ఎండు చేపల కూర ఇష్టంగా, లొట్టలు వేసుకుంటూ తినే స్టార్ హీరో ఎవరో తెలుసా?
స్టార్ సెలబ్రిటీలు లైఫ్ స్టైల్ గురించి ప్యాన్స్ లో, కామన్ ఆడియన్స్ లో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. వారు ఏం తింటున్నారు. ఫేవరెట్ ఫుడ్ ఏంటి, కాస్ట్లీ వస్తువులు ఏం వాడుతున్నారు, ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. వాటిని వైరల్ చేస్తుంటారు. స్టార్ సెలబ్రిటీలలో కూడా చాలామందికి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. వారి ఆహారపు అలవాట్లు తెలిసుకుని ఫ్యాన్స్ ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ ను రారాజులా ఏలుతున్న ఓ స్టార్ హీరోకు ఎండు చేపలంటే ప్రాణమట ఇంతకీ ఎవరా హీరో?
- FB
- TW
- Linkdin
Follow Us
)
సినిమా స్టార్స్, సెలబ్రిటీస్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి తెలసుకోవాలని వారి ప్యాన్స్ కుఇంట్రెస్ట్ ఉంటుంది. కామెన్ ఆడియన్స్ కూడా సెలబ్రిటీలు ఏం తింటారా అని తెలుసుకోవాలని ఉంటుంది. ఒక్కొ సెలబ్రిటీకి ఫెవరేట్ ఫుడ్ డిఫరెంట్ గా ఉంటుంది. కొంత మంది సీ ఫుడ్స్ ఇష్టపడతారు, మరికొంత మంది కంప్లీట్ గా వెజ్ వెరైటీలు మాత్రమే తింటారు. అయితే టాలీవుడ్ లో ఎటువంటి బాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి, స్టార్ హీరోగా మారి, ప్రస్తుతం తెలుగు సినీపరిశ్రమకే పెద్ద దిక్కు గా మారి హీరోకి ఎండు చేపలంటే ఎంతో ఇష్టమట. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?
Also Read: 20 కేజీలు బరువు తగ్గడానికి ఖుష్బూ ఇంజెక్షన్ తీసుకున్నారా?
ఆయన ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. అవుతను చిరంజీవి మంచి ఫుడీ. మితంగా తింటారు, కాని ఇష్టమైన ఫుడ్ కనిపిస్తే మాత్రం వదిలిపెట్టరు. చిరంజీవికి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పారు. అది కూడా మెగా మదర్ అంజనాదేవి చేతి వంట అంటే మరీ ఇష్టమట. ఆమె చేసే చేపల పులుసు, ఎండు చేపల కూర అంటే లొట్టలేసుకుని తింటారట మెగాస్టార్.
Also Read: 40 సినిమాలు ప్లాప్.. 33 రిలీజ్ కాలేదు.. అయినా ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరు?
ఓ సందర్భంలో ఆయన తన తల్లి అంజనాదేవికోసం ఎండు చేపల ప్రై కూడా చేసి పెట్టారు. కరోనా టైమ్ లో చేసిన ఆ వీడియోకు భారీగా రెస్పాన్స్ కూడా వచ్చింది. అంతే కాదు కొన్ని టీవీ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించారు. చిరంజీవి సీ ఫుడ్ ఎక్కువగా తింటే.. పవన్ కళ్యాన్ మాత్రం పులవ్ ను ఎక్కువగా ఆస్వాదిస్తారట.
ఇక చిరంజీవి ప్రస్తుత వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. విశ్వంభర సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఇక ఈమూవీ తరువాత అనిల్ రావిపూడితో కామెడీ జానర్ లో మెగాస్టార్ సినిమా చేయబోతున్నారు. మెగా ఫ్యాన్స్ చిరంజీవి సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.