- Home
- Entertainment
- Pawan First Wife: పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుందో తెలుసా? షాకింగ్ నిజాలు
Pawan First Wife: పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుందో తెలుసా? షాకింగ్ నిజాలు
పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుందనేది క్లారిటీ లేదు. తాజాగా దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు గీతా కృష్ణ.

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట ఆయన నందినిని మ్యారేజ్ చేసుకున్నారు. వీరిది అరెంజ్ మ్యారేజ్. 1997లో పెళ్లి చేసుకుంటే రెండేళ్లకి విడిపోయారు. కాకపోతే 2008లో విడాకులు మంజూరు అయ్యాయి. ఆ తర్వాత 2009లో రేణు దేశాయ్ని మ్యారేజ్ చేసుకున్నారు పవన్. వీరికి అకీరా నందన్, ఆధ్యలు జన్మించారు. మూడేళ్లకి వీరిద్దరు విడిపోయారు. అనంతరం రష్యా నటి అన్నా లెజినోవాని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఎక్కడుంది?
ఇదిలా ఉంటే రేణు దేశాయ్ ఇప్పుడు ఎక్కడుంది? ఏంచేస్తుందో అందరికి తెలిసిందే. ఆమె పబ్లిక్ లో ఉంటుంది. తరచూ అనేక విషయాలపై మాట్లాడుతుంది. అయితే పవన్ మొదటి భార్య నందిని ఎక్కడుంది? ఇప్పుడు ఏం చేస్తుందనేది పెద్ద మిస్టరీ. ఈ విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. షాకింగ్ నిజాలు తెలిసిపోయాయి. ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారు. నందిని.. గీతా కృష్ణ వాళ్ల బంధువుల అమ్మాయి అట. పత్తిపాటి పుల్లారావు బంధువుల అమ్మాయి అట. వాళ్లది చాలా పెద్ద ఫ్యామిలీ అని, వాళ్ల తాత పత్తిపాటి గంగరాజు, వాళ్లది పోలవరం అని, పత్తిపాటి పుల్లారావు సిస్టర్ డాటరే నందిని అని చెప్పారు. పవన్ కళ్యాణ్ తో విడిపోయాక మళ్లీ సినిమా వాళ్లనే పెళ్లి చేసుకోవాలనుకున్నారట. కానీ గీతా కృష్ణ వద్దు అని చెప్పాడట. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట.
అమెరికాలో సెటిల్ అయిన నందిని
ఆ తర్వాత డాక్టర్ని పెళ్లి చేసుకుందట నందిని. ఇప్పుడు వాళ్లు అమెరికాలో సెటిల్ అయ్యారట. తను కూడా అమెరికా బిజినెస్ చేస్తుందని, ఇప్పుడు బాగా సెటిల్ అయ్యిందని సమాచారం. పిల్లలు, ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారని, ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని వెల్లడించారు గీతా కృష్ణ. రెండో పెళ్లికి తన పేరుని జాహ్నవిగా మార్చుకున్నట్టు సమాచారం. అయితే మరో ఆసక్తికర విషయాన్ని ఆయన వెల్లడించారు. పవన్తో నందిని విడిపోయినప్పుడు ఆమెకి పవన్ భరణం గట్టిగానే ఇచ్చాడట. మొదట్లో ఇవ్వడానికి నో చెప్పాడని, ఆ తర్వాత కోర్ట్ ద్వారా ఆరున్నర కోట్ల వరకు భరణం ఇచ్చాడని వెల్లడించారు.
రేణు దేశాయ్కి గట్టిగానే భరణం
ఈ సందర్భంగా రేణు దేశాయ్ కి సంబంధించిన భరణం గురించి తెలిపారు గీతా కృష్ణ. ఆమెకి కూడా పవన్ కళ్యాణ్ భరణం ఇచ్చాడట. పది పదిహేను కోట్లకుపైగానే ఇచ్చాడని అంటుంటారు. అయితే ఆ మధ్య పలు ఇంటర్వ్యూలో తాను భరణం తీసుకోలేదని కామెంట్ చేసింది. కానీ దీనిపై గీతా కృష్ణ స్పందించారు. ఆమెకి భరణం ఇచ్చింది నిజమే అని, కానీ ఇన్కమ్ టాక్స్ సమస్య వస్తుందనే చెప్పలేదేమో అన్నారు. పవన్ ఏదైనా అధికారికంగానే చేశారని, కానీ ఆయన్ని పట్టుకొని అంతా విమర్శిస్తుంటారని పవన్ని సమర్థించారు గీతా కృష్ణ.
ఓజీ 2తో రాబోతున్న పవన్
పవన్ కళ్యాణ్ చివరగా `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రంలో నటించారు. హరీష్ శంకర దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. పెద్ద డిజాస్టర్గా నిలిచింది. ఇప్పుడు నెక్ట్స్ సినిమా ఏంటనేది క్లారిటీ లేదు. అయితే `ఓజీ 2` చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన చర్చలు జరుపుతున్నారు. త్వరలో ఇది ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

