Rashmika Mandanna: అదేంటి రష్మిక ఇలా మారింది.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ ఫొటోలు
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాలికి ఇటీవల గాయమైన విషయం తెలిసిందే. కాలికి పట్టీ కట్టిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ క్రమంలోనే ఛావా సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నారు..
- FB
- TW
- Linkdin
Follow Us
)
కాషాయపు దుస్తుల్లో రష్మిక
విక్కీ కౌశల్, రష్మిక జంటగా 'ఛావా' అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగా ఆదివారం ముంబయిలో నిర్వహించిన ప్రమోషన్ ఈవెంట్ లో రష్మిక తళుక్కుమంది. ఈ సందర్భంగా రష్మిక కాషాయ దుస్తుల్లో కనిపించి మెప్పించింది. సంభాజీ మహారాజు భార్య యేసుబాయి పాత్రలో రష్మిక ధరించిన దుస్తులు అందరి దృష్టిని ఆకర్షించాయి.
రష్మిక మందన్న కొత్త లుక్
కాగా గాయం నుంచి కోలుకున్న తర్వాత రష్మిక కొత్త లుక్ లో కనిపించి ఆకట్టుకుంది. దాదర్లోని థియేటర్కి వచ్చిన విక్కీ, రష్మికలకు ఘన స్వాగతం లభించింది. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సంభాజీ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేశారు. సినిమాపై ఆసక్తి నెలకొంది. ఛావా బాలీవుడ్లో కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే రష్మిక కొత్త లుక్ చూసిన కొందరు అభిమానులు మాత్రం రష్మిక లుక్ లో ఏదో గ్లో తగ్గిపోయిందని, ఇది గాయం తాలుకూ ప్రభావం అయ్యుండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు.
ఛావా సినిమా విశేషాలు
'ఛావా' ఛత్రపతి శివాజీ మహారాజు కుమారుడు సంభాజీ మహారాజు జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. రష్మిక, విక్కీ నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. ట్రైలర్లో వారి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
ఛావా సినిమా పాట వివాదం
అయితే ఛావా సినిమాకు సంబంధించి ఓ వివాదం నెలకొంది. ట్రైలర్ విడుదల తర్వాత లెజిమ్ డ్యాన్స్ తో కూడిన వీడియో వివాదానికి దారితీసింది. మహారాష్ట్రలో చాలా సంస్థలు ఈ పాటను వ్యతిరేకించాయి. దీంతో చిత్ర బృందం పాటను తొలగించింది.
ఛావా ముందస్తు బుకింగ్
మహారాష్ట్ర ప్రేక్షకులు 'ఛావా' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Sacnilk నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 9 సాయంత్రం 4:45 నాటికి 60.2 లక్షల రూపాయల ముందస్తు బుకింగ్ జరిగింది. 'ఛావా' ఇప్పటివరకు 1.54 కోట్ల ముందస్తు బుకింగ్ సాధించింది. కొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధంగా ఉంది. దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. మరి ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.