ఎన్టీఆర్ తళుకులుః కొడుకుతో రైడింగ్లో, పాస్పోర్ట్ ఆఫీస్ ముందు, ఫ్యాన్ మ్యారేజ్ ఇన్విటేషన్ అందుకుంటూ..
ఎన్టీఆర్ ఈ మధ్య బయట బాగా కనిపిస్తున్నాడు. ఎప్పుడూ ప్రైవేట్ లైఫ్కే ఇష్టపడే ఎన్టీఆర్ తాజాగా కుమారుడితో కలిసి బైక్ రైడ్కెళ్లాడు. పాస్పోర్ట్ ఆఫీసులో మెరిశాడు. అదే సమయంలో ఫ్యాన్ నుంచి మ్యారేజ్ ఇన్విటేషన్ అందుకుంటూ కనిపించాడు.
ఎన్టీఆర్ కరోనా నేపథ్యంలో షూటింగ్లకు గ్యాప్ ఇచ్చి ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో ఫ్యామిలీకి టైమ్ ఇస్తున్నారు. వ్యక్తిగత పనులు కంప్లీట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. దీంతోపాటు అవసరం మేరకు అభిమానులను కూడా కలుస్తున్నారు.
తాజాగా ఎన్టీఆర్ కుమారుడితో కలిసి బైక్ రైడ్కి వెళ్లిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో బుల్లెట్ బైక్పై ముందు తన రెండో కుమారుడు భార్గవ్ రామ్ని కూర్చోబెట్టుకుని ఆదివారం వేళ హైదరాబాద్ రోడ్లపై కాస్త షికారుకెళ్లాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ పిక్ చక్కర్లు కొడుతుంది. ఇందులో బైక్పై మరో వ్యక్తి కూడా కనిపించడం విశేషం.
ఎన్టీఆర్, ప్రణతిలకు ఇద్దరు కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ జన్మించారు. ఇద్దరి పేర్లలో రామరావు వచ్చేలా ఎన్టీఆర్ తమ పిల్లలకు ఆ పేర్లు పెట్టడం విశేషం.
దీంతోపాటు పాస్పోర్ట్ ఆఫీసులో తళుక్కుమన్నాడు ఎన్టీఆర్. పాస్పోర్ట్ రినివల్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా పాస్ పోర్ట్ ఆఫీసర్తో ఫోటో దిగగా అదిప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇందులో బ్లాక్ షర్ట్ లో ఎన్టీఆర్ ఉన్నారు.
మరోవైపు ఓ అభిమాని ఎన్టీఆర్ని కలిశాడు. తన మ్యారేజ్కి ఆహ్వానిస్తూ ఎన్టీఆర్ ఇంటి వద్ద ఆహ్వానం అందజేశాడు ఫ్యాన్. అతను ఓ జిల్లాకి చెంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడని తెలుస్తుంది. ఈ సందర్భంగా బ్లాక్ టీషర్ట్ లో మాస్క్ ధరించి కనిపించాడు ఎన్టీఆర్.
ప్రస్తుతం ఎన్టీఆర్ `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్చరణ్ మరో హీరో. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో షూటింగ్ ఆపేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంటున్నారు. ఈ సినిమా అక్టోబర్ 13న దసరా కానుకగా విడుదల కానుంది.
మరోవైపు ఇటీవల తన 30వ చిత్రాన్ని ప్రకటించాడు ఎన్టీఆర్. `జనతా గ్యారేజ్` తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఇది జూన్లో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల కానున్నట్టు వెల్లడించారు.