రాజమౌళికి మహేష్ ఇలా షాక్ ఇచ్చాడేంటి?..ఇప్పుడు జక్కన్న పరిస్థితేంటి?
సూపర్ స్టార్ మహేష్బాబు.. దర్శకధీరుడు, టాలీవుడ్ జక్కన్నగా పిలవబడమే టాప్ డైరెక్టర్ రాజమౌళికి బిగ్ షాక్ ఇచ్చాడు. రాజమౌళి ప్లాన్స్ మొత్తం బ్రేక్ చేసేశాడు. మహేష్ నిర్ణయంతో ఇప్పుడు రాజమౌళి పరిస్థితేంటనేది ప్రశ్నార్థకంగా మారింది.
రాజమౌళి ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రమిది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 13న దసరా కానుకగా విడుదల కానుంది. ఆ తర్వాత తాను మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్టు గతేడాది ప్రకటించారు. కానీ రాజమౌళికి ఇప్పుడు మహేష్ షాక్ ఇచ్చాడు.
రాజమౌళికి ఇప్పట్లో డేట్స్ లేకుండా చేస్తున్నాడు మహేష్. బ్యాక్ టూ బ్యాక్ మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇవి పూర్త కావడానికి రెండున్నర నుంచి మూడేళ్లు పడుతుంది. మరి రాజమౌళితో మహేష్ ఎప్పుడు సినిమా చేస్తాడనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. బ్యాంక్ స్కామ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ లెక్కన ఈ ఏడాది మహేష్ నుంచి సినిమానే లేదు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ జరుపుకుంటోంది. కరోనా వల్ల ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆలస్యం, త్రివిక్రమ్ చిత్రంపై పడే అవకాశం ఉంది.
ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ని ఈ ఏడాదిలోనే ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయనున్నట్టు తెలిపారు. దాదాపు 11ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా రాబోతున్న నేపథ్యంలో అందరిలోనూ ఆసక్తి, క్రేజ్ నెలకొంది. కరోనా వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. సమ్మర్ నుంచి కాస్త దసరా, దీపావళికి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో ఓ చిత్రం చేయనున్నాడు మహేష్. తాజాగా ఈ విషయాన్ని అనిల్రావిపూడి ఓ ఇంటర్వ్యూలో కన్ఫమ్ చేశాడు. త్రివిక్రమ్ తో సినిమా తర్వాత నా సినిమా ఉంటుందని, అది `సరిలేరు నీకెవ్వరు`కి సీక్వెల్ కాదని తెలిపారు. అంటే ఆ సినిమా 2023లో విడుదలవుతుంది.
కానీ రాజమౌళి చేస్తున్న `ఆర్ఆర్ఆర్` ఈ అక్టోబర్లోనే విడుదల కానుంది. వెంటనే మహేష్తో సినిమా చేయడానికి అవకాశం లేదు. పైగా వీరిద్దరి మధ్య అఫీషియల్ కమిట్మెంట్ కూడా లేదు. రాజమౌళి..మహేష్తో చేయాలనుకున్నారు. ఆయనకు తగ్గ ఓ కథని సిద్ధం చేయాల్సి ఉంటుంది. మరి అది మహేష్కి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు.
మహేష్పై రాజమౌళి పెట్టుకున్న ఆశలపై ఆయన నీళ్లు చల్లారు. ఓ రకంగా బిగ్ షాకే ఇచ్చారు. మహేష్తో రాజమౌళి సినిమా చేయాలంటే ఈ లెక్కన ఆయన రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే. ఓ హీరో కోసం రాజమౌళి వెయిట్ చేయడం చాలా వరకు జరగదు. ఆయన కోసం మిగిలిన ప్రాజెక్ట్ లు పక్కన పెడుతుంటారు హీరోలు. కానీ మహేష్ తో ఇప్పుడు సినిమా అంటే జక్కన్నకి వెయింటింగ్ తప్పేలా లేదు. ఓ రకంగా ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్గా చెప్పుకునే రాజమౌళికి బిగ్ షాకే అని చెప్పాలి. మరి ఇదే జరుగుతుందా? ఈ లోపు ఇంకా ఏవైనా మార్పులు జరుగుతాయా? అన్నది చూడాలి.