- Home
- Entertainment
- రీ రిలీజ్ కు ముందే రికార్డ్ క్రియేట్ చేసిన ప్రభాస్ వర్షం సినిమా, ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయంటే?
రీ రిలీజ్ కు ముందే రికార్డ్ క్రియేట్ చేసిన ప్రభాస్ వర్షం సినిమా, ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయంటే?
తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ ట్రెండ్ మరోసారి ఊపందుకుంది. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తూ భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఇటీవలి కాలంలో చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం తిరిగి విడుదలై మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే.ఇక తాజాగా ప్రభాస్ వర్షం సినిమా కూడా మూడో సారి రీరిలీజ్ కు రెడీ అయ్యింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన వర్షం సినిమా మళ్లీ రీరిలీజ్ కానుంది. 2004లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమాను దర్శకుడు శోభన్ తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ప్రభాస్ సరసన త్రిష హీరోయిన్ గా నటించగా.. ఈ సినిమాలోని పాటలు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.
అప్పటివరకు ఫ్లాప్ సినిమాలతో నెట్టుకొస్తున్న ప్రభాస్ కెరీర్కు వర్షం మలుపు తిప్పింది. ఈ సినిమా విడుదల తర్వాత ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది. రూ.8 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఆ సమయంలో రూ.32 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ను రాబట్టి సూపర్ హిట్గా నిలిచింది.
ఇప్పుడు దాదాపు 21 ఏళ్ల తర్వాత ఈ సినిమాను మళ్లీ థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. మే 23న ఈ సినిమాను 4K వెర్షన్లో విడుదల చేయనున్నారు. ఇది మూడోసారి రీరిలీజ్ కావడం విశేషం. విడుదలకు ముందే ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే 6,000 టికెట్లు అమ్ముడవ్వగా, కేవలం 15 షోలు మాత్రమే ప్రదర్శించనున్నట్లు సమాచారం.
లవ్, కామెడీ, యాక్షన్ వంటి అంశాలతో ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకుల్ని అలరించింది. దేవిశ్రీ చేసిన మ్యాజిక్ మ్యూజిక్ ఈసినిమాకు హైలెట్ అని చెప్పాలి. ప్రభాస్, త్రిషతో పాటు గోపీచంద్, ప్రకాశ్ రాజ్ లాంటి నటులు ఈసినిమాకు ప్లస్ అయ్యారు. ఇక మే 23న మళ్లీ ఈ చిత్రాన్ని వెండితెరపై చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.