అనురాగ్ కశ్యప్ గదిలోకి తీసుకెళ్ళి బలవంతం చేశాడు..పాయల్ ఘోష్ సంచలన కామెంట్స్
ఓ దర్శకుడు తనకు బ్లూ ఫిల్మ్ చూపించి పడుకోవాలని డిమాండ్ చేశాడని సంచలన కామెంట్ చేసి హల్చల్ చేసిన పాయల్ ఘోష్ తాజాగా మరోసారి మరో సంచలనానికి తెరలేపింది. తనని పడుకోవాలని అడిగిన ఆ దర్శకుడెవరో చెప్పి షాక్ ఇచ్చింది.
బాలీవుడ్లో సినిమా ఛాన్స్ లు లేక, నటిగా రాణించలేక ఇబ్బంది పడుతున్న పాయల్ ఘోష్ ఇటీవల కాలంలో సెన్సేషనల్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంది. సోషల్ మీడియాకి ఫుల్ మసాలాని అందిస్తుంది. తాజాగా మరో షాకింగ్ కామెంట్ చేసింది. తనని రూమ్లోకి తీసుకెళ్ళి ఆ దర్శకుడు అనురాగ్ కశ్యప్ అని చెప్పింది.
ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పాయల్ మాట్లాడుతూ అనేక సంచలన విషయాలను పంచుకుంది. నన్ను ఇబ్బంది పెట్టిన దర్శకుడు ఎవరో కాదు అనురాగ్ కశ్యప్. అలాంటి వ్యక్తి ఇప్పుడు మహిళా స్వేచ్ఛ కోసం మాట్లాడుతున్నాడని, ఆయన మాటలు కామెడీగా ఉన్నాయని మండిపడింది.
`నేను అనురాగ్తో మాట్లాడిన నెక్ట్స్ డే ఆయన్ని కలిశాను. ఆయన మద్యం తాగుతూ ఉన్నాడు. కలిసిన తర్వాత మరో గదిలోకి తీసుకెళ్ళాడు. ఆ రూమ్లో క్యాసెట్లు, పుస్తకాలున్నాయి. అక్కడే ఉన్న సోఫాలో ఇద్దరం కూర్చున్నాం. ఆ టైమ్లో ఆయన 'బాంబే వాల్వెట్` సినిమానికి దర్శకత్వం వహిస్తున్నారు. `రణభీర్ కపూర్ సినిమాలో కనీసం ఒక సీన్లో అయినా నటించాలనుకునే అమ్మాయిలు నాతో పడుకోవాలనుకుంటార`న్నాడు. `అమితాబ్లాంటి వ్యక్తి నాకు ఫోన్ చేసి అభిషేక్ బచ్చన్తో సినిమా చేయమని అడుగుతున్నాడని, అలాగే కరణ్ జోహార్ నాతో ప్రతి విషయం మాట్లాడుతాడని.. నేను ఆ లెగసీని ఎంజాయ్ చేస్తున్నానని మాట్లాడార`న్నాడని పాయల్ తెలిపింది.
ఆమె ఇంకా చెబుతూ, `నేనెంత గొప్ప వ్యక్తినో అర్థం చేసుకోవాలని, తనతో సన్నిహితంగా మెలిగితే భవిష్యత్తులో నాకు మేలుజరుగుతుందని అనురాగ్ అన్నాడని తెలిపింది. `సినిమా ఇండస్ట్రీలో శారీరక సంబంధం కలిగి ఉండటం తప్పేం కాదన్నట్లుగా ఆయన నాతో మాట్లాడాడు. హ్యూమా ఖురేషీ, రిచా చద్దా, మహిగిల్ వంటి హీరోయిన్లు ఫోన్ టచ్లో ఉంటారన్నాడని, నేనెప్పుడు పిలిచిన వచ్చి నేనేం చేయమంటే అది చేస్తార`ని అప్పుడాయన చెప్పారు. నేను కూడా వారిలాగానే చేస్తానని అనుకున్నాడు.
`ఆయనతో మాట్లాడుతున్న సమయంలోనే నన్ను బలవంతం చేయబోయాడు. నేను అందుకు ఒప్పుకోలేదు. నేను అన్కంఫర్ట్బుల్గా ఉన్నాను, శారీరకంగా, మానసికంగా సిద్ధంగా లేనని, తర్వాత కలుస్తానని చెప్పి వచ్చేశాను. ఆ సమయంలోనే నేను బయటకు చెబుదామంటే నన్ను చాలా మంది వద్దని భయపెట్టారు. నీపై యాసిడ్ దాడి జరగొచ్చు, నిన్ను కిడ్నాప్ చేయవచ్చునని అన్నారు. ఇతర ఆర్టిస్టులను వారెంతో బాధపెట్టారనే విషయాన్ని చెప్పారు. ఒక అమ్మాయి డైరెక్టర్ని సినిమా అవకాశం కోసం వచ్చి కలవొచ్చు. అంతమాత్రాన వేశ్య కాద`ని పాయల్ తెలిపింది.
అనురాగ్ కశ్యప్ పేరుని బయటకు చెప్పడంతో ఇప్పుడు బాలీవుడ్లో పాయల్ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. మరి ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.