ఇలియానా సౌత్ సినిమాలకు దూరం అవ్వడానికి 40 లక్షల గొడవే కారణం.. అదేంటంటే
Katragadda Prasad: కట్రగడ్డ ప్రసాద్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు, నటి ఇలియానా దక్షిణ భారత సినీ పరిశ్రమ నుండి నిషేధానికి గురైన వైనంపై వివరణ ఇచ్చారు. ఒక తమిళ నిర్మాత నుండి రూ. 40 లక్షల అడ్వాన్స్ తీసుకున్న ఇలియానా..

ఆ నిషేధంపై కీలక వ్యాఖ్యలు
ప్రముఖ నిర్మాత, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు కట్రగడ్డ ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దక్షిణ భారత సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, నటి ఇలియానాపై విధించిన నిషేధం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
రూ. 40 లక్షల అడ్వాన్స్
నటి ఇలియానా సౌత్ సినిమాలకు దూరం కావడానికి ప్రధాన కారణం ఆమెపై ఉన్న నిషేధమేనని ప్రసాద్ స్పష్టం చేశారు. ఒక తమిళ నిర్మాత వద్ద రూ. 40 లక్షల అడ్వాన్స్ తీసుకున్న ఇలియానా.. కాల్షీట్లు ఇవ్వడంలో కానీ, ఆ డబ్బు తిరిగి చెల్లించడంలో కానీ విఫలమయ్యారు. ఫిలిం ఛాంబర్ పిలిచినా ఆమె స్వయంగా హాజరుకాకపోవడం, సాక్ష్యాధారాలతో ఆమె తప్పిదం నిరూపితం కావడంతో ఛాంబర్ కఠిన నిర్ణయం తీసుకుంది.
ఆ 40 లక్షల బాకీని
ఆ 40 లక్షల బాకీని చెల్లించే వరకు ఆమెతో ఏ నిర్మాత సినిమా తీసినా, ఆ బాధ్యత సదరు నిర్మాతదే అవుతుందని నిబంధన పెట్టడంతో ఆమెకు అవకాశాలు నిలిచిపోయాయి. 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం ఈ నిషేధ ప్రక్రియ మధ్యలో ఉండగా పూర్తయి ఉండవచ్చని ఆయన వివరించారు.
సరైన బడ్జెట్ ప్రణాళిక..
ఈ నిషేధం ఇప్పటికీ కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఈ కారణంగా ఇతర నిర్మాతలు కూడా ఆమెతో పనిచేయడానికి ముందుకు రాలేదని తెలిపారు. ప్రస్తుత సినీ రంగం తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని కట్రగడ్డ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. సరైన బడ్జెట్ ప్రణాళిక లేకపోవడం వల్ల సుమారు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడి ఇండస్ట్రీలో నిలిచిపోయిందని ఆయన అంచనా వేశారు.
కేవలం ఒక్క సినిమాతోనే..
పాత తరం నిర్మాతలు సినిమాలు తీయడం తగ్గించగా, కొత్తగా వచ్చే వారిలో 90 శాతం మంది కేవలం ఒక్క సినిమాతోనే పరిశ్రమ నుంచి నిష్క్రమిస్తున్నారు. కె.ఎస్. రామారావు, అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి అనుభవజ్ఞులతో పాటు దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ వంటి కొద్దిమంది మాత్రమే ప్రస్తుతం ఇండస్ట్రీని నడిపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

