వైరల్ ఫొటోలు: మతి పోగొట్టే రకుల్ యోగాసనాలు
లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ రద్దవ్వడంతో సెలబ్రిటీలు ఇంటికే పరిమితమయ్యిన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నారు. అంతేకాకుండా తమ ఆరోగ్యంపైనా దృష్టి పెడుతున్నారు. జిమ్,యోగాశనాలు వంటివి ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే ఆ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ కరోనా సమయంలో కచ్చితంగా పాటించాల్సినవి అభిమానులకు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్గా ఉండే హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్ ఈ లాక్డౌన్ సమయంలో చేసిన యోగా వీడియోలు, ఇంట్లో సరదాగా చేసిన వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఫిట్నస్ ఫ్రీక్ గా చెప్పబడే రకుల్ ..యోగాశనాలు ఫెరఫెక్ట్ గా వేస్తుంది. రామ్ దేవ్ బాబాకే పోటీ ఇస్తుందన్నట్లుగా ఉంటాయి. ఆ యోగాశనాలు ఫొటోలు చూస్తే మీరు కరెక్టే అంటారు.
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ఈ మధ్యన కాస్తంత తగ్గింది.ఈ మధ్యే విడుదలైన మన్మథుడు 2 ఫ్లాప్ కావడంతో రకుల్ కెరీర్కు తెలుగులో పెద్ద దెబ్బే పడింది.
ఈ నేపధ్యంలో రకుల్ కు ఆఫర్స్ వచ్చినా రాకపోయినా తనకు ఉన్న బిజినెస్ చూసుకుంటూ హాయిగా బతికేస్తోంది. అక్కడ కూడా తన ఫిట్నెస్ నే పెట్టుబడిగా పెడుతోంది. తనే తన జిమ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ ప్రమోట్ చేస్తోంది.
మొదటి నుంచి రకుల్ ప్రీత్ కమర్షియల్ బ్యూటీగానే పేరు తెచ్చుకుంది. తన సంపాదనని పెట్టుబడులు పెట్టడంలో ముందుంటోంది. స్టార్ హీరోలు కూడా చేయలేని ధైర్యం ఆమె చేస్తూ ఆశ్చర్యపరుస్తూంటుంది.
ఇప్పటికే F 45 పేరుతో జిమ్ మొదలుపెట్టి బిజినెస్ ఉమెన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. జిమ్ బిజినెస్లో రకుల్ ప్రీత్కు పోటీ ఇచ్చే వాళ్లు తెలుగు ఇండస్ట్రీలో కాదు.. సౌత్లోనే లేరు అనిపించుకుంది.
అటు సౌత్ ఇటు నార్త్ ఇండస్ట్రీస్లో హీరోయిన్గా మంచి జోరు మీద ఉన్నారు రకుల్ప్రీత్ సింగ్. లాక్డౌన్ వల్ల షూటింగ్లు బంద్ కావడంతో రకుల్ స్పీడ్కు బ్రేక్ పడ్డట్లయింది.
దీంతో ఇంటికే పరిమితమైన రకుల్ వంటలు చేస్తూ, సినిమాలు చూస్తూ, వర్కౌట్స్తోనూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అప్పుడప్పుడూ ఫ్యాన్స్ తో చిట్ చాట్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
స్టార్ హీరోయిన్లంతా ఇప్పుడు వెబ్ సీరీస్ లో వైపు ప్రయాణం పెట్టుకున్నారు. సమంత, కాజల్, తమన్నా వంటి స్టార్స్ ఇప్పటికే వెబ్ సీరీస్ కు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేసి ట్రెండ్ లో ఉన్నామంటున్నారు. ఈ రూటులో త్వరలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరనుంది.
మన్మధుడు 2 తర్వాత తెలుగులో రకుల్ కు ఆఫర్స్ రావటం లేదు. అయితే హిందీ సినిమాలు చేయటం ఆమెకు ప్లస్ అయ్యింది. తన పీఆర్ టీమ్ ని మార్చిన రకుల్ కు మంచి ఆఫర్ ..వెబ్ సీరిస్ రూపంలో వచ్చిందని సమాచారం.
ముంబై కు చెందిన పీఆర్ ఏజెన్సీ వాళ్లు ....రకుల్ కు అమెజాన్ ప్రైమ్ కు చెందిన ఓ భారీ బడ్జెట్ వెబ్ సీరిస్ లో ఆఫర్ తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది.
రకుల్ కు బాగానే ముట్టచెప్పే ఈ వెబ్ సీరిస్ లో బోల్డ్ సీన్స్ సైతం ఉంటాయంటున్నారు. త్వరలో ప్రారంభమయ్యే ఈ వెబ్ సీరిస్ ...తెలుగు తో సహా దక్షిణాది భాషలన్నిటిలోనూ డబ్ కానుంది. దాంతో రకుల్ చాలా హ్యాపీగా ఉందిట.
ఈ వెబ్ సీరీస్ గురించి నటి రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ నాకు కూడా వెబ్ సీరీస్ లో నటించమని చాలా ఆఫర్లు వస్తున్నాయి. నాకూ ఆసక్తిగానే వుంది. కొత్త పాత్రలు వస్తే, మంచి ఆఫర్ అనిపిస్తే తప్పకుండా చేస్తాను' అని చెప్పింది.
పాలిటిక్స్ గురించి రకుల్ మాట్లాడుతూ...రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేదు. కానీ దేశ రాజకీయాల్లో ఏం జరుగుతున్నదనే అంశాలపై దృష్టి పెడుతాను. తాజా పాలిటిక్స్ చూస్తే చాలా బాధగా ఉంది అని చెప్పుకొచ్చింది.
అలాగే రాజకీయాల్లో విపరీతమైన డ్రామ్ కనిస్తుంటుంది. టీవీ రేటింగ్ల కోసం పెద్ద ఎత్తున నేతలు ఫైట్ చేస్తూ కనిపిస్తుంటారు. నేటితరం పాలిటిక్స్ టీవీ సీరియల్స్ను మించేలా కనిపిస్తున్నాయి అని రకుల్ పేర్కొన్నారు.
విభజించి పాలించే విధానం ఆపండి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై సెన్సేషనల్ కామెంట్స్ రకుల్ చేయడం రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. విభజించి పాలించే విధానాన్ని బీజేపీ మానుకోవాలి. దేశమంతా ఒక్కటే అనే భావన కల్పించాలి. ప్రతీ రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రకుల్ అంది.
మరో ప్రక్క ఈ వెబ్ సీరిస్ తో పాటు రకుల్...హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. ఆ మధ్యన అజయ్ దేవ్గన్తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడిచేసింది.
దాంతో ఆమెకు మరికొన్ని బాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయి. అయితే వాటిల్లో బెస్ట్ ఏరుకుని చేస్తానంటోంది. అంతేకాదు...జనాల్లో ఎప్పుడూ నానటం కోసం...కొత్త అందాలతో వీలున్నప్పడల్లా హాట్ ఫోటో షూట్లు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టే పోగ్రాం పెట్టుకుంటోంది.
నాకు ఉదయం 6 గంటలకు షూటింగ్ ఉందంటే ఆ రోజు నాలుగు గంటలకే లేచి వర్కౌట్, యోగా చేసి టైమ్కి సెట్లో ఉంటాను. షూటింగ్ అనే కాదు.. టైమింగ్స్ విషయంలో కరెక్ట్గా ఉండాలని అవసరానికి మించి నన్ను నేను కష్టపెట్టుకుంటాను. దాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను.
నా ఆలోచనలు కొంచెం ఆధ్యాత్మికంగా ఉంటాయి. అతిగా ఆనందపడటం, అతిగా బాధపడటం అనేది ఉండదు. ప్రస్తుతం విజయాలకు, అపజయాలకు అంతగా ప్రభావితం కాని స్థితిలో ఉన్నాను.
టైమ్ వేస్ట్ చేసేవారంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. అలాగే ఎవరైతే వారి పని పట్ల అంకితభావంతో ఉండరో వారు కూడా నాకు నచ్చరు అంటోంది రకుల్.
విజయానికి నిర్వచనం చెప్తూ.. మనం ఎంత సంతోషంగా ఉంటున్నామన్నదే మన విజయాలకు చిహ్నం. మన జీవితంలో సంతోషం లేనప్పుడు ఎంత డబ్బు, ఎంత కీర్తి ఉంటే మాత్రం ఏం లాభం? అంటుందామె.