Janaki Kalaganaledu: జానకిని పొగుడుతున్న రామచంద్ర.. సరికొత్త ప్లాన్ వేసిన మల్లిక?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 8వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
ఈ రోజు ఎపిసోడ్లో జానకి లడ్డూలు అని సిద్ధం చేస్తూ ఉండగా ఇంతలోనే జ్ఞానాంబ నిద్ర లేస్తుంది. అప్పుడు రామచంద్ర అక్కడికి వచ్చి ఏంటి జానకి గారు మీరు రాత్రంతా మెలకువతోనే ఉన్నారా అనగా 70 కేజీల లడ్డు ఆర్డర్ ఇచ్చారు కదండీ మాట ఇచ్చాం కాబట్టి చేయాల్సింది తప్పదు ఒకరోజు నిద్ర మేలుకుంటే ఏం కాదులేండి అని అంటుంది. ఇంతలోనే గోవిందరాజులు అక్కడికి వస్తాడు. నీకున్న భయం వీడికి ఉందా జానకి అని మలయాళం నీ కొట్టి నిద్ర లేపుతాడు గోవిందరాజులు. ఎలా నిద్ర పట్టిందో తెలియదు అనగా అప్పుడు గోవిందరాజులు నీతి లడ్డూలు కదా నాలుగు నోట్లోకి వేసుకొని ఉంటావు అప్పుడు నిద్ర వచ్చింటుంది అని అంటాడు.
అప్పుడు గోవిందరాజులు మలయాళం మీద సెటైర్లు వేస్తూ ఉండగా రామచంద్ర జానకి నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలోనే వెన్నులు అక్కడికి వచ్చి వదినా ప్యాకింగ్ అప్పుడే అయిపోయిందా సారీ వదిన నిద్ర ఆపుకోలేకపోయాను వదిన అనగా మీ వదిన ఒక్కటే రాత్రంతా మేలుకొంది అని రామచంద్ర అనడంతో స్వారీ వదిన అని అంటుంది వెన్నెల. అప్పుడు రామచంద్ర క్షమించండి జానకి గారు మీరు ఒక్కరే కష్టపడుతున్నారు అని తెలియక నిద్రపోయాను అని అంటాడు. పగలు అంత కష్టపడ్డారు కదా పడుకుంటే ఏం కాదులేండి అని అంటుంది జానకి. ఆ తర్వాత జానకి టైం అవుతుంది అని స్నానం చేయడానికి వెళుతుండగా ఇంతలో రామచంద్ర వచ్చి ఆ నీళ్ల బకెట్ ని తీసుకెళ్తూ ఉంటాడు.
అది చూసి మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. మీరు ఉండండి జానకి గారు నేను బకెట్ తీసుకెళ్తాను అనడంతో రాత్రంతా కష్టపడ్డారు కదా జానకి గారు మీరు కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి అనడంతో అంతకంటే నాకు మంచి ఆనందం ఒకటి ఉంది అని అంటుంది జానకి. అదేంటో నాకు చెప్పరా అని అనగా ఈ స్వీట్ల ఆర్డర్ ఎవరిచ్చారో తెలుసా అత్తయ్య గారు ఇచ్చారు అనడంతో రామచంద్ర సంతోష పడుతూ ఉంటాడు. అది చూసి మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర జానకి ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మల్లిక వెళ్లి విష్ణు మఖాన చీరలు వేసి జాకెట్లు ఇస్త్రీ చేసి లోపల పెట్టండి అనడంతో నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను. వింటున్నాను కదా అని చాకిరీలు చేస్తాను అనుకుంటున్నావా అని విష్ణు సీరియస్ అవుతాడు.
ఏం లేకపోయినా రోషం మాత్రం పొడుచుకుని వస్తుంది అని అంటుంది మల్లిక. అవతల మీ అన్నయ్య జానకికి స్నానం చేయడానికి వేడి నీళ్లు పెడుతున్నాడు అనడంతో ఏంటి అన్నయ్య పని చేశాడా అనగా అవును అనడంతో అలాంటివన్నీ అన్నయ్య చేస్తాడేమో నేను చేయను అని అంటాడు విష్ణు. అప్పుడు మల్లిక నోరు పెద్దది చేసి విష్ణు నోరు మూయిస్తుంది. ఎలా అయినా చేసి మీ అమ్మ మీ పెద్దన్నయ్యను విడగొడతాను అని అంటుంది మల్లిక. ఆ తర్వాత మలయాళం పాటలు పాడుకుంటూ పాయసం చేస్తూ ఉండగా ఇంతలో మల్లిక అక్కడికి వచ్చి మలయాళం మీద సెటైర్లు వేస్తూ ఉంటుంది. అప్పుడు మలయాళం పాయసంలో కరివేపాకు వేస్తావా అనగా పాయసంలో కరివేపాకు వేయడం ఏంటి మేడం అనడంతో పాయసంలో కరివేపాకు లేకపోతే మా ఆయన తినడు అని చెప్పి మలయాళంనీ అక్కడి నుంచి పంపించి తన బంగారు ఉంగరం తీసి జానకి బ్యాగులో వేస్తుంది.
ఆ తర్వాత గోవిందరాజులు ఉత్సాహంతో వ్యాయామం చేస్తుండగా జ్ఞానాంబ ఇక్కడికి వచ్చి చేసిన వ్యాయామం చాలు వచ్చి మందులు వేసుకోండి అని అనడంతో చేసే ఉత్సాహం అన్ని చెడగొడుతున్న జ్ఞానం అని అంటాడు గోవిందరాజులు. అన్నింటికీ అడ్డం తిరిగి మీరు అడ్డం పడ్డారు అనడంతో నేను అలా అనకుండా ఉండాలి అంటే నువ్వు వచ్చి మందులు వేసుకోండి అంటుంది జ్ఞానాంబ. అప్పుడు పక్కింట్లో నుంచి కరివేపాకు తీసుకుని మలయాళం లోపలికి వెళ్తుండగా ఏం చేస్తున్నావురా అనడంతో పాయసం లోకి కరివేపాకు వేస్తున్నాను అనగా గోవిందరాజులు షాక్ అవుతాడు. మలయాళం మాటలకు జ్ఞానాంబ నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు మలయాళం గోవిందరాజులు ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత జానకి కాలేజీకి వెళ్లడానికి రెడీ అవుతూ ఉండగా అప్పుడు మల్లిక ఎలా అయినా ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేలా చేయాలి అనుకుంటూ ఉంటుంది. రామచంద్ర జానకి బయటికి వెళుతుండగా పోయింది పోయింది అని గట్టిగా అరుచుకుంటూ బయటికి వస్తుంది. ఏమైంది అని గోవిందరాజులు అడగడంతో మా అమ్మ ఎంతో ప్రేమగా చేసిన బంగారు ఉంగరం ఎవరో కొట్టేశారు అంటూ నాటకాలు ఆడుతూ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్లవు కదా ఎలా పోతుంది అని జ్ఞానాంబ బాగా అడగడంతో ఎవరికి ఏ అవసరం ఉందో అమ్మేసారో లేదో ఇక్కడ తాకట్టు పెట్టారో అంటూ నాటకాలు వాడుతూ ఉంటుంది మల్లిక.
అప్పుడు మల్లిక దొంగ ఏడుపులు ఏడుస్తూ నువ్వేమైనా తీసావా మలయాళం తో నేను అలాంటి వాడిని కాదు ఇంతవరకు మీ ఎవరి గదిలోకి వెళ్ళలేదు అంటాడు. శుభమా అని వెళుతుంటే నువ్వేంటి అమ్మ ఇలా చేస్తున్నావ్ రామా నువ్వు బయటికి వెళ్ళు అనడంతో నా ఉంగరం కనిపించే వరకు ఎవరిని బయటికి వెళ్ళనివ్వను అంటుంది మల్లిక. అప్పుడు అందరూ ఎన్ని మాటలు చెప్పినా కూడా మల్లిక అలాగే దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది. మా ఆయనకు అటువంటి అవసరం లేదు అఖిల్ కి కూడా జాబు వచ్చింది కాబట్టి అవసరం లేదు అంటూ జానకి వాళ్ళే అన్నట్టుగా ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుతుంది.