- Home
- Entertainment
- NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డుని రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్, భారీ ఈవెంట్లో సంచలన నిర్ణయం.. మెగాస్టార్ ఫిదా
NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డుని రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్, భారీ ఈవెంట్లో సంచలన నిర్ణయం.. మెగాస్టార్ ఫిదా
ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ కి అవార్డు వరించింది. చిరంజీవి అవార్డుని అందించారు. కానీ ఎన్టీఆర్..అందరికి ముందు, భారీ ఈవెంట్లోనే తన అవార్డుని రిజెక్ట్ చేయడం అందరిని షాక్కి గురిచేసింది.

చిరంజీవికి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు. ఆయన నటనకు చాలా అవార్డులు వచ్చాయి. అయితే ఓ సారి ఎన్టీఆర్ తనకు వచ్చిన అవార్డుని రిజెక్ట్ చేశాడు. చిరంజీవి ఇచ్చిన అవార్డుకి ఆయన నో చెప్పారు. అందరి ముందు బహిరంగ సభలో ఈ అవార్డుని రిజెక్ట్ చేశారు. ఆయన చెప్పిన కారణం తెలిసి అంతా షాక్ అయ్యారు. మెగాస్టార్ ఏకంగా ఫిదా అయ్యారు. అసలేం జరిగిందనేది చూస్తే.
యమదొంగకి బెస్ట్ యాక్టర్ అవార్డు
అప్పట్లో స్టార్ మా అవార్డుల వేడుక నిర్వహించింది. ఇది 2007-08 టైమ్ లో. ఇందులో ఆల్మోస్ట్ బిగ్ స్టార్స్ అంతా హాజరయ్యారు. చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఇందులో ఉత్తమ నటుడి కేటగిరిలో ఎన్టీఆర్కి అవార్డు వరించింది. `యమదొంగ` చిత్రానికిగానూ తారక్కి బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది. ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి ఈ అవార్డుని ప్రకటించిన తారక్కి అందించారు.
చిరంజీవి అందించిన అవార్డుని రిజక్ట్ చేసిన ఎన్టీఆర్
కానీ అవార్డుని ఎన్టీఆర్ తిరస్కరించారు. కాకపోతే అది పాజిటివ్ వేలో. ఆ సమయంలోనే లెజెండరీ నటుడు, మన తెలుగు తెర సోగ్గాడు శోభన్ బాబు మరణించారు. ఆయన మృతికి సంతాపంగా, ఆయనకు ఈ అవార్డుని అంకితం ఇస్తున్నట్టు తెలిపారు ఎన్టీఆర్. అవార్డుని అందించిన వెంటనే ఆయన చిరంజీవికి ఇచ్చేశారు. ఇందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ, `ఈ అవార్డుని చిరంజీవి చేతుల మీదుగా అందుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే, చిరంజీవిగారి సినిమాలు, మా బాలయ్య బాబాయ్ సినిమాలు, నాగార్జునగారి సినిమాలు చూస్తూ పెరిగాను. అయితే ఇటీవలే శోభన్బాబుగారు చనిపోయారు. ఆయన్ని దర్శించుకునే అర్హత ఇంకా తనకు రాలేదు, అందుకే నేను వెళ్లలేదు.
శోభన్ బాబుకి అవార్డు అంకితం..చిరంజీవి ఫిదా
ఈ అవార్డుని శోభన్బాబుగారికి అంకితమిస్తున్నా. ఈ అవార్డు వారి కుటుంబ సభ్యులకు చేరేలా, దయజేసి చిరంజీవిగారే, వారి కుటుంబానికి అందించాలని ఈ అవార్డుని వారికే ఇచ్చేస్తున్నా` అని తెలిపారు ఎన్టీఆర్. దీనికి చిరంజీవి ఫిదా అయ్యారు. ఆయన దీనిపై రియాక్ట్ అవుతూ, అవార్డుని అంకితమిస్తున్నట్టు చెబితే చాలు, ఇచ్చినట్టే. శోభన్బాబు గారికి యంగ్ హీరోలలో మహేష్ బాబు, ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన ఎక్కడున్న ఆశీస్సులు ఎన్టీఆర్కి దక్కాలని, వారి తృప్తిమేరకు ఈ అవార్డుని శోభన్ బాబు గారి ఫ్యామిలీకి అందించే ప్రయత్నం చేస్తాన`ని చిరంజీవి తెలిపారు. ఈ అరుదైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ గొప్ప మనసుకి అంతా ఫిదా అవుతున్నారు.
డ్రాగన్లో నటిస్తోన్న ఎన్టీఆర్
ఎన్టీఆర్ ప్రస్తుతం `డ్రాగన్` చిత్రంలో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. 1970నాటి కోల్ కత్తా బ్యాక్ డ్రాప్లో ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది. ఇందులో తారక్ మాఫియా డాన్గా కనిపిస్తారని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇటీవలే ఫారెన్లో చిత్రీకరణ జరుపుకుంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే విలన్గా మలయాళ హీరో టోవినో థామస్ ని ఎంపిక చేశారట. కానీ ఆయన తప్పుకున్నారు. ఇటీవలే `పళ్లి చట్టాంబి` మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన తాను `డ్రాగన్`లో నటించడం లేదని తెలిపారు. ఇది పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.

