- Home
- Entertainment
- Savitri: ఒంటి మీద బట్టలు తప్ప మిగిలినవన్నీ ఇచ్చేసిన సావిత్రి, క్షణం కూడా ఆలోచించలేదు.. మహానటికి సెల్యూట్
Savitri: ఒంటి మీద బట్టలు తప్ప మిగిలినవన్నీ ఇచ్చేసిన సావిత్రి, క్షణం కూడా ఆలోచించలేదు.. మహానటికి సెల్యూట్
మహానటి సావిత్రి క్షణం కూడా ఆలోచించకుండా నిలువు దోపిడీ ఇచ్చేశారు. ఈ సంఘటనతో మహానటి మనసు ఎలాంటిదో అర్థం అవుతుంది. ఇంతకీ ఈ త్యాగం సావిత్రి ఎందుకు చేశారో తెలుసా?

మహానటి సావిత్రి
చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి ఖ్యాతి చిరస్థాయిగా నిలిచిపోతుంది. తరాలు మారిన ఆమె గురించి సినీ అభిమానులు మాట్లాడుకుంటూనే ఉంటారు. పౌరాణిక సినిమాలతో పాటు అన్ని జోనర్ల కథలలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. సినిమాల్లో ఆమె నటన పక్కన పెడితే రియల్ లైఫ్ లో సావిత్రి గొప్ప మనసున్న వ్యక్తి. సాయం అంటూ ఎవరైనా చేయి చాచితే క్షణం కూడా ఆలోచించకుండా తోచిన సహాయం చేసేవారు. అది ఆమెకి కొన్ని సార్లు మైనస్ కూడా అయింది.
సాయం చేసే గొప్ప గుణం
ఆమె మంచి మనసుని అలుసుగా తీసుకుని చాలా మంది ఆమెని మోసం చేశారు. భర్తతో మనస్పర్థలు, ఆర్థికంగా ఇబ్బందులు, మోసపోవడం లాంటివి సావిత్రిని బాగా కుంగదీశాయి. తనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సాయం చేయడానికి మాత్రం సావిత్రి అస్సలు వెనుకాడేవారు కాదు. ఆమె గొప్ప మనసు ఏంటో తెలియాలి అంటే ఈ సంఘటన గురించి తెలుసుకోవాలి. 1965లో ఇండియా పాక్ వార్ సమయంలో ఇండియన్ ఆర్మీకి సావిత్రి విరాళం ఇచ్చారు.
నిలువుదోపిడీ ఇచ్చేసిన సావిత్రి
అది అలాంటి ఇలాంటి విరాళం కాదు. నిలువు దోపిడీ ఇచ్చేశారు. ఒంటి మీద బట్టలు తప్ప మిగిలిన ఆభరాలన్నీ తీసి ఇచ్చేయడాన్ని నిలువు దోపిడీ అని అంటారు. సాధారణంగా భక్తులు దేవుళ్ళకు మొక్కుబడి ఉన్నప్పుడు ఇలా చేస్తుంటారు. కానీ సావిత్రి ఇండియన్ ఆర్మీ కోసం ఇంతటి గొప్ప త్యాగం చేశారు. మెడలో ఉన్న బంగారు, వజ్రాల హారాలు, చేతికి ఉన్న బంగారు గాజులు, ఉంగరాలు ఇలా తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ సావిత్రి తీసి ఇచ్చేశారు. దీనితో పాటు కొంత డబ్బు కూడా విరాళంగా ఇచ్చారు.
ప్రధాని పిలుపు మేరకు..
అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పిలుపు మేరకు చాలా మంది విరాళాలు ఇచ్చారు కానీ ఇలా నిలువు దోపిడీ ఇచ్చిన ఏకైక నటి సావిత్రే అని చెప్పాలి. సావిత్రికి అప్పట్లో ఉన్న ఆస్తులన్నీ ఉండి ఉంటే ఆమె ఇండియాలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఉండేవారు.
సావిత్రి ఆస్తులు
చెన్నైలోనే సావిత్రికి నాలుగు బంగ్లాలు ఉండేవి. వీటితో పాటు హైదరాబాద్ లో 2, విజయవాడలో ఒకటి, కొడైకెనాల్ లో ఒకటి ఇలా సావిత్రికి చాలా బంగ్లాలు ఉండేవి. సావిత్రికి ఏకంగా 25 డిమాండ్ నెక్లెస్ లో ఉండేవి. పొలాలు కూడా ఉండేవి. చివరికి సావిత్రి అంతా పోగొట్టుకున్నారు.

