- Home
- Entertainment
- NTR: 15 ఏళ్ళ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి పౌరాణిక చిత్రం..తాత, బాబాయ్ టచ్ చేయని రోల్ లో తారక్
NTR: 15 ఏళ్ళ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి పౌరాణిక చిత్రం..తాత, బాబాయ్ టచ్ చేయని రోల్ లో తారక్
నందమూరి ఫ్యామిలీ నుంచి 15 ఏళ్ళ తర్వాత ఒక పౌరాణిక చిత్రం రాబోతోంది. యుంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోతున్న ఆ మూవీకి సంబంధించిన సర్ప్రైజ్ మే 20న ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Jr NTR
టాలీవుడ్ లో పౌరాణిక చిత్రాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేసి నందమూరి తారక రామారావు. తెలుగు ప్రేక్షకులకు రాముడు, కృష్ణుడు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆరే. ఆ పాత్రలో ఎన్టీఆర్ అంతగా ప్రభావం చూపారు. రాముడు కృష్ణుడు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ మహాశివుడిగా, వెంకటేశ్వర స్వామిగా, అర్జునుడిగా, రావణబ్రహ్మగా ఇలా ఎన్నో పాత్రల్లో నటించారు.
బాలకృష్ణ పౌరాణిక పాత్రలు
ఎన్టీఆర్ వారసత్వంతో ఆయన తనయుడు బాలకృష్ణ కూడా కొన్ని పౌరాణిక పాత్రలో నటించారు. అభిమన్యుడిగా, కృష్ణుడిగా, రాముడిగా బాలయ్య నటించారు. ఇటీవల కాలంలో పౌరాణిక చిత్రాలు టాలీవుడ్ లో బాగా తగ్గిపోయాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి చివరగా 15 ఏళ్ళ క్రితం పౌరాణిక చిత్రం వచ్చింది. అది బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం చిత్రం.
గాడ్ ఆఫ్ వార్
15 ఏళ్ళ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పౌరాణిక చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పౌరాణిక చిత్రంలో నటించబోతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబోలో గాడ్ ఆఫ్ వార్ అనే మూవీ రాబోతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.
తాత, బాబాయ్ టచ్ చేయని రోల్ లో తారక్
ఇది సుబ్రహ్మణ్యస్వామికి సంబంధించిన కథ. ఈ మూవీలో తారక్ సుబ్రహ్మణ్య స్వామిగా నటించబోతున్నారు. ఈ పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ కానీ, బాలయ్య కానీ నటించలేదు. ఆ అవకాశం తారక్ కి దక్కింది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20న ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ అనౌన్స్ మెంట్ వీడియో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
భారీ బడ్జెట్ లో మూవీ
ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ లో, కళ్ళు చెదిరే విఎఫ్ఎక్స్ వర్క్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. తారక్ అభిమానులంతా గ్రాండ్ అనౌన్స్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.

