21,000 కోట్ల ఆస్తికి వారసురాలు, పాన్ ఇండియా హీరోకి భార్య ఎవరో తెలుసా?
21 వేల కోట్ల ఆస్తికి వారసురాలు, పాన్ ఇండియాతో పాటు పాన్ ఇండియా సినిమాను ఏలుతూ.. పాన్ వరల్డ్ సినిమాలో కూడా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో భార్య. ఇటు అత్తింట్లో.. అటు పుట్టింట్లో మహారాణిలా వైభోగాలు కలిగి ఉన్న మెగా మహిళ ఎవరో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
అతి పెద్ద సినిమా కుటుంబానికి కోడలు, పాన్ ఇండియా హీరో, గ్లోబల్ స్టార్ హీరోకు భార్య వేల కోట్ల ఆస్తులతో రాజభోగాలను అనుభవిస్తున్న మహారాణి. అంతే కాకుండా ఆమె 21000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఆ సింగిల్ లేడీ ఎవరు?... ఆమె చేసే వ్యాపారాలు ఏమిటి? చూద్దాం.
Also Read: నా కొడుకుతో సినిమా చేయి ప్లీజ్ అంటూ, రాజమౌళిని బ్రతిమలాడిన సీనియర్ హీరో ఎవరో తెలుసా?
రామ్ చరణ్, ఉపాసన
ఆమె మరెవరో కాదు స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన. ఉపాసన కామినేని, రామ్ చరణ్ 2012లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లయిన దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈ దంపతులకు 2023లో క్లీంకార అనే పాప పుట్టి మెగా ఇంటికి అదృష్ట దేవతగా మారింది.
Also Read: 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని సౌత్ స్టార్ హీరోయిన్లు, బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోన్న నటీమణులు
ఉపాసన ఫ్యామిలీ
టాలీవుడ్ లో ఉన్న ధనవంతులైన హీరోలలో రామ్ చరణ్ ఒకరని అందరికీ తెలుసు. ఆయన సినిమాతో పాటు చాలా బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టారు. రామ్ చరణ్ లాగే ఆయన భార్య ఉపాసన కూడా చాలా ఆస్తులు కలిగి ఉన్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన ఒక పెద్ద ధనవంతుల ఇంటి వారసురాలు అని చాలా మందికి తెలియకపోవచ్చు. అపోలో హాస్పిటల్స్ అధిపతిగా ఉపాసన వేల కోట్ల ఆస్తులను కూడబెట్టారు.
రామ్ చరణ్ భార్య ఉపాసన
రామ్ చరణ్ భార్య ఉపాసన, వ్యాపారవేత్త ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు. అంతేకాకుండా ప్రముఖ అపోలో హాస్పిటల్స్ లో ఉపాసన ఉన్నత పదవిలో ఉన్నారు. దీనితో పాటు ఉపాసన ‘బి పాజిటివ్’ అనే మ్యాగజైన్ కు చీఫ్ ఎడిటర్ గా కూడా పనిచేస్తున్నారు.
ఇవి మాత్రమే కాకుండా ఉపాసన కుటుంబ సంక్షేమ బీమా సంస్థ అయిన TPA మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు. ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ చదివిన ఉపాసన స్వచ్ఛంద సేవా సంస్థలలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు.
ఉపాసన నెట్ వర్త్
ఇన్ని అర్హతలు ఉన్న ఉపాసన.. మెగా ఫ్యామిలీ కోడలు కావడంతో.. చిరంజీవి ఫ్యామిలీ మరింత ధనవంతుల కుటుంబంగా మారింది. అంతేకాకుండా రామ్ చరణ్-ఉపాసన జోడి భారతదేశంలో ధనవంతులైన సెలబ్రిటీ జంటలలో ఒకటిగా ఉన్నారు.
ఈ స్టార్ జంట ఆస్తుల విలువ రూ.2500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అంతే కాకుండా వేల కోట్ల ఆస్తికి వారసురాలు అయిన ఉపాసన వ్యక్తిగత ఆస్తి మాత్రమే 1,300 కోట్లు ఉంటుందని.. రామ్ చరణ్ ఆస్తి 1200 కోట్లు అని అంచనా.
ఉపాసన ఫ్యామిలీ
ఉపాసన తాత ప్రతాప్ సి.రెడ్డి 77,000 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. అంతేకాకుండా భారతదేశంలో 100 మంది బిలియనీర్లలో ప్రతాప్ రెడ్డి ఒకరు. ప్రతాప్ రెడ్డి నేతృత్వంలోని అపోలో హాస్పిటల్స్ మార్కెట్ విలువ రూ.21 వేల కోట్లు ఉంటుందట.
ఇక వీటికి ఏకైక వారసురాలు ఉపాసన. ఉపాసన తండ్రి అనిల్ కామినేని KEI అనే కంపెనీని నడుపుతున్నారు. అదేవిధంగా ఉపాసన తల్లి శోభన కూడా అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇలా ఫ్యామిలీ మొత్తం చాలా ఆస్తులు కలిగి ఉన్నారు.