హీరోయిన్లు అవమానించిన యంగ్ హీరో.. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు
ఎక్కడైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు రిజెక్ట్ చేసిన హీరోయిన్లు ఉన్నారేమో. కాని హీరోయిన్లు రిజెక్ట్ చేసిన హీరో ఎవరో మీకు తెలుసా..? ఎంతో మంది హీరోయిన్లు రిజెక్ట్ చేసినా.. చివరకు ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన హీరో ఏమంటున్నాడంటే..?

దర్శకుడిగా ప్రదీప్ రంగనాథన్
'కోమలి' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్ రంగనాథన్ చెన్నైలో పుట్టి పెరిగి ఐటి కంపెనీలో ఉద్యోగం చేవారు. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలి యూట్యూబ్లో పాపులర్ అయ్యాడు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం 'కోమలి'. ఈ సినిమా లో జయం రవి హీరోకాగా. అతనికి ఈ సినిమా కు మంచి పేరు తెచ్చిపెట్టింది.
Also Read: ఒక్క ఏడాదిలో 36 సినిమాల్లో నటించిన హీరో, ఎవరికి సాధ్యం కాని రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ ఎవరు?
కోమలి సినిమా దర్శకుడు
యదార్థమైన కథ, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కోమలి తర్వాత లవ్ టుడే సినిమాకు దర్శకత్వం వహించి ఈసినిమాలో ప్రదీప్ స్వయంగా హీరోగా నటించారు. ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా సైమా అవార్డు, ఉత్తమ తొలి నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా అందుకున్నాడు. 5 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా 100 కోట్ల వసూళ్లు వచ్చాయి.
Also Read: ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన సినిమా ..?
ప్రదీప్ను వద్దన్న హీరోయిన్లు.
ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ప్రదీప్కు జోడీగా ఇవానా నటించారు. సత్యరాజ్, రాధిక, యోగి బాబు, రవీనా రవి వంటి వారు నటించారు. ప్రస్తుతం అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ప్రదీప్ నటిస్తున్న 'డ్రాగన్' సినిమా 21న విడుదల కానుంది.
ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ప్రదీప్ మాట్లాడుతూ.. నా పక్కన నటించడానికి చాలా మంది హీరోయిన్లు ఆలోచించారు. నీతో నటించం అని చెప్పకనేచెప్పారు. లవ్ టుడే సినిమా కోసం చాలా మంది హీరోయిన్లను సంప్రదించాను. కానీ ఎవరూ ఒప్పుకోలేదు. నన్ను తిరస్కరించారు" అని బాధను వెల్లడించారు ప్రదీప్. ఇక ఇప్పుడు డ్రాగన్ సినిమాలో అనుపమా పరమేశ్వరన్తో కలిసి నటిస్తున్నానని గర్వంగా చెప్పారుప్రదీప్.
Also Read: రష్మిక మందన్న కి ముద్దు పేరు పెట్టిన విజయ్ దేవరకొండ, రౌడీ హీరో ఏమని పిలుస్తాడంటే
ప్రదీప్ నటించిన డ్రాగన్ సినిమా
ఈ చిత్రంలో ప్రదీప్తో పాటు గయాడు లోహర్, జార్జ్ మేరియన్, కెఎస్ రవికుమార్, మిస్కిన్, గౌతమ్ మీనన్, స్నేహ (అతిధి పాత్ర), అశ్వత్ మారిముత్తు (అతిధి పాత్ర), విజె చిట్టూ తదితరులు నటించారు. 37 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను ఏజిఎస్ నిర్మించింది. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. డ్రాగన్ తర్వాత లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, పిఆర్4 సినిమాల్లో ప్రదీప్ నటిస్తున్నారు.
Also Read: సమంత కాదు, త్రిష కాదు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కిన షాకింగ్ హీరోయిన్ ఎవరు..?
Also Read: రోజా ఎత్తుకుని ఆడించిన పాన్ ఇండియా హీరో, ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
Also Read: 16 ప్లాప్ సినిమాలు ఇచ్చిన హీరో, ప్రస్తుతం 100 కోట్ల తీసుకుంటున్న స్టార్ ఎవరు?