ జూదం కోసం అమ్ముకోవడం జరిగింది. తన చిన్నప్పుడే తల్లి చనిపోగా, భార్య కాన్పు సమయంలో మరణించారు. తన కూతురు పోలియో భారినపడ్డారు. భరత్ జీవితం కూడా విషాదం మధ్య ముగిసింది.
నటుడు భగవాన్ దాదా బంగ్లా, కార్లతో విలాసవంతమైన జీవితం గడిపారు . చివరి రోజుల్లో అవేమి ఆయన దగ్గరలేరు. ఒంటరిగా పేదరికంలో భగవాన్ దాదా కన్నుమూశారు.