- Home
- Entertainment
- Rithu Chowdary: అంతా నా కర్మ, మోసం చేసి మరో అమ్మాయితో వెళ్ళిపోయాడు.. కెరీర్ కోసమే నవ్వుతూ బతుకుతున్నా
Rithu Chowdary: అంతా నా కర్మ, మోసం చేసి మరో అమ్మాయితో వెళ్ళిపోయాడు.. కెరీర్ కోసమే నవ్వుతూ బతుకుతున్నా
నటి రీతూ చౌదరి షేర్ చేసిన భావోద్వేగ ఇన్స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రేమ, బ్రేకప్, రూమర్స్పై ఆమె వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.

Rithu Chowdary
సీరియల్స్, రియాలిటీ షోల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రీతూ చౌదరి మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు షో తర్వాత ఆమెకు భారీ స్థాయిలో ఫేమ్ రావడంతో ప్రస్తుతం టీవీ కార్యక్రమాలు, స్టేజ్ ఈవెంట్లు, ప్రత్యేక షోలతో బిజీగా గడుపుతోంది. ఇదే సమయంలో ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటుంది. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఒక ఎమోషనల్ స్టోరీ నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది.
శ్రీకాంత్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో
రీతూ గతంలో శ్రీకాంత్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా అతడితో త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వెల్లడించడంతో ఆ వార్త అప్పట్లో వైరల్ అయింది. కానీ తర్వాత ఏమైందో తెలియకముందే కొంతకాలానికి వారిద్దరూ విడిపోయారు. ఈ బ్రేకప్ విషయాన్ని కూడా రీతూ ఒక ఇంటర్వ్యూలో ధృవీకరించింది. అప్పట్లో ఈ విషయం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
డిమాన్ పవన్తో
ఇక రియాలిటీ షో తర్వాత రీతూ పేరు డిమాన్ పవన్తో కూడా అనుసంధానమైంది. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అయితే ఈ ప్రచారాలపై రీతూ ఎప్పుడూ ప్రత్యక్షంగా స్పందించలేదు. అయినప్పటికీ ఇద్దరూ కలిసి పలు సందర్భాల్లో కనిపించడం, ఫోటోలు షేర్ చేయడం వంటి కారణాలతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి.
భావోద్వేగ పోస్టు వైరల్
ఇలాంటి సమయంలోనే రీతూ తన Instagram స్టోరీలో పెట్టిన భావోద్వేగ పోస్టు వైరల్ అవుతోంది. సమాజం అమ్మాయిలను చాలా సులభంగా జడ్జ్ చేస్తుందని, కానీ వారి జీవితాల్లో జరిగిన నిజాలను తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించరని ఆమె పేర్కొంది. తాను నిజంగా ప్రేమించానని, ఆ వ్యక్తిని ఎంతో కేర్ చేశానని, నిజాయితీగా రిలేషన్లో ఉన్నానని వెల్లడించింది. కానీ చివరకు తానే బాధపడాల్సి వచ్చిందని, ప్రేమ కోసం అడిగినా మోసపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
నవ్వుతూ ముందుకు సాగుతున్నా
రిలేషన్ బ్రేక్ కావడంతో తీవ్ర డిప్రెషన్కి గురయ్యానని చెప్పిన రీతూ, అయినప్పటికీ కుటుంబం, కెరీర్ కోసం నవ్వుతూ ముందుకు సాగుతున్నానని తెలిపింది. నిజాలు తెలుసుకోకుండా సమాజం రూమర్స్నే నమ్ముతుందని ఆవేదన వ్యక్తం చేసింది. మాట్లాడే మాటలు కూడా అలసిపోయినప్పుడు నిశ్శబ్దమే బలం అవుతుందని పేర్కొంది. తనను హార్ట్ బ్రేక్ చేసిన వ్యక్తి మరో అమ్మాయితో ముందుకు వెళ్లిపోయాడని, ఒకప్పుడు ఫ్రెండ్ అని పిలిచిన అమ్మాయితోనే అతడు వెళ్లాడని చెప్పడం ఆసక్తిని రేపుతోంది. అలాగే డబ్బు లేదా అటెన్షన్ కోసం మరో అమ్మాయిపై ఆరోపణలు చేయడం షాక్ ఇచ్చిందని వెల్లడించింది. దీంతో ఆమె చెప్పింది తన జీవితానిదేనా? ఆ వ్యక్తి ఎవరు? గత ప్రేమికుడేనా? లేక మరెవరైనా ఉన్నారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.

