కరోనా సోకిన జబర్దస్త్ వర్ష భయానక అనుభవాలు... శవాలను చుట్టి గుట్టలుగా పడేస్తున్నారంటూ...!
కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రోజురోజుకు కరోనా రోగుల సంఖ్య అధికం అవుతుంది. ఇక బుల్లితెర, వెండితెర ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు.
రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో టాలీవుడ్ సెలెబ్రిటీలు కరోనా రోగులుగా మారారు. తాజాగా బుల్లితెర నటి, జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష, తనకు కరోనా సోకినట్లు తెలియజేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
తన వీడియో సందేశంలో కొన్ని షాకింగ్ విషయాలు ఆమె వెల్లడించడం జరిగింది. రెండు రోజులుగా స్వల్ప అనారోగ్యంగా ఉంది. దీనితో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. పరీక్షలలో పాజిటివ్ అని తేలింది.
సడన్ గా వీడియో చేయడానికి కూడా కారణం ఇదే. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆసుపత్రులలో ఏమి జరుగుతుందో బయటివారికి తెలియడం లేదు. శవాలను కవర్స్ లో చుట్టి పక్కన పడేస్తున్నాడు.
వేడినీళ్లు త్రాగడంతో పాటు, కరోనా బారిన పడకుండా ఉండడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోండి. అంటూ వర్ష తన వీడియో సందేశం ముగించారు.
ఇక వర్షకు కరోనా సోకిందని తెలుసుకున్న ఆమె అభిమానాలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కోరుకుంటున్నారు.
సీరియల్ నటిగా బుల్లితెరకు పరిచయమైన వర్ష, జబర్దస్త్ షో ద్వారా పాప్యులర్ అయ్యారు. కమెడియన్ ఇమ్మానియేల్ తో ఆమె రొమాన్స్ సూపర్ హిట్ అయ్యింది.
బుల్లితెర క్రేజీ జంటగా వర్ష, ఇమ్మానియేల్ మారారు. ప్రేమికులన్న బ్రాండ్ ఇమేజ్ వర్ష, ఇమ్మానియేల్ లకు అవకాశాలు తెచ్చి పెడుతుంది.
జబర్దస్త్ తో పాటు అనేక బుల్లితెర షోలు, ప్రత్యేక కార్యక్రమాలలో వర్ష, ఇమ్మానియేల్ సందడి చేస్తున్నారు.