MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నయనతారపై ధనుష్ 10 కోట్ల దావా కేసు.. కోర్టు సంచలన తీర్పు..?

నయనతారపై ధనుష్ 10 కోట్ల దావా కేసు.. కోర్టు సంచలన తీర్పు..?

నయనతార పై హీరో దనుష్ దాఖలు చేసిన  10 కోట్ల నష్టపరిహారం కేసు విచారణ తాజాగా జరిగింది. ఈ కేసులో కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఇంతకీ ఏమయ్యింది. 

2 Min read
Mahesh Jujjuri
Published : Jan 08 2025, 03:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నయనతార, దనుష్

నయనతార, దనుష్

సౌత్ ఇండియన్ ఫిలమ్ ఇండస్ట్రీలో  లేడీ సూపర్ స్టార్ గా వెలుగోందుతోంది నయనతార. ఆమె పెళ్లి వీడియోను మీడియాకు రిలీజ్ చేయకుండా.. ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌కు అమ్మిన తర్వాత, 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' పేరుతో డాక్యుమెంటరీగా విడుదలైంది.

దీనికోసం నయనతార, విఘ్నేష్ శివన్ రూ.25 కోట్లు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. వివాహ ఖర్చులు రూ.5 కోట్లు కూడా కాలేదని, నయనతార తన వివాహంతో కోట్లు సంపాదించారని విమర్శకులు అన్నారు.

Also Read: చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ స్టార్స్ కు ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..?

25
నయనతార డాక్యుమెంటరీ

నయనతార డాక్యుమెంటరీ

'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీలో నయనతార నటించిన కొన్ని సినిమాల సన్నివేశాలు ఉన్నాయి. దనుష్ నిర్మించిన 'నానుమ్ రౌడీ ధాన్' సినిమాలోని సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా నయనతార, విఘ్నేష్ శివన్‌లను ఒక్కటి చేసిందని, వారి తొలి సమావేశం సన్నివేశాన్ని చేర్చారని తెలిసింది.

Also Read:  హన్సిక మోత్వానీ పై గృహ హింస కేసు.. ఎవరు పెట్టారంటే..?

35
నయనతార ప్రకటన

నయనతార ప్రకటన

తన అనుమతి లేకుండా తాను నిర్మించిన సినిమా సన్నివేశాన్ని ఉపయోగించినందుకు రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ దనుష్ నయనతారకు నోటీసు పంపడం సంచలనం సృష్టించింది. దీనిపై నయనతార మూడు పేజీల ప్రకటన విడుదల చేసింది. దనుష్‌ను అనుమతి కోసం రెండేళ్లు ప్రయత్నించానని చెప్పింది.

Also Read:విశాల్ పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం ఇదేనా..? అసలు విశాల్ కు ఏమయ్యింది..?

45
దనుష్ దావా

దనుష్ దావా

నయనతారపై దావా వేయడానికి అనుమతి కోరుతూ దనుష్ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు అనుమతి ఇచ్చింది. 'నానుమ్ రౌడీ ధాన్' సినిమా సన్నివేశాన్ని ఉపయోగించినందుకు రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని, ఆ సన్నివేశాన్ని డాక్యుమెంటరీ నుంచి తొలగించాలని దనుష్ కోరారు.

55
విచారణ వాయిదా

విచారణ వాయిదా

దీనిపై నయనతార వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. సినిమాలోని సన్నివేశాన్ని డాక్యుమెంటరీలో ఉపయోగించలేదని, తమ సొంత సేకరణలోని సన్నివేశాన్ని ఉపయోగించామని నయనతార చెప్పింది. దాంతో కోర్ట్  ఈ కేసు విచారణను జనవరి 22కి వాయిదా వేసింది. ఇకపై గడువు కోరకూడదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved