- Home
- Entertainment
- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ను స్టార్ సింగర్ ను చేసిన కమెడియన్ ఎవరు..? అప్పట్లోనే అంత డబ్బు ఇచ్చాడా..?
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ను స్టార్ సింగర్ ను చేసిన కమెడియన్ ఎవరు..? అప్పట్లోనే అంత డబ్బు ఇచ్చాడా..?
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరికిన గాన గంధర్వుడు. పాటల రికార్డుల రారాజు, తెలుగు కీర్తి కిరీటంలో కలికితురాయి. ఇంత గొప్ప స్థానం సాధించిన ఆయనను ఇండస్ట్రీలో నిలబెట్టింది మాత్రం ఓ కమెడియన్ అని మీకు తెలుసా..?

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం... తెలుగు జాతి గర్వించదగ్గ పేరు. తరాలు మారినా చెరగని కీర్తి...మరణం తరువాత కూడా వినిపించే గొంతు. ఎన్నియుగాలైనా నిలిచిపోయే పాటలు.. పాటలకు పట్టుబట్టలు కడితే కనిపించే రూపం బాలు. ఆయన సాధించినది ఎవరికీ సాధ్య కాదేమో.. ఎవరు చేయలేరేమో.. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకున్నా.. మంచే జరుగుతంది అనేంతలా అభిమానులను సంపాదించుకున్నారు ఎస్పీబీ.
అక్కినేని నాగేశ్వరరావు - రామానాయుడు మధ్య గొడవ, ఆ పాట వెనుక ఇంత మ్యాటర్ ఉందా..?
తెలుగు నాట పుట్టినా.. తమిళ, కన్నడ జనాలు మావాడంటే మావాడు అని పోటీపడి తమవాడినిచేసుకోవాలి అని చూసిన తెలుగు సంపద బాలసుబ్రహ్మణ్యం. దాదాపు 50 వేల పాటలతో రికార్డ్ లనుబ్రేక్ చేసి.... రికార్డ్ లతో కూడా డాన్స్ చేపించగలిగిన గాత్రం బాలుది. దాదాపు 18 భాషల్లో వేల పాటలకు ప్రాణం పోసిన బాలసుబ్రహ్మణ్యం.. కోవిడ్ వేవ్ లో అభిమానులను శోక సంద్రంలో ముంచి దివంగతులయ్యారు.
శ్రీదేవికి మూడో కూతురు కూడా ఉందా..? ఎవరికీ తెలియని రహస్యం ఎలా బయటపడింది..?
గిన్నిస్బుక్ రికార్డును సొంతం చేసుకున్న గానగంధర్వుడు.. బాలసుబ్రహ్మణ్యం. ఈయన ఎదిగిన తీరు అందరికీ ఒక పాఠం. నెల్లూరు జిల్లాకు చెందిన ఈయన చాలా కష్టాలు పడి.. సినిమా రంగంపై ఆసక్తితో ముందుకు సాగారు. అప్పట్లో ఇప్పటి మాదిరిగా టీవీషోలు పెట్టి ప్రోత్సహించినవారు లేరు. అవకాశాలు వెతుక్కుంటూ ప్రయాణించాల్సిందే. అటువంటి టైమ్ లో.. ఎంతో శ్రమించి.. అవకాశం సాధించిన తనేంటో నిరూపించుకున్నారు బాలు. ఇక ఇంతలా ఎదిగిన ఆయనకు మొదటి అవకాశం ఇచ్చింది ఓ కమెడియన్ అని మీకు తెలుసా..?
ఇండస్ట్రీలో ఘంటసాల లాంటి దిగ్గజాలు.. తుఫానులా దూసుకుపోతున్న రోజులవి.. ఆయనన్ను దాటి ఎవరు ముందుకు వచ్చి కొత్తవారికి అవకాశాలు ఇవ్వలేదు. అంత సాహసం చేసేవారు కాదు. ఘంటసాల తరువాత ఏఎం రాజా, పిఠాపురం నాగేశ్వరరావు, పిబి శ్రీనివాస్ లాంటివారు గాయకులుగా ఉన్నారు. ఇంత పెద్ద సంగీత సామ్రాజ్యంలో ఘంటసాల అంటేనే.. సంగీత దర్శకులు ముందుకు వచ్చేవారు. అంత బలమైన గాలికి కూడా ఎదురెల్లి నిలుచున్నాడు బాలు. అలాంటి రోజుల్లో ఇండస్ట్రీ మెట్లెక్కిన బాలసుబ్రహ్మణ్యంకు.. మొదటి అవకాశం ఇచ్చింది మాత్రం స్టార్ కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ హీరో పద్మనాభం.
ఇండస్ట్రీకి ఖాళీ చేతులతో వచ్చి.. గొప్పగా సాధించి కోటీశ్వరుడైన పద్మనాభం.. తనలాగే ఇండస్ట్రీకి వచ్చినవారిని హక్కున చేర్చుకున్నాడు. సినిమాలు నిర్మించి కొత్తవారికి అవకాశాలు ఇచ్చేవారట. ఆయనే హీరోగా నటిస్తూ.. ఆయనే నిర్మించుకున్న సినిమాలకు కొత్తవారిని ఎంక్రేజ్ చసేవారట పద్మనాభం. ఇందులో భాగంగా.. ఆయన సొంత బ్యానర్ పెట్టుకుని.. తీసిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాతో చాలామంది కొత్తవారికి అవకాశాలు కల్పించారు. ఇందులో గాయకులు కూడా ఉన్నారు.
ఆ కొత్త బ్యాచ్ లో ఉన్న గాయకులలో బాలసుబ్రహ్మణ్యం కూడా ఒకరు. అయితే బాలు కొత్తవారు కాబట్టి.. పద్మనాభం ఆయన్నుతక్కువగా చూడలేదట. చాలా మర్యదగా ప్రవర్తించేవారట. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా బాలుకి అదృష్టం వరించిందనే చెప్పాలి. అప్పట్లో ఘంటసాల లాంటిస్టార్ సింగర్ పాటలకు 500 వరకూ తీసుకుంటే.. మొదటి పాటకే బాలు 300 తీసుకున్నారంట.
అసలు కొత్త గాయకులకు ఇంత ఇచ్చేవారు కాదట అప్పట్లో.. తిండిపెట్టి.. పదో ఇరవైయో చేతిలో పెట్టేవారట. కాని బాలుకి అలా జరగలేదు.. ఈలెక్కన బాలూని అప్పుడే స్టార్ సింగర్ చేసింది పద్మనాభంమే. అంతే కాదు అలా నిర్విరామంగా పాటలు పాడిన బాలు.. 90స్ లోకి ఎంటర్ అవ్వడంతోనే పాటకు 3 లక్షలు తీసుకున్నారంటే.. అప్పట్లో బాలు డిమాండ్ఎంత స్పీడ్ గా పెరిగింది అనేది అర్ధం అవుతుంది.
ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలని చెప్పేవారట. అంతేకాదు.. నిరంతర శిక్షణతో ఎన్నిమెట్లయినా.. ఎక్కొచ్చని చెప్పేవారట. ఇదే తర్వాత.. కాలంలో బాలుకు ఉపయోగపడింది. ఏది ఏమైనా.. బాలు మనమధ్య లేరు. కోవిడ్ మహమ్మారి ఆయన్ను సంగీత ప్రియులకుదూరంచేసింది. అయినా సరే ఆయన గాత్రం ఈ భూమి మీద మనిషి ఉన్నంతవరకూ మారు మోగుతూనే ఉంటుంది.