- Home
- Entertainment
- Guppedantha Manasu: సాక్షిని బయటకు ఈడ్చుకోచ్చిన జగతి.. రిషీ కోసం గౌతమ్ సాయం తీసుకున్న వసు?
Guppedantha Manasu: సాక్షిని బయటకు ఈడ్చుకోచ్చిన జగతి.. రిషీ కోసం గౌతమ్ సాయం తీసుకున్న వసు?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 9 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే రిషి (Rishi) ను డిస్టర్బ్ చేస్తున్నందుకు గాను జగతి (Jagathi) సాక్షి ని చెయ్యి పట్టుకుని బయటకు లాక్కుని వస్తుంది. దాంతో దేవయాని జగతి ఎక్కువ చేస్తున్నావ్ అని అంటుంది. సాక్షి అంతకన్నా ఎక్కువ చేస్తుందని జగతి అంటుంది. ఇక తల్లిగా నాకు అధికారం ఉంది అని సాక్షి చంప మీద కొట్టినట్లు చెబుతోంది. ఇక నువ్వు ఇక్కడ నుంచి అర్జెంటుగా బయటకు వెళ్ళక పోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటుంది.
ఇక నువ్వు ఎందుకు వచ్చావో.. నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు అని సాక్షి (Sakshi) ని జగతి అంటుంది. ఇక దేవయాని (Devayani) నువ్వు వెళ్ళు సాక్షి.. నేను నీతో తర్వాత మాట్లాడతాను అని అంటుంది. రిషి నిన్ను ఎప్పటికీ తల్లిగా అంగీకరించడు అని దేవయాని జగతి తో అంటుంది. ఇక రిషి ని కన్నది నేను ఎలాంటి స్వార్ధం లేకుండా రిషి బాగుండాలని కోరుకునేదే నేను అని జగతి అంటుంది.
ఇక దేవయాని (Devayani) నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు.. అది నీ అదృష్టం అనుకో అని అంటుంది. ఆ తర్వాత వసు మహేంద్ర (Mahendra) ద్వారా వీడియో కాల్ లో రిషి ను చూస్తూ బాధపడుతుంది. ఆ తర్వాత వసును గౌతమ్ కలిసి నేను వాడిని అలా మంచంపైన చూడలేక పోతున్నాను అని అంటాడు. ఇక రిషి ను కాదన్నావు అని తెలిసి.. నేను చాలా ఫీల్ అయ్యాను వసుధరా అని గౌతమ్ అంటాడు.
ఇక రిషి (Rishi) కి నో చెప్పాక నువ్వు ఖచ్చితంగా ఫీల్ అయ్యావు కదా అని గౌతమ్ (Goutham) వసును అంటాడు. ఆ మాటతో వసు స్టన్ అవుతుంది. ఇక రిషి ను వదిలి వెళ్ళడానికి నీకు మనసు రాలేదు అని అంటాడు. ఇక వసు గౌతమ్ చేతిలో కుంకం పెడుతుంది. నాకు అంతా అర్ధం అయిగింది వసు అంటూ గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి మంచం పైనుంచి కింద పడుతూ ఉండగా జగతి పట్టుకుంటుంది.
ఆ తర్వాత జగతి (Jagathi) కోపం ఉంటే తీర్చుకోవాలి.. దుఃఖం ఉంటే బయట పడేయాలి అని రిషి (Rishi) తో అంటుంది. ఇక రిషి నన్ను ప్రశాంతంగా ఒంటరిగా వదిలేయండి అని జగతి తో విరి చేసినట్టుగా మాట్లాడుతాడు. దాంతో జగతి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఈ క్రమంలో అక్కడకు గౌతమ్ వచ్చి వసు ఇచ్చిన దేవుడు బొట్టును రిషికి పెడతాడు.
తరువాయి భాగం లో రిషి (Rishi) కాలేజ్ కి వెళతాడు.. దాంతో స్టూడెంట్స్ అందరూ తనకి ఫ్లవర్స్ ఇస్తూ ఉంటాడు. ఇవేం నాకొద్దు అని రిషి అక్కడినుంచి వెళతాడు. ఆ తర్వాత వసు చేతిలో ఫ్లవర్ రిషి జేబులో తెలియకుండా ఉంటుంది. ఇక ఈ లోపు మహేంద్ర (Mahendra) వచ్చి మనం ఏది వద్దు అని అనుకుంటామో.. అదే మన దగ్గరకు వస్తుంది అని అంటాడు.