Janaki Kalaganaledu: అఖిల్ ని జైలు నుంచి విడిపించిన జానకి.. సంతోషంలో జ్ఞానాంబ కుటుంబం?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 17 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈ రోజు ఎపిసోడ్లో రామచంద్ర జానకి అన్న మాటలు గురించి తెలుసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. మరొకవైపు జానకి ఏపీఎస్ పుస్తకాలు చూసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరొకవైపు జ్ఞానాంబ అఖిల్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు జానకి బుక్స్ అన్ని వాటిని చూస్తూ తీసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. గోవిందరాజులు కూడా అఖిల్ ని తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అప్పుడు రామచంద్ర అందరూ అఖిల్ కోసం బాధపడుతూ ఉండడం చూసి రామచంద్ర కూడా బాధపడుతూ ఉంటాడు.
ఆ మరొకవైపు జానకి తన బుక్స్ అన్నీ కట్టేస్తూ ఐపీఎస్ చదువుకి బాయ్ బాయ్ చెప్పాలని నిర్ణయించుకొని బుక్స్ అన్ని పక్కన పెట్టేస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం రామచంద్ర ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి జానకి వచ్చి నేను అఖిల్ ని విడిపిస్తాను కేసు విత్ డ్రా చేసుకుంటాను అని చెప్పడంతో రామచంద్ర సంతోషపడతాడు. అప్పుడు జానకి గారు ఎంత చెప్పినా శుభవార్త చెప్పారు అని రామచంద్ర శుభవార్తను చెప్పడానికి ఇంట్లో అందర్నీ పిలుస్తాడు. మా జానకి మాత్రం బాధపడుతూ ఉంటుంది.
అప్పుడు అందరు అక్కడికి రావడంతో ఏం జరిగింది రామచంద్ర అని జ్ఞానాంబ అడగగా అప్పుడు రామచంద్ర అమ్మ తమ్ముడు స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేస్తున్నాడు అనడంతో అందరికీ అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు. ఎలా రామా అని అడగగా జానకి గారు తమ్ముడిపై పెట్టిన కేసును విత్ డ్రా చేసుకుంటానని చెప్పారు అని చెప్పడంతో అందరు ఒక్కసారిగా సంతోషపడతారు. అప్పుడు సంతోషంతో లోపలికి వెళ్లి జానకిని పిలుచుకుని వచ్చి ఆ మాట మీరే చెప్పండి జానకి గారు అని అనగా జానకి అసలు విషయం చెప్పడంతో అందరూ ఒక్కసారిగా సంతోషపడుతూ ఉంటారు.
అప్పుడు జెస్సి సంతోషపడుతూ ఉండగా రామచంద్ర వెళ్లి జెస్సి కి ధైర్యం చెప్పి కడుపులో ఉన్న బిడ్డతో మాట్లాడుతూ ఉంటాడు రామచంద్ర. అప్పుడు అందరూ మేము వస్తాము అని అనడంతో వెంటనే రామచంద్ర అందరూ అక్కడికి ఎందుకు అక్కడ సరిగ్గా తిన్నాడో లేదో అందరూ ఇక్కడే ఉండి వాడికి వంటలు చేసి పెట్టండి చికిత నువ్వు ఎర్ర నీళ్లు రెడీగా చేసి పెట్టు దిష్టి తీద్దాం అని అంటాడు రామచంద్ర. తర్వాత రామచంద్ర జానకి లాయర్ ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్ కి అఖిల్ ని విడిపించడానికి వెళ్తారు. అప్పుడు అఖిల్ వాళ్ళని చూసి సంతోష పడుతూ నన్ను విడిపిస్తున్నారా అన్నయ్య అని సంతోషంగా మాట్లాడుతాడు.
తర్వాత రామచంద్ర పోలీస్ తో తన తమ్ముడు ఎటువంటి తప్పు చేయలేదు అని వాదిస్తూ ఉంటాడు. అప్పుడు రామచంద్ర జానకి గారు నా తమ్ముడి మీద పెట్టిన కేసు విత్ డ్రాప్ చేసుకుంటాను అని పోలీసు వాళ్లకి చెప్పండి అనడంతో అప్పుడు జానకి తాను ఐఏఎస్ అధికారిగా ప్రమాణం చేసిన విషయాలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది. తర్వాత జానకి అఖిల్ పై పెట్టిన కేసు విత్ డ్రా చేయడంతో వెంటనే అఖిల్ ని విడుదల చేస్తారు.. అప్పుడు అఖిల్ సంతోషంతో వచ్చి రామచంద్రను హత్తుకుంటాడు. జానకి అఖిల్ ని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.