- Home
- Entertainment
- ప్రభాస్ నుంచి అల్లు అర్జున్ వరకు, బాక్సాఫీస్ను శాసించే 50 ఏళ్లలోపు టాప్ హీరోలు ఎవరంటే?
ప్రభాస్ నుంచి అల్లు అర్జున్ వరకు, బాక్సాఫీస్ను శాసించే 50 ఏళ్లలోపు టాప్ హీరోలు ఎవరంటే?
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ ను శాసించబోయే 50 ఏళ్లలోపు టాప్ హీరోల లిస్ట్ ను ఓర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. రికార్డులు బద్దలు కొట్టే సినిమాలు, భారీ ఇమేజ్ , క్రేజీ లైనప్లతో స్టార్డమ్కు కొత్త అర్థం చెప్పిన స్టార్స్ ఎవరంటే?

బాక్సాఫీస్ను శాసించే 50 ఏళ్లలోపు టాప్ హీరోలు
మారుతున్న భారతీయ సినిమా రంగంలో ప్రాంతీయ హద్దులు చెరిగిపోతున్నాయి. ఈ సమయంలో కొందరు హీరోలు పాన్-ఇండియా స్థాయిలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రతీ మార్కెట్లోనూ బ్లాక్బస్టర్ విజయాలు అందుకుంటూ తమ పరిధిని విస్తరించుకుంటున్నారు. 2026లో ఇండియన్ సినిమాను శాసించబోయే 50 ఏళ్లలోపు టాప్ 10 స్టార్ల జాబితాను ఓర్మాక్స్ మీడియా విడుదల చేసింది. అందులో మన సౌత్ హీరోలు ఎవరున్నారంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
'ఐకాన్ స్టార్'గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్, ఇండియన్ సినిమాలో మోస్ట్ వాంటెడ్ స్టార్లలో ఒకడిగా ఉన్నాడు. పాన్ ఇండియా హీరోగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. టాలీవుడ్ లో ఇప్పటికే పెద్ద స్టార్ అయినప్పటికీ, 'పుష్ప 2: ది రూల్' అద్భుతమైన విజయంతో అతని పాపులారిటీ దేశవ్యాప్తంగా ఆకాశాన్నంటింది. కెరీర్ బిగినింగ్ లో 'ఆర్య', 'బన్ని', 'రేసుగుర్రం' వంటి హిట్ల నుంచి 'అల వైకుంఠపురములో' వంటి కమర్షియల్ సక్సెస్ల వరకు, అల్లు అర్జున్ తన మాస్ అప్పీల్తో పాటు డ్యాన్స్, యాక్టింగ్, యాక్షన్ లో కొత్తదనం చూపిస్తూ.. కెరీర్ ను బిల్డ్ చేసుకున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్
ప్రభాస్
రిషబ్ శెట్టి
రాక్ స్టార్ యష్..
'KGF: చాప్టర్ 1'తో యష్ పాన్ ఇండియా సినిమా ముఖచిత్రాన్నే మార్చేశాడు. ఒక్క రాత్రిలోనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు. అతని 'రాఖీ భాయ్' పాత్ర అన్ని భాషల్లో ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. 'KGF: చాప్టర్ 2' సినిమాతో కన్నడ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిపి, తన సూపర్స్టార్ హోదాను పదిలం చేసుకున్నాడు. ప్రస్తుతం యష్ 'టాక్సిక్', సినిమాతో అభిమానులను ఊరిస్తున్నాడు. అంతే కాదు రామాయణ సినిమాలో యష్ ను రావణుడి పాత్రలో చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా, తమ ప్రభావంతోనే ఈ స్టార్లు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని ఓర్మాక్స్ మీడియా వెల్లడించింది.

