Guppedantha Manasu: మహేంద్రని, రిషిని కలపడానికి గౌతమ్ ప్రయత్నం.. రిషి మాటలకు బాధపడుతున్న జగతి, మహీంద్ర!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు అక్టోబర్ 25వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..వసు రిషితో, వాళ్ళిద్దరూ వెళ్లిపోవడానికి ఒక రకంగా మనిద్దరం కూడా కారణమే అయి ఉండొచ్చు కదా సార్ గురుదక్షిణ విషయంలో అని వసు అనగా, ఎందుకు వసుధార ప్రతిసారి తిరిగి అక్కడే వస్తావు అయినా డాడ్ వాళ్ళు తిరిగి వస్తారు అని అంటాడు రిషి. తిరిగి వచ్చే చిన్న సమస్య అయితే ఇలా వెళ్లే వారే కాదు కదా సార్ అని వసు అంటుంది. ఆ మాట అనొద్దు అది వినడానికి నాకు భయంగా ఉన్నది వసుధార అని అనగా, మరి అర్థం చేసుకోకపోవడం వల్ల ఇలా అయ్యి ఉండొచ్చు సార్ అని అనగా, నేను అందర్నీ అర్థం చేసుకుంటే మరి నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అని అంటాడు రిషి. దానికి వసు, నేనున్నాను కదా ఒకసారి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అని అంటుంది వసు.అప్పుడు రిషి, ఇంక పదా లోపలికి కి వెళ్దాము మీటింగ్ కి డాడ్ వాళ్ళని కూడా రమ్మన్నాను కదా వాళ్ళు కచ్చితంగా వస్తారు అఫీషియల్ గా మెయిల్ పెట్టాను కదా అని అంటాడు. మీటింగ్ గది బయట రిషి, వసుధారలు చాలాసేపటి వరకు ఎదురు చూస్తూ ఉంటారు.
అప్పుడు వసు, సార్ మీటింగ్ కి టైం అవుతుంది ఇంకా రాలేదు అని అనగా వసుధార నువ్వు భయపడొద్దు నన్ను భయపెట్టొద్దు అఫీషియల్ గా మెయిల్ పంపాము కదా ఖచ్చితంగా వస్తారు అని చాలాసేపటి వరకు ఇద్దరూ ఎదురు చూస్తూ ఉంటారు. మరోవైపు జగతి, మహీంద్ర లు గౌతమ్ తో మాట్లాడుతూ, రిషి మా గురించి బాధపడుతున్నాడని మాకు తెలుసు గౌతమ్ కానీ ఈ పరిస్థితుల్లో ఇదే చేయాలి లేకపోతే రిషి మమ్మల్ని అర్థం చేసుకోడు అని అంటారు. అదే సమయంలో వసు గౌతమ్ కి మెసేజ్ పెట్టి, రిషి సార్, మేడమ్ సార్ల కోసం చాలా బాధపడుతున్నారు అని అంటుంది. అప్పుడు గౌతమ్, వసుధార మెసేజ్ పంపింది అంకుల్ రిషి మీకోసం బాధపడుతున్నాడట చాలా కంగారుగా ఉన్నాడట అని అనగా నాకు రిషి మనసు తెలుసు గౌతమ్.
అఫీషియల్ గా మాకు మెయిల్ పెట్టాడు కదా వస్తాము అని ఎంతో ఆశగా ఉన్నట్టున్నాడు ఎదురు చూస్తూ ఉంటాడు అని బాధపడతారు. అప్పుడు గౌతమ్ ఆలోచిస్తూ ఇప్పుడే వస్తాను అని అటువైపు వెళ్లి రిషికి మెసేజ్ చేస్తూ, నేను ఒక చోటికి రమ్మంటాను అక్కడికి రా అని అడ్రస్ పంపుతాడు. అది చూసిన రిషి గౌతమ్ కి మెసేజ్ పంపాడు. అంటే గౌతమ్ కి వాళ్ళు ఎక్కడున్నారో తెలిసి ఉంటుంది అందుకే పిలుస్తున్నాడు బయలుదేరుదాం రా వసుధార అని అనగా, మరి మీటింగ్ ఏం చేద్దాం అని వసు అంటుంది. క్యాన్సిల్ చేసేమని రిషి అంటాడు. మరోవైపు దేవయాని ఎవరికో ఫోన్ చేసి హమ్మయ్య శుభవార్త చెప్పారు అయితే జగతి, మహేంద్రలు మీటింగ్ కి రాలేదన్న మాట సరే అని ఫోన్ పెట్టేసిన తర్వాత ఇలాగే ఉంటే నేను రిషికి ఇంకా దగ్గరయి వాళ్ళని దూరం చేయొచ్చు అని అనుకుంటుంది.
అదే సమయంలో ధరణి ఆ మాటలు వింటుంది. ధరణి ని చూసిన దేవయాని ఉలిక్కిపడి ఎప్పుడు వచ్చావు ధరణి, ఈమధ్య నన్ను భయ పెట్టేస్తున్నావు. ఏమీ ఇవన్నీ విని ఎవరికైనా చాడీలు చెప్పి గూడచారం చేస్తున్నావా అని అనగా, నేనెందుకు అలా చేస్తాను అత్తయ్య గారు. మీరే నా దైవం కదా అని అనగా, నేను జీవితంలో ఎంతో మందిని చూశాను కాని నీ లాంటి వాళ్ళ గురించి మాత్రం ఎప్పటికీ ఒక అంచనా వేయలేకపోతున్నాను నువ్వు ఎప్పటికైనా ఒక వసుధార లాగా ఒక జగతి లాగా తయారవుతావేమో అని భయమేస్తుంది. నువ్వు ఎప్పటికీ దేవయాని కోడలు వే అని అంటుంది దేవయాని. అప్పుడు ధరణి మనసులో నవ్వుకుంటుంది. ఆ తర్వాత సీన్లో జగతి మహేంద్రలు కూర్చుని ఉండగా గౌతమ్ నేనిప్పుడే వస్తాను అని అంటాడు. ఇంతలో రిషి ఆ ఇంటి తలుపు కొట్టి గౌతమ్ అని అరుస్తాడు. ఆ గొంతు విని జగతి, మహేంద్రలు భయపడి రిషి ఇక్కడికి ఎలా వచ్చాడు.
తెలిసిపోయిందా గౌతమ అసలు ఏం జరుగుతుంది అని గౌతమ్ మీద అరుస్తారు. దానికి గౌతమ్, నేనే చెప్పానం అంకుల్. అందరూ కూర్చొని మాట్లాడుకుంటే తేలుతుంది కదా అని అనగా, గౌతమ్ ఎందుకిలా చేస్తున్నావు స్నేహభావం ఎక్కువైపోయిందా వెనకాతల నుంచి తలుపులు తీయి మేము వెళ్తాము అనగా, దీనికి ఒక్క తలుపులే ఉంటాయి అంకుల్ వెనకాతల తలుపులు లేవు అని గౌతమ్ అంటాడు. దానికి మహేంద్ర, మేము పక్కన దాకుంటాము రిషికి కానీ మేము ఇక్కడ ఉన్నట్టు తెలిస్తే జీవితంలో నేను నీతో మాట్లాడను గౌతమ్ అని మహేంద్ర చెప్పి లోపలికి వెళ్తాడు. ఇంతలో రిషి పదే పదే తలుపు కొడతాడు. అప్పుడు తలుపు తీసిన వెంటనే ఎందుకురా ఇంతసేపు అయింది తలుపు తీయడానికి. డాడ్ వాళ్లు ఇక్కడే ఉన్నారు కదా నాకు తెలుసు నువ్వు అందుకే నాకు ఫోన్ చేశావు అని డాడ్! డాడ్! అని అరుస్తూ ఉంటాడు.
అప్పుడు గౌతమ్, లేదురా అంకుల్ వాళ్లు ఇక్కడ లేరు నేను నీతో మాట్లాడదామని పిలిచాను సాయంత్రం వస్తావు అనుకున్నాను కానీ ఇప్పుడే వస్తావ్ అనుకోలేదు అని అనగా, నాకు డాడ్ కన్నా ఇంకేమీ ఇంపార్టెంట్ కాదురా వారి కోసం ఎంతకైనా వెళ్తాను అని రిషి అంటాడు ఆ మాటలు విని జగతి, మహీంద్రలు బాధపడతారు.ఇంతలో వసుధార మంచినీళ్లు కోసం మహేంద్ర వాళ్ళు ఉన్న వైపు వెళ్తుండగా గౌతమ్ ఆపి నేను వెళ్లి తెస్తాను మీరు అటు ఇటు తిరుగొద్దు కూర్చోండి అని అంటాడు. అటువైపు వెళ్లి మంచినీళ్లు పట్టే లోగా జగతి, మహీంద్రలు బాధపడుతూ ఉంటారు. అప్పుడు మహేంద్ర టేబుల్ మీద రిషి ది మహేంద్ర ది ఫోటో ఉండిపోతుంది.
ఫోటో అక్కడే ఉండిపోయింది. రిషి దాన్ని చూస్తే అయిపోయినట్టే అని అనుకోని గౌతమ్ కి సైగ చేస్తూ ఫోటో ఉండిపోయింది అని చెప్తాడు. అప్పుడు గౌతమ్ నెమ్మదిగా ఆ ఫోటోని కప్పేస్తాడు ఎందుకురా అటు ఇటు తిరుగుతున్నారు.మీరు కూర్చోమని చెప్పాను కదా నెమ్మదిగా కూర్చోండి ఇదిగోండి మంచినీళ్లు అని చెప్పి ఆ ఫోటోని దాచి వాళ్ళని కూర్చోబెడతాడు గౌతమ్. అప్పుడు రిషి గౌతమ్ తో, ఎప్పుడు డాడ్ నా మీద ఇంత కోపంగా లేరు రా ఏ చిన్న కోపం వచ్చినా సరే నన్ను తిట్టేవారు అంతేకానీ ఇలా ఎప్పుడూ వెళ్లిపోయింది లేదు. ఇప్పుడు నాకు డాడ్ కనిపిస్తే వెళ్లి సారీ చెప్తాను డాడ్ కూల్ అవుతారు.డాడ్ ది చాలా మంచి మనసు చిన్నపిల్లలాంటివారు అని అంటాడు. దానికి జగతి, మహేంద్రలు బాధతో ఏడుస్తూ ఉంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!