- Home
- Entertainment
- పద్మ అవార్డు తెచ్చుకోవడం నాకు 2 నిమిషాల పని..చిరంజీవి, బాలయ్యపై రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్
పద్మ అవార్డు తెచ్చుకోవడం నాకు 2 నిమిషాల పని..చిరంజీవి, బాలయ్యపై రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పద్మ అవార్డుల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
కామెడీ చిత్రాల రారాజు
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి పరిచయం అవసరం లేదు. రాజేంద్ర ప్రసాద్ తెలుగులో 80,90 దశకాలలో కామెడీ చిత్రాల రారాజుగా వెలుగొందారు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. హాస్యం పండించడంలో రాజేంద్రప్రసాద్ కి ప్రత్యేకమైన శైలి ఉంది.
షష్టిపూర్తి మూవీ
రాజేంద్ర ప్రసాద్ రీసెంట్ గా నటించిన చిత్రం షష్టిపూర్తి. అలనాటి నటి అర్చనతో కలిసి ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ నటించారు. ఇటీవల మే 30న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయనకి పద్మ అవార్డుల గురించి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
పద్మ అవార్డు ఇంకా ఎందుకు రాలేదు ?
మీకు సమకాలీకులైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ పద్మ అవార్డులు పొందారు. మీ తర్వాత వచ్చిన వాళ్లకు కూడా కొంతమందికి పద్మ అవార్డులు దక్కాయి. కానీ మీకు మాత్రం ఇంతవరకు పద్మ అవార్డు రాలేదు.. కారణం ఏంటి అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి రాజేంద్రప్రసాద్ సమాధానం ఇస్తూ తానెప్పుడు పద్మా అవార్డుల గురించి ఆలోచించలేదని అన్నారు. అవార్డు రాలేదని బాధపడింది కూడా లేదని అన్నారు. ఒకవేళ పద్మ అవార్డులు పొందిన వారి కంటే నేను టాలెంటెడ్ కాదేమో? వాళ్లకు ఉన్న అర్హత నాకు లేదేమో? అని అంటే నా అభిమానులు ఊరుకోరు.
అవార్డు తెచ్చుకోవడం 2 నిమిషాల పని
పద్మా అవార్డు ఇవ్వకపోవడానికి స్పష్టమైన కారణం నాకు కూడా తెలియదు. అవార్డు దక్కించుకోవడంలో నేను వెనకబడిపోయానేమో. మీ అందరికీ తెలుసు.. పీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను వెళ్లి పద్మ అవార్డు ఇవ్వమని అడిగితే ఏమవుతుంది? జస్ట్ రెండు నిమిషాలు పని అంతే.. వెంటనే పద్మ అవార్డు వచ్చేస్తుంది. కానీ నేను ఆ పని చేయలేదు. నేను ఎప్పుడూ ఎవరిని నాకు ఇది కావాలి అని కానీ, ఇది ఇవ్వండి అని కానీ అడిగింది లేదు అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
రాజేంద్ర ప్రసాద్ కి పీవీ నరసింహారావు అభిమాని
రాజేంద్రప్రసాద్ కి పీవీ నరసింహారావు పెద్ద అభిమాని అని అప్పట్లో చెప్పేవారు. ఇంట్లో కంచం ఉండాలి, మంచం ఉండాలి, రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమా ఉండాలి అని పీవీ నరసింహారావు చెప్పినట్లు రాజేంద్రప్రసాద్ చాలా సందర్భాల్లో గుర్తు చేస్తున్నారు. మీకు ఇంకా పద్మ అవార్డు రాలేదా? అని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఆశ్చర్యపోతూ తనని అడుగుతుంటారని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
స్టార్ డమ్ ఊరికే రాదు
చిరంజీవి, బాలకృష్ణ క్రేజ్ గురించి రాజేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఊరికే స్టార్లు అయిపోయారు. ఈరోజుకీ చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే వాతావరణం ఎలా ఉంటుందో చూడండి. బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుంటే కూడా అదే పరిస్థితి ఉంటుంది. బాలయ్య అఖండ చిత్రం నాకు చాలా బాగా నచ్చింది అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అప్పట్లో చంద్రమోహన్ తో కానీ రాజేంద్ర ప్రసాద్ తో కానీ హీరోయిన్ గా నటిస్తే వాళ్ళకి స్టార్ డమ్ గ్యారెంటీ అని చెప్పేవారు. అది నిజమే అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నాతో నటించిన 30 మంది పైగా హీరోయిన్లు మంచి పొజిషన్ కి వెళ్లారని రాజేంద్రప్రసాద్ గుర్తు చేసుకున్నారు.