MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి ఇండస్ట్రీ హిట్‌ని రీమేక్‌ చేసి ఖంగుతిన్న రజనీకాంత్‌.. మెగాస్టార్‌ని నమ్ముకుంటే ఊహించని దెబ్బ

చిరంజీవి ఇండస్ట్రీ హిట్‌ని రీమేక్‌ చేసి ఖంగుతిన్న రజనీకాంత్‌.. మెగాస్టార్‌ని నమ్ముకుంటే ఊహించని దెబ్బ

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన `యముడికి మొగుడు` సినిమా తెలుగులో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కానీ ఇది తమిళంలో డిజాస్టర్‌ అయ్యింది. 

2 Min read
Aithagoni Raju
Published : Aug 03 2025, 07:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి మూవీ రీమేక్‌ చేసి షాక్‌ తిన్న రజనీకాంత్‌
Image Credit : stockPhoto

చిరంజీవి మూవీ రీమేక్‌ చేసి షాక్‌ తిన్న రజనీకాంత్‌

ఇప్పుడు రీమేక్‌ సినిమాలకు కాలం చెల్లింది. ఓటీటీలు, పాన్‌ ఇండియా కల్చర్‌ రావడంతో రీమేక్‌ చిత్రాలు పెద్దగా వర్కౌట్‌ కావడం లేదు. కానీ కరోనాకి ముందు వరకు రీమేక్‌ సినిమాలు విశేష ఆదరణ పొందాయి. బ్లాక్‌ బస్టర్స్ గా నిలిచాయి. ఇంకా చెప్పాలంటే ఒరిజినల్‌ చిత్రాలకంటే రీమేక్‌ అయిన సినిమాలే బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్స్ గా నిలిచాయి. రికార్డులను తిరగరాశాయి. అయితే మెగాస్టార్‌ చిరంజీవి ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన సినిమాని రీమేక్‌ చేసి బోల్తా పడ్డారు రజనీకాంత్‌. ఆ సినిమా ఏంటి? ఆ కథేంటో తెలుసుకుందాం.

DID YOU
KNOW
?
చిరు మూవీతో రజనీ బ్లాక్‌ బస్టర్‌
రజనీకాంత్‌.. చిరంజీవి హీరోగా వచ్చిన `అత్తకు యముడు అమ్మాయికి మొగుడు` సినిమాని `మప్పిల్లై`(1989) పేరు రీమేక్‌ చేసి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు.
25
`యముడికి మొగుడు`తో ఇండస్ట్రీ హిట్‌ అందుకున్న మెగాస్టార్‌
Image Credit : Telugu lyrics world

`యముడికి మొగుడు`తో ఇండస్ట్రీ హిట్‌ అందుకున్న మెగాస్టార్‌

1980, 90లో చిరంజీవి కెరీర్‌ పీక్‌లో ఉంది. ఆయన వరుసగా విజయాలు అందుకున్నారు. కొడితే కుంభస్థలమే అనేట్టుగా ఆయన సినిమాలు బాక్సాఫీసు వద్ద రచ్చ చేశాయి. వరుసగా ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. అలా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన మూవీలో `యముడికి మొగుడు` ఒకటి. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది. చిరంజీవి ఫ్రెండ్స్ సుధాకర్‌, జీవీ నారాయణరావు నిర్మించారు. వాళ్లే కథ అందించారు. ఇందులో చిరంజీవికి జోడీగా విజయశాంతి, రాధా నటించారు.

Related Articles

Related image1
లోకేష్‌ కనగరాజ్‌పై రజనీ సెటైర్లు.. బాల్య స్నేహితుడిని గుర్తు చేసుకుంటూ నాగ్‌ గురించి ఏమన్నాడంటే
Related image2
కోట శ్రీనివాసరావుని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కొడితే సూపర్‌ స్టార్‌ కృష్ణ రియాక్షన్‌ ఏంటో తెలుసా? కోటకి ఫ్యూజుల్‌ ఔట్‌
35
లాభాల్లో కొంత భాగం పత్తిరైతులకు సాయం చేసిన నిర్మాతలు
Image Credit : imdb

లాభాల్లో కొంత భాగం పత్తిరైతులకు సాయం చేసిన నిర్మాతలు

ఈ మూవీ ఫాంటసీ ఎలిమెంట్లతో ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్షన్‌, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలు మేళవింపుతో రూపొందింది. ముఖ్యంగా పాటలు ఉర్రూతలూగించాయి. రాజ్‌ కోటి అదిరిపోయే సాంగ్స్ అందించారు. `అందం హిందోళం` పాట ఈ సినిమాలోనిదే. వీటిలో చిరంజీవి డాన్సులు, హీరోయిన్ల గ్లామర్‌ మాస్‌ ఆడియెన్స్ ని ఆద్యంతం అలరించాయి. అలా 1988లో ఏప్రిల్‌ 28న ఈ సినిమా విడుదలైంది. విశేష ఆదరణ పొందింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో నిర్మాతలు లాభాల బాటపట్టారు. అంతేకాదు లాభాల్లో కొంత భాగం ఆ ఏడాది కరువ వల్ల ఆత్మహత్య చేసుకున్న పత్తిరైతు కుటుంబాలకు సహాయం అందించారు.

45
`యముడికి మొగుడు` మూవీని రీమేక్‌ చేసిన రజనీకాంత్‌
Image Credit : Youtube/@StudioPlusEntertainmentCinemas

`యముడికి మొగుడు` మూవీని రీమేక్‌ చేసిన రజనీకాంత్‌

`యముడికి మొగుడు` సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ కావడంతో ఈ చిత్రంపై సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కన్నుపడింది. ఆయన దీన్ని రీమేక్‌ చేశారు. `అథిసయ పిరవి` పేరుతో తమిళంలో రీమేక్‌ చేశారు. ఎస్పీ ముతురామన్‌ దర్శకత్వం వహించారు. తెలుగులో వచ్చిన రెండేళ్ల తర్వాత ఈ సినిమా వచ్చింది. 1990 జూన్‌ 15న విడుదలైన ఈ సినిమా ఘోర పరాజయం చెందింది. చిరంజీవిని నమ్ముకుని చేస్తే సూపర్‌ స్టార్‌కి గట్టి దెబ్బ పడింది.

55
చిరంజీవి మూవీతో దెబ్బతిన్న రజనీకాంత్‌
Image Credit : X/Youtube India

చిరంజీవి మూవీతో దెబ్బతిన్న రజనీకాంత్‌

చిరంజీవి మాస్‌ ఇమేజ్‌ వేరు. ఆయన కామెడీ టైమింగ్‌ వేరు. హీరోయిన్లతో రొమాన్స్, అదిరిపోయే పాటలు ఈ మూవీకి పెద్ద అసెట్‌. కానీ తమిళంలో అవి అంతగా వర్కౌట్‌ కాలేదు. దీంతో ఆడియెన్స్ రిజెక్ట్ చేశారు. అలా చిరంజీవి ఇండస్ట్రీ హిట్‌ ని రీమేక్‌ చేసి రజనీ బోల్తా పడ్డారు. రజనీకాంత్‌ ప్రస్తుతం `కూలీ` మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. శనివారమే ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచింది. ఇందులో నాగార్జున, అమీర్‌ ఖాన్‌, ఉపేంద్ర, శృతి హాసన్‌ వంటి వారు నటిస్తుండగా, లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్ట్ 14న విడుదల కాబోతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved