MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Murali Mohan: వేల కోట్లకు అధిపతి అయినా 50ఏళ్లుగా భార్య పెట్టిన కండీషన్‌ ఫాలో అవుతున్న నటుడు.. ఆ కండీషన్‌ ఇదే

Murali Mohan: వేల కోట్లకు అధిపతి అయినా 50ఏళ్లుగా భార్య పెట్టిన కండీషన్‌ ఫాలో అవుతున్న నటుడు.. ఆ కండీషన్‌ ఇదే

మురళీ మోహన్‌ దాదాపు యాభై ఏళ్లుగా సినిమాల్లో రాణించారు. అయితే ప్రారంభం నుంచి తన భార్య చెప్పిన మాట దాటలేదు. ఆమె పెట్టిన కండీషన్‌ని ఇప్పటికీ ఫాలో అవుతున్నాడట. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Jan 26 2026, 07:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
మురళీ మోహన్‌కి పద్మ శ్రీ పురస్కారం
Image Credit : facebook / Murali Mohan

మురళీ మోహన్‌కి పద్మ శ్రీ పురస్కారం

సీనియర్‌ నటుడు, వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు మురళీ మోహన్‌ కి కేంద్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మక పద్మ శ్రీ అవార్డుతో గౌరవించింది. ఆయన సినీ రంగంలో, వ్యాపార రంగంలో, అలాగే రాజకీయాల్లో అందిస్తున్న విశేష సేవలకుగానూ కేంద్రం ఈ పురస్కారాన్ని ప్రకటించింది.  రిపబ్లిక్‌ డేని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం ఈ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు నుంచి సినిమా రంగంలో మాగంటి మురళీ మోహన్‌కి, అలాగే సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌కి అవార్డు వరించింది. వీరితోపాటు తమిళనాడు నుంచి ఆర్‌ మాధవన్‌, మలయాళం నుంచి మమ్ముట్టి, హిందీ నుంచి ధర్మేంద్రలకు పద్మ అవార్డులు వరించాయి. 

27
మురళీ మోహన్‌కి భార్య కండీషన్‌
Image Credit : facebook/@SriKaruna

మురళీ మోహన్‌కి భార్య కండీషన్‌

ఈ క్రమంలో మురళీ మోహన్‌కి సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మురళీ మోహన్‌కి ఆయన భార్య పెట్టిన కండీషన్‌ షాకిస్తుంది. దాన్ని ఆయన యాభై ఏళ్లుగా పాటించడం విశేషం. ఇంతకి ఆ కండీషన్‌ ఏంటంటే.. మురళీ మోహన్‌లో 1965లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు రామ్‌ మోహన్‌, కూతురు మధు బిందు ఉన్నారు. రామ్మోహన్‌ కూతురు రాగని, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు, హీరో శ్రీ సింహని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Related Articles

Related image1
ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ..దాని కోసం ట్రై చేయకు అని ముఖం మీదే చెప్పింది ఎవరో తెలుసా ?
Related image2
Padma Awards 2026: మమ్ముట్టికి పద్మభూషణ్, ధర్మేంద్రకి పద్మ విభూషణ్.. రొమాంటిక్ హీరోకి కూడా అవార్డు
37
50ఏళ్లుగా భార్య కండీషన్‌ ఫాలో అవుతున్న మురళీ మోహన్‌
Image Credit : Asianet News

50ఏళ్లుగా భార్య కండీషన్‌ ఫాలో అవుతున్న మురళీ మోహన్‌

మురళీ మోహన్‌ పెళ్లి అయిన తర్వాతనే సినిమాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన వయసు 85ఏళ్లకుపైగానే ఉంటుంది. అయినా ఇప్పటికీ చాలా ఫిట్‌గా ఉంటారు. సినిమాల్లోనూ నటిస్తున్నారు. అయితే ఈరోజుకి కూడా మురళీ మోహన్‌ సినిమాల్లో తన భార్య పెట్టిన కండీషన్‌ ఫాలో అవుతున్నారట. సినిమాల్లోకి వచ్చే ముందే విజయలక్ష్మి ఒక కండీషన్‌ పెట్టిందట. మురళీమోహన్ ఎవరి దగ్గరకు వెళ్లి తనకు అవకాశాలు ఇవ్వాలని అడగకూడదట. ఎవరైనా పిలిచి చేయమంటే తప్ప తనకు తానుగా వెళ్లి క్యారెక్టర్(ఆఫర్స్) ఇవ్వమని అడగకూడదు అని చెప్పిందట. ఆ మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నారట మురళీమోహన్. `కెరీర్ అంతా కూడా నా వద్దకు వచ్చిన పాత్రలనే చేస్తూ వచ్చాను. ఇప్పటికీ అదే రూల్ పాటిస్తున్నాన`ని మురళీ మోహన్‌ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

47
మురళీ మోహన్‌ వేల కోట్లకు అధిపతి
Image Credit : ABN

మురళీ మోహన్‌ వేల కోట్లకు అధిపతి

మురళీ మోహన్‌ నటుడిగానే కాదు వ్యాపారవేత్తగా మంచి పేరుతెచ్చుకున్నారు. ఆయన నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. అలాగే జయభేరి పేరుతో అనేక వ్యాపారాలున్నాయి. జయభేరి కంస్ట్రక్షన్‌ కంపెనీ, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలున్నాయి. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ సమీపంలో జయభేరి పేరుతో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్ లు, ఆపార్ట్ మెంట్స్, విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలన్నీ మురళీ మోహన్‌వే. రెండు తెలుగు రాష్టాల్లో ఈ కంపెనీ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు ఉన్నాయి. అలాగే వీరికి మొదట్లో ఎలక్ట్రానిక్స్‌ మోటార్, ఆయిల్‌ కంపెనీలు కూడా ఉన్నాయి.  మొత్తంగా మురళీ మోహన్‌ వ్యాపారాల విలువ వేల కోట్లల్లో ఉంటుందని సమాచారం.

57
రాజకీయాల్లోనూ మురళీ మోహన్‌ సక్సెస్‌
Image Credit : our own

రాజకీయాల్లోనూ మురళీ మోహన్‌ సక్సెస్‌

మురళీ మోహన్‌ తలపెట్టిన ప్రతి రంగంలోనూ సక్సెస్‌ అయ్యారు. ఆయన రాజకీయాల్లోనూ సక్సెస్‌ ఫుల్‌ లీడర్‌గా రాణించారు. టీడీపీలో యాక్టివ్‌గా ఉంటారు. ఆయన 2009లో రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో అదే స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం రాజకీయాల్లో అంతగా యాక్టివ్‌గా లేరు. వయసు రీత్యా ఆయన రిటైర్‌మెంట్‌ని తీసుకున్నారు.

67
నటుడిగా 350కిపైగా చిత్రాలు
Image Credit : our own

నటుడిగా 350కిపైగా చిత్రాలు

నటుడిగా కెరీర్‌ ప్రారంభంలో స్టార్‌గా రాణించారు మురళీ మోహన్‌. ఆయన చిరంజీవి కంటే ముందే 1973లో `జగమే మాయ` మూవీతో నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రారంభంలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబులతో కలిసి నటించారు. ఆ తర్వాత చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌ వంటి హీరోలతోనూ కలిసి నటించారు. సోలో హీరోగా అనేక సినిమాలు చేశారు. అదే సమయంలో క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు. దాదాపు అందరు హీరోలతో కలిసి సినిమాలు చేశారు ఇప్పటి వరకు ఆయన 350కిపైగా చిత్రాల్లో నటించారని సమాచారం. 

77
నిర్మాతగానూ సక్సెస్‌
Image Credit : our own

నిర్మాతగానూ సక్సెస్‌

అలాగే ఇక నిర్మాతగానూ సక్సెస్‌ అయ్యారు. జయభేరి ఆర్ట్స్ పేరుతో సోదరుడు కిశోర్‌తో కలిసి నిర్మాణ సంస్థని స్థాపించి మొదటి ప్రయత్నంగా `వారాల అబ్బాయి` సినిమాని నిర్మించారు. ఇది హీరోగా మురళీ మోహన్‌ వందవ సినిమా కావడం విశేషం. ఈ ప్రొడక్షన్‌లో దాదాపు 25 సినిమాలు నిర్మించారు. అందులో మహేష్‌ బాబు తో `అతడు` కూడా ఉంది. ఆయనకు మూడు నంది అవార్డులు వరించాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
బాలకృష్ణ ముహూర్తం పెడితే.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
రాంచరణ్ కోసం వీధుల్లో తిరిగింది, ఈ మూవీ కోసం అప్పు తీసుకుంది.. కూతురు సుస్మిత సీక్రెట్స్ బయటపెట్టిన చిరు
Recommended image3
ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ..దాని కోసం ట్రై చేయకు అని ముఖం మీదే చెప్పింది ఎవరో తెలుసా ?
Related Stories
Recommended image1
ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ..దాని కోసం ట్రై చేయకు అని ముఖం మీదే చెప్పింది ఎవరో తెలుసా ?
Recommended image2
Padma Awards 2026: మమ్ముట్టికి పద్మభూషణ్, ధర్మేంద్రకి పద్మ విభూషణ్.. రొమాంటిక్ హీరోకి కూడా అవార్డు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved