- Home
- Entertainment
- రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ఇద్దరినీ ఫిదా చేసిన స్టార్.. ముగ్గురు హీరోలలో ఎవ్వరూ అతడిని మ్యాచ్ చేయలేదు
రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ఇద్దరినీ ఫిదా చేసిన స్టార్.. ముగ్గురు హీరోలలో ఎవ్వరూ అతడిని మ్యాచ్ చేయలేదు
రాజమౌళికి తాను దర్శకత్వం వహించిన చిత్రాలలో బాగా ఇష్టమైన చిత్రం మర్యాద రామన్న అని పలు సందర్భాల్లో తెలిపారు. అయితే రాజమౌళికి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి ఇద్దరికీ బాగా ఇష్టమైన చిత్రం ఒకటి ఉంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
పరాజయం లేని దర్శకుడు
దర్శక ధీరుడు రాజమౌళి తన తొలి చిత్రం స్టూడెంట్ నెంబర్ 1 నుంచి చివరగా రూపొందించిన ఆర్ఆర్ఆర్ వరకు అన్నీ విజయాలే సాధించారు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీపై కనీ వినీ ఎరుగని అంచనాలు నెలకొన్నాయి.
రాజమౌళికి ఇష్టమైన చిత్రం
రాజమౌళికి తాను దర్శకత్వం వహించిన చిత్రాలలో బాగా ఇష్టమైన చిత్రం మర్యాద రామన్న అని పలు సందర్భాల్లో తెలిపారు. అయితే రాజమౌళికి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి ఇద్దరికీ బాగా ఇష్టమైన చిత్రం ఒకటి ఉంది. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళికి యాంకర్ నుంచి ప్రశ్న ఎదురైంది. సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర చిత్రాలలో మీకు ఇష్టమైన చిత్రం ఏది అని యాంకర్ ప్రశ్నించారు.
విక్రమార్కుడు మూవీ
రాజమౌళి బదులిస్తూ చాలా టఫ్ క్వశ్చన్ అని అన్నారు. ఏదైనా ఒక చిత్రం పేరు మాత్రమే చెప్పాలి అని యాంకర్ కోరడంతో రాజమౌళి వెంటనే విక్రమార్కుడు అని చెప్పారు. విక్రమార్కుడు మూవీ గురించి రాజమౌళి చాలా సందర్భాల్లో కామెంట్ చేశారు. ఆ మూవీ ఫస్టాఫ్ రవితేజ సినిమా అయితే సెకండ్ హాఫ్ తన సినిమా అని రాజమౌళి ఇంటర్వ్యూలో తెలిపారు.
అతడి టాలెంట్ ని ఎవరూ మ్యాచ్ చేయలేదు
విజయేంద్రప్రసాద్ కూడా ఓ సందర్భంలో విక్రమార్కుడు మూవీ గురించి చెబుతూ.. విక్రమార్కుడు చిత్రాన్ని చాలా భాషల్లో రీమేక్ చేశారు. తమిళం, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషల్లో నేను విక్రమార్కుడు రీమేక్ చిత్రాలను చూశా. తమిళంలో కార్తీ, కన్నడలో కిచ్చా సుదీప్, హిందీలో అక్షయ్ కుమార్ నటించారు. కానీ ఎవ్వరూ రవితేజ టాలెంట్ ని మ్యాచ్ చేయలేకపోయారు అని ప్రశంసలు కురిపించారు. విక్రమార్కుడు మూవీ అంటే తనకు ప్రత్యేకమైన ఇష్టమని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
అది చాలు, ఏ అవార్డు అవసరం లేదు
రవితేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విక్రమార్కుడు మూవీలో ఆడవాళ్ళతో గొడవపడే కామెడీ సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ లో నటించేటప్పుడు చుట్టూ 200 మంది సెట్ లో ఉన్నారు. సీన్ అయిపోయినప్పటికీ రాజమౌళి కట్ చెప్పడం లేదు. మైక్ కింద పడేసి పగలబడి నవ్వుతున్నాడు. సెట్ లో ఉన్న 200 మంది నవ్వుతూనే ఉన్నారు. అది చాలు నాకు..ఏ అవార్డు అవసరం లేదు అని రవితేజ తెలిపారు. కిక్ చిత్రంలోని పాత్రని, విక్రమార్కుడు మూవీలోని విక్రమ్ రాథోడ్ పాత్రని కలిపి ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని రవితేజ అన్నారు.