- Home
- Entertainment
- Ram Charan Health Update: ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్స్ తో రామ్ చరణ్కి ఆపరేషన్, హెల్త్ ఎలా ఉందంటే?
Ram Charan Health Update: ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్స్ తో రామ్ చరణ్కి ఆపరేషన్, హెల్త్ ఎలా ఉందంటే?
రామ్ చరణ్ కి మణికట్టు ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యింది. అయితే ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన డాక్టర్లు రామ్ చరణ్కి సర్జరీ చేయడం విశేషం. మరి ఇప్పుడు చరణ్ హెల్త్ ఎలా ఉందంటే?

సక్సెస్ఫుల్గా రామ్ చరణ్ ఆపరేషన్
రామ్ చరణ్ ఆపరేషన్ కోసం ఇటీవల కోయంబత్తూర్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన మణికట్టుకు గాయం కావడంతో సర్జరీ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం తరలి వెళ్లారు. చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్తోపాటు ఉపాసన కూడా ఆసుపత్రికి వెళ్లారు. దగ్గరుండి రామ్ చరణ్ బాగోగులు చూసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆపరేషన్ చేశారు. సక్సెస్ ఫుల్గా కుడిచేతి మణికట్టుకి సర్జరీ చేశారు. రామ్ చరణ్ `పెద్ది` సినిమా నుంచి మణికట్టు పెయిన్తో బాధపడుతున్నారు. ఆ సినిమా ప్రమోషన్స్ లోనూ చేతికి కట్టుతో కనిపించిన విషయం తెలిసిందే.
ప్రపంచంలోనే టాప్ మోస్ట్ డాక్టర్ తో ఆపరేషన్
ఈ శస్త్రచికిత్సకు గంగా హాస్పిటల్ చీఫ్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ నాయకత్వం వహించారు. ఎన్నో దశాబ్దాల అనుభవం, జాతీయ–అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు అందుకున్న ఆయన ఆర్థోపెడిక్ రంగంలో దిగ్గజంగా గుర్తింపు పొందారు. ఇదే డాక్టర్ రాజశేఖరన్ గతంలో చిరంజీవికి అత్యంత క్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్సను కూడా విజయవంతంగా నిర్వహించారు.
రామ్ చరణ్ కోసం అమెరికా నుంచి స్పెషల్ డాక్టర్
రామ్ చరణ్ మణికట్టు సమస్యకు అత్యుత్తమ చికిత్స అందించాలనే ఉద్దేశంతో, అమెరికాలోని మయామికి చెందిన ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ డాక్టర్ అలెహాండ్రో బాడియాను ( Dr. Alejandro Badia) , ప్రత్యేకంగా కోయంబత్తూరుకు ఆహ్వానించారు. చేతి, మణికట్టు శస్త్రచికిత్సలు, ముఖ్యంగా స్పోర్ట్స్ ఇంజరీల చికిత్సలో ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన నిపుణులు. సాధారణంగా ఆయన అపాయింట్మెంట్ పొందడమే ఎంతో కష్టమైన విషయం. అలాంటి ఆయన ప్రత్యేకంగా రామ్ చరణ్ కోసం రావడం విశేషం. డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ అలెహాండ్రో బాడియా ( Dr. Alejandro Badia), డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ అలాగే వారి నిపుణుల బృందం కలిసి ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
రామ్ చరణ్కి తోడుగా మెగా ఫ్యామిలీ
ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, మరో నాలుగు రోజుల విశ్రాంతి అనంతరం హైదరాబాద్కు తిరిగి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ సమయంలో చిరంజీవి–సురేఖ దంపతులు, ఉపాసన కోయంబత్తూరులోనే ఉండి రామ్ చరణ్కు తోడుగా ఉన్నారు. డాక్టర్ రాజశేఖరన్ కి చిరంజీవితో ఎంతోకాలంగా ఆత్మీయ స్నేహబంధం ఉంది. రామ్ చరణ్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

