- Home
- Entertainment
- MS Raju: మా నాన్నతో సినిమా చేస్తున్నప్పుడే చిరంజీవికి పెళ్లయింది, రాంచరణ్ తో గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నా
MS Raju: మా నాన్నతో సినిమా చేస్తున్నప్పుడే చిరంజీవికి పెళ్లయింది, రాంచరణ్ తో గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నా
ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు చిరంజీవి, రాంచరణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాంచరణ్ ని లాంచ్ చేసే ఛాన్స్ ఎలా కోల్పోయానో అనేది వివరించారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

MS Raju
టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు గురించి పరిచయం అవసరం లేదు. ఆయన దర్శకుడు కూడా. దేవి, ఒక్కడు, వర్షం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలని ఆయన నిర్మించారు. ఆయన తెరకెక్కించిన అగధ చిత్రం ఆగష్టు 14న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సందర్భంగా ఎంఎస్ రాజు ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.
చిరంజీవి ఫ్యామిలీతో అనుబంధం
ఓ ఇంటర్వ్యూలో ఆయన చిరంజీవి కుటుంబంతో తమ ఫ్యామిలీకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాంచరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్ రాజు తండ్రి ఎం రాయపరాజు కూడా నిర్మాతగానే ఉన్నారు. అప్పట్లో అయన అనేక చిత్రాలు నిర్మించారు. చిరంజీవి కెరీర్ ప్రారంభ దశలో రాయపరాజు 2 సినిమాలు నిర్మించారు.
చిరంజీవి పెళ్లి
ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. మా నాన్న నిర్మించే సినిమాలో నటిస్తున్నప్పుడే చిరంజీవి గారికి పెళ్లి జరిగింది. అప్పటి నుంచే ఆ ఫ్యామిలీతో మాకు అనుబంధం ఉంది. ఆ తర్వాత నేను చిరంజీవి గారితో సినిమా చేయాలి అని ప్రయత్నించా. కుదర్లేదు. రాంచరణ్ ని హీరోగా లాంచ్ చేయాలి అనుకున్నప్పుడు చిరంజీవి గారు ముందుగా ఆ ఆఫర్ నాకు ఇచ్చారు. రాంచరణ్ తొలి చిత్రానికి నిర్మాతగా ఉండమని అడిగారు.
ఛాన్స్ మిస్ అయింది
రాంచరణ్ ని లాంచ్ చేయడం నాకు చాలా ఇష్టం. కానీ ఆ టైంలో నా దగ్గర సరైన కథ లేదు. ఛాన్స్ వచ్చింది కదా అని ఏదో ఒక చెత్త కథతో సినిమా చేసే రకం కాదు నేను. మంచి కథ రెడీ చేయడం ఆలస్యం అయింది. ఇంతలో చిరంజీవి గారు వైజయంతి మూవీస్ దత్తు గారికి ఆ ఛాన్స్ ఇచ్చారు అని ఎంఎస్ రాజు అన్నారు.
ఎంఎస్ రాజు బాధ అదే
మెగా ఫ్యామిలీతో దశాబ్దాల అనుబంధం ఉంది. అయినా కూడా చిరంజీవి, రాంచరణ్ తో సినిమా చేయలేకపోయా అని ఎంఎస్ రాజు నిరాశ వ్యక్తం చేశారు. కానీ ప్రభాస్ కి తొలి బ్లాక్ బస్టర్ వర్షం ఇచ్చింది ఆయనే. మహేష్ ని మాస్ హీరోగా మార్చిన ఒక్కడు నిర్మించింది కూడా ఆయనే.

