ఫ్యామిలీ ఫెస్టివల్లో సాయిపల్లవి సందడి.. వైట్ శారీలో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న లేడీపవర్ స్టార్
సాయి పల్లవి సహజమైన నటనే కాదు, సహజమైన అందానికి కేరాఫ్. టాలీవుడ్లో లేడీ పవర్ స్టార్ స్థాయి క్రేజ్ని సొంతం చేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ట్రెడిషనల్ లుక్లో కట్టిపడేస్తుంది.
సాయిపల్లవి తాజాగా తన ఫ్యామిలీ ఫంక్షన్లో పాల్గొంది. ఈ సందర్భంగా ఫ్యామిలీ మెంబర్స్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్యూట్ నవ్వుతో చిలిపి పోజులతో సాయిపల్లవి మరింతగా కట్టిపడేస్తుంది. ఆకట్టుకుంటుంది.
సాయిపల్లవి ఫ్యామిలీ హెతాయి హబ్బ ఫెస్టివల్లో పాల్గొంది. ఇది బడగాస్లో అతిపెద్ద పండుగ. ఈ పండుగలో భాగంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి సాయిపల్లవి పాల్గొని సందడి చేసింది. ఇందులో ఆమె వైట్ శారీలో మెరిసింది. క్యూట్ అందాలతో కనువిందు చేస్తుంది.
సాయిపల్లవి చాలా రోజుల తర్వాత కెమెరాకు చిక్కంది. అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లని ఖుషి చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా సాయిపల్లవి సినిమాలకు దూరం అవుతుందని, మ్యారేజ్ చేసుబోతుందనే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. సినిమాలు మానేసి డాక్టర్గా స్థిరపడాలనుకుంటుందని, ఓ ఆసుపత్రి కూడా నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారని వార్తలొచ్చాయి.
దీనికితోడు సాయిపల్లవి తమిళంలో ఓ సినిమా చేస్తుంది, కానీ కొత్తగా మరే సినిమాకి సైన్ చేయలేదు. దీంతో సాయిపల్లవి సినిమాలకు దూరమవుతుందనే దానికి బలం చేకూరుతుంది. అయితే తాజాగా దీనిపై సాయిపల్లవి స్పందించింది.
ఇందులో సాయిపల్లవి మాట్లాడుతూ, తాను ఎంబీబీఎస్ చదివినా నటిని కావాలనుకున్నానని, అప్పుడు తమ పేరెంట్స్ అభ్యంతరం చెప్పలేదని, తాను నటించిన చిత్రాలు, పాత్రలు ప్రేక్షకులకు నచ్చాలనే భావిస్తానని తెలిపింది. తనని అందరు తమ ఇంటి ఆడపడుచులా భావించడం సంతోషంగా ఉందని చెప్పింది. మంచి కథలు వస్తే భాషాభేదం లేకుండా నటిస్టానని చెప్పింది సాయిపల్లవి.
సాయిపల్లవి చివరగా `విరాటపర్వం` చిత్రంలో నటించింది. రానా హీరోగా రూపొందిన ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకుడు. ఈ చిత్రం కమర్షియల్ సత్తా చాటలేకపోయింది. మంచి ప్రశంసలందుకుంది. అయితే సాయిపల్లవి ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్తో ఓ సినిమా చేస్తుంది. దీన్ని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.