ఫ్రెండ్ అంతా మ్యారేజ్ చేసుకుంటున్నారు.. మెగా సుప్రీమ్ హీరో ఆగలేనంటున్నాడట?
కరోనా కలకలం.. లాక్డౌన్ దెబ్బకి యావత్ ప్రపంచం అల్లకల్లోలమవుతుంది. కానీ టాలీవుడ్కి మాత్రం మ్యారేజ్ సీజన్గా మారింది. ఇప్పుడు మరో హీరో బ్యాచ్లర్ లైఫ్కి గుడ్బై చెప్పబోతున్నాడట.
లాక్ డౌన్ టైమ్లో బడా ప్రొడ్యూసర్ దిల్రాజు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత రానా తాను ప్రేమించిన అమ్మాయి `ఎస్` చెప్పడంతో ఆ తంతు కానిచ్చేశాడు. నితిన్ సైతం తన ప్రియురాలిని అఫీషియల్గా తన వశం చేసుకున్నాడు. మరోవైపు యంగ్ హీరో నిఖిల్ సైతం తన ప్రియురాలినే మ్యారేజ్ చేసుకున్నారు. వీరితోపాటు చిన్న చిన్న నటులు కూడా పెళ్ళి కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు. మెగా డాటర్ నిహారిక ఎంగేజ్మెంట్ అయ్యింది. త్వరలో మ్యారేజ్ చేసుకోబోతుంది. నిన్ననే తాను మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు స్టార్ హీరోయిన్ కాజల్ స్పష్టం చేసింది.
ఇంత మంది పెళ్ళిళ్ళు చేసుకోవడంతో మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ సైతం పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.
తన ఫ్రెండ్స్ అంతా మ్యారేజ్ లైఫ్లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో తానూ ఇక ఆగలేకపోతున్నాడట. ఇదే విషయం తన ఫ్యామిలీకి చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో వాళ్ళు అమ్మాయిని చూసే కార్యక్రమాలు షురూ చేశారు.
అయితే పైవారంతా లవ్ మ్యారేజ్లు చేసుకోగా, సాయిధరమ్ తేజ్ మాత్రం పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకోబోతున్నారట.
ఇప్పటికే సాయిధరమ్ తేజ్ మదర్.. సాయికి అమ్మాయిని చూసిందని టాక్. అందుకు చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని. ఇక అధికారిక ప్రకటన వచ్చేదే ఆలస్యమని తెలుస్తుంది.
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ `సోలో బ్రతుకే సో బెటర్` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు దేవా కట్టాతో మరో సినిమా చేయబోతున్నారు.