విజయశాంతి బొడ్డుపైనే మొదటి పండు వేశానన్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అంటే కమర్షియల్ చిత్రాలకు పెట్టింది పేరు. కమర్షియల్ చిత్రాల ట్రెండ్ సృష్టించారాయన. వెండితెరపై గ్లామర్ని పరిచయం చేశారు. ముఖ్యంగాహీరోయిన్లని ఎన్ని రకాలుగా చూపించొచ్చో, ఎంత అందంగా చూపించగలమో చేసి చూపించారాయన. ఇక రాఘవేంద్రరావు అంటే ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ల నడుముపై పండ్లు వేయడం. సినిమాలో ఆయా సీన్లు అంతే ఫేమస్సు. ఆ విశేషాలు చూస్తే..
రాఘవేంద్రరావు సినిమా అంటే హీరోయిన్లపై పండ్లు వేయడమనే సీన్ కచ్చితంగా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. ఒకానొక దశలో అలాంటి సీన్ల కోసమే సినిమాకి వచ్చిన ఆడియెన్స్ కూడా ఉన్నారని చెబితే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు.
తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఈ ప్రత్యేకత మాత్రం ఆ నాటి నుంచి నేటి వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆయన రూపొందిస్తున్న ప్రతి సినిమాలో ఈ సీన్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తుంటుంది ప్రేక్షకలోకం.
రాఘవేంద్రరావు ఫస్ట్ టైమ్ వెండితెరకి పండుకి పరిచయం చేసింది `మంచిదొంగ` చిత్రంలోనే అట. చిరంజీవి, విజయశాంతి, సుహాని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ బొడ్డుపై పండు వేయాలనే ఆలోచన వచ్చింది.
ఈ సినిమాలో వచ్చే `ఫస్ట్ నైట్` సాంగ్లో విజయశాంతిపై పండు వేయడాన్ని తీశారు. ఇందులో విజయశాంతినే పండ్లు తీసుకుని తన బొడ్డుపై వేసుకుంటుంది.
చిరంజీవికి, విజయశాంతికి మధ్య వచ్చే ఫస్ట్ నైట్ రొమాంటిక్ సాంగ్లో ఈ పండ్లు పడే సన్నివేశం వస్తుంది.
తొలి సినిమాలోనే ఇది బాగా హైలైట్ అయ్యింది. ఈ సీన్కి అపూర్వమైన స్పందన రావడంతో దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారట రాఘవేంద్రరావు.
తాజాగా ఓ ఇంటర్వ్వూలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో చిరంజీవి, విజయశాంతిల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది.
తెలుగు తెరపై మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పండించిన రొమాన్స్ గానీ, డాన్స్ గానీ ప్రత్యేకంగా నిలుస్తుంది. మంచి హిట్ కాంబినేషన్గానూ ఈ జోడి నిలుస్తుంది.
ఫస్ట్ నైట్ సాంగ్లో ఓ దృశ్యం.