Devatha: ఆనందంలో దేవుడమ్మ..దేవి ప్రవర్తన వల్ల కుమిలిపోతున్న రుక్మిణి..?
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు మే 30ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో సూరి(suri)రుక్మిణి గురించి అసలు విషయం చెప్పడంతో దేవుడమ్మ ఆనంద పడుతూ ఉంటుంది. మంచివార్త చెప్పావు అంటూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు గతంలో స్వామి చెప్పిన మాటలు తలుచుకొని ఎలా అయినా సరే రుక్మిణి వెతకాలి అని అనుకుంటుంది దేవుడమ్మ(devudamma).
అప్పుడు సూరి మాత్రం గతంలో ఒకసారి రుక్మిణి చూసిన విషయాన్ని తలుచుకొని ఆ విషయం చెప్పాలా వద్దా అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు రాధ, దేవి(devi)మాధవ అలాగే తన తల్లి భాగ్యమ్మ(bhagyamma)మాట్లాడిన మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో దేవి అక్కడికి వచ్చి అందరూ సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు.
మనం కూడా వెళ్దాం అని అనడంతో రాధ(radha) వద్దు అని అనడంతో వెంటనే దేవి అమ్మమ్మ ఉందా లేదా అసలు నువ్వు మా అమ్మ వి కాపు అనడంతో రాధ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరొకవైపు మాధవ(madhava) ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో జానకి అక్కడికి వచ్చి గతంలో నీ భార్య లక్ష్మి చనిపోయినప్పుడు ఎన్నో రోజులు చీకటి గదిలో ఉన్నావు.
కానీ రాధ(radha) వచ్చిన తర్వాత తేరుకున్నావు. ఊరి ప్రజల కోసం నీ కోసం రాధ ఇంట్లో కోడలు గా ఉంటే బాగుండు అని అనడంతో అప్పుడు మాధవ(madhava) రాధ అంత సులువుగా ఒప్పుకోదు అని అంటూ ఉండగా వారి మాటలను రాధ గుమ్మం దగ్గర నిలబడి ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత రాధ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే పిల్లలు స్కూల్ కి బయలుదేరడానికి బాక్స్ కోసం వస్తారు.
అప్పుడు దేవి(devi)చిన్మయి ని బాక్స్ కోసం అడగమని అడగగా, అప్పుడు చిన్మయి వెళ్లి రాధను బాక్స్ అడగడంతో రాధా బాక్స్ తెచ్చి ఇవ్వగా పిల్లలు స్కూల్ కి వెళుతూ రాధకు ముద్దు పెట్టి వెళ్తారు. కానీ దేవి మాత్రం పరాయి తల్లితో అన్నట్టుగానే ప్రవర్తిస్తుంది. అప్పుడు రాధ మరింత బాధ పడుతూ కుమిలిపోతూ ఉంటుంది. భాగ్యమ్మ(bhagyamma)స్కూల్ దగ్గరికి వచ్చి దేవితో కాసేపు సరదాగా ఆడుకుంటూ ఉంటుంది. మరొకవైపు జానకి వేరేవాళ్ల ఫంక్షన్ వెళ్లడానికి బాగా హడావుడి చేస్తూ ఉంటుంది.
ఇంతలో రాధ(radha) అక్కడికి వచ్చి అందరూ ఒకచోట కి వెళ్ళాలి అని వారిని బయలుదేరమని చెబుతుంది. అయితే ఇంట్లో వాళ్లు ఎంత అడిగినా కూడా రాధ వినకుండా వారికి చెప్పకుండా వారిని తీసుకుని వెళుతుంది. అప్పుడు రామ్మూర్తి,జానకి (janaki)ఎక్కడికి ఏమీ చెప్పకుండా తీసుకెళ్తున్నావు అని అనడంతో మాధవ సార్ కోసం వెళుతున్నాము సార్ ఉంటే చాలు అని అంటుంది రాధ. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.