- Home
- Entertainment
- Ramayana: 4000 కోట్ల 'రామాయణ'లో రాముడిగా రణ్బీర్.. కూతురు రాహా అడిగిన ప్రశ్నలకు ఫిదా!
Ramayana: 4000 కోట్ల 'రామాయణ'లో రాముడిగా రణ్బీర్.. కూతురు రాహా అడిగిన ప్రశ్నలకు ఫిదా!
రణ్బీర్ కపూర్ నటిస్తున్న 'రామాయణం' సినిమా కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, అదొక ఎమోషనల్ జర్నీ. రాముడి పాత్ర పోషిస్తున్న రణ్బీర్, ఇంట్లో తన కూతురు రాహాకు అవే కథలు చెబుతున్నారట. రాహా అమాయకంగా అడిగే ప్రశ్నలు ఈ ప్రాజెక్ట్ను మరింత స్పెషల్గా మార్చేశాయి.
16

Image Credit : Instagram
రాముడిగా రణ్బీర్.. ఇంట్లో రామాయణ కథలు
‘రామాయణం’లో శ్రీరాముడి పాత్రను రణ్బీర్ కపూర్ పోషిస్తున్నారు. షూటింగ్తో పాటు, ఇంట్లో తన కూతురు రాహాకు రామాయణ కథలు చెబుతున్నానని, అందుకే ఈ ప్రాజెక్ట్ తనకు మరింత ప్రత్యేకంగా మారిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
26
Image Credit : Instagram
కూతురి ప్రశ్నలకు రణ్బీర్ కపూర్ ఫిదా
‘నేను తండ్రి అయ్యాక ఈ సినిమా అవకాశం రావడం నా అదృష్టం. సెట్లో రాముడి పాత్ర చేసి, ఇంటికి వెళ్లి నా కూతురు రాహాకు రామాయణ కథలు చెబుతున్నా. ‘ఈరోజు హనుమంతుడితో షూట్ చేశారా? సీతతోనా? ఈరోజు ఏం చేశారు?’ అని తను ఎంతో ఆసక్తిగా అడుగుతుంది’ అని రణ్బీర్ ఓ ఏజెన్సీతో అన్నారు.
36
Image Credit : Instagram
రామాయణం మన డీఎన్ఏలోనే ఉంది: రణ్బీర్ కపూర్
‘ఈ కథపై తను చూపిస్తున్న ఆసక్తి చూస్తుంటే, ఇది మన డీఎన్ఏలోనే ఉందనిపిస్తుంది. మన సంస్కృతి మన అంతర్చేతనలో బలంగా నాటుకుపోయింది. అందుకే ఇవన్నీ మనకు చాలా సహజంగా అనిపిస్తాయి. ఈ కథను ప్రపంచ ప్రేక్షకులకు చేర్చాలనుకుంటున్నాం’ అని రణ్బీర్ అన్నారు.
46
Image Credit : Asianet News
మొదట 'రామాయణం' వద్దనుకున్న రణ్బీర్ కపూర్
శ్రీరాముడి పాత్ర పోషించడానికి తాను సిద్ధంగా లేనని భావించి, మొదట్లో ఈ సినిమాను తిరస్కరించినట్లు రణ్బీర్ కపూర్ వెల్లడించారు. కానీ కూతురు రాహా పుట్టిన తర్వాత ఆయన ఆలోచనా విధానం మారిపోయింది.
56
Image Credit : Youtube@SonyMusicIndia
'రామాయణం'లో డబుల్ రోల్లో రణ్బీర్ కపూర్
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మెగా ఫిల్మ్ 'రామాయణం'లో రణ్బీర్ కపూర్ కేవలం శ్రీరాముడిగానే కాకుండా, పరశురాముడి పాత్రలోనూ కనిపించనున్నారని టాక్. ఇది ఆయన కెరీర్లోనే అతిపెద్ద, అత్యంత సవాలుతో కూడిన పాత్రగా భావిస్తున్నారు.
66
Image Credit : Asianet News
4000 కోట్ల బడ్జెట్, దేశంలోనే అతిపెద్ద సినిమా
‘రామాయణం’ బడ్జెట్ సుమారు 4000 కోట్ల రూపాయలు. నమిత్ మల్హోత్రా దీన్ని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యశ్ (రావణుడు), సాయి పల్లవి (సీత), సన్నీ డియోల్ (హనుమంతుడు), రవి దూబే (లక్ష్మణుడు) వంటి తారలు కూడా నటిస్తున్నారు. మొదటి భాగం అక్టోబర్ 2026లో, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది.
Latest Videos

