సుశాంత్, రియాను కాకుండా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడా.. అసలు నిజమేంటి?
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి నేపథ్యంలో ఎన్నో విషయాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా సుశాంత్ ఓ హీరోయిన్తో డేటింగ్ చేసిన వ్యవహారం తెర మీదకు వచ్చింది. అంతేకాదు సుశాంత్ ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడట.
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ స్నేహితుడు శామ్యూల్ హాకిప్ సుశాంత్ వ్యక్తిగత జీవితం గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. కేథార్నాథ్ సినిమా ప్రమోషన్ సమయంలో సుశాంత్, సారా అలీఖాన్లు ప్రేమలో ఉన్నారని ఆయన తెలిపారు.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14న ముంబైలోని తన నివాసంలో మృతి చెందాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నా.. సూసైడ్ నోట్ మాత్రం లభించలేదు.
ఇన్నాళ్లు సుశాంత్ చాలా కాలంగా రియాతో ప్రేమలో ఉన్నట్టుగా భావిస్తున్నారు. అయితే శామ్యూల్ పోస్ట్తో పరిస్థితులు మారిపోయాయి. సుశాంత్ తనతో అన్ని విషయాలు పంచుకునే వాడని, ఆ సమయంలోనే సారాతో ప్రేమ, బ్రేకప్ల గురించి కూడా తనతో చెప్పాడని చెప్పాడు శామ్యూల్.
శామ్యూల్ తన పోస్ట్లో `కేధార్నాథ్ ప్రమోషన్ల సమయంలో సుశాంత్, సారాలు పూర్తిగా ప్రేమలో ఉన్న విషయం నాకు బాగా గుర్తుంది. కానీ బాలీవుడ్ మాఫియా ఒత్తిడి కారణంగా సుశాంత్కు సారా గుడ్ బై చెప్పేసింది` అని కామెంట ్ చేశాడు శామ్యూల్.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ కేర్ టేకర్ రాయిస్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. సీబీఐ దర్యాప్తులో భాగంగా సారా, సుశాంత్లో ఎంతో సన్నిహితంగా ఉండేవారని, వారిద్దరు కలిసి బ్యాంకాక్ ట్రిప్కు కూడా వెళ్లారని వెల్లడించాడు.
సుశాంత్ ఆమెను ఎంతగానో ప్రేమించాడు, ఆమెకు ప్రపోజ్ చేయడానికి కూడా ప్లాన్ చేసుకున్నాడు అని తెలిపాడు. అయితే 2018 వరకు సుశాంత్ ఫాం హౌస్కు సారా రెగ్యులర్గా వచ్చేదని 2019 జనవరి తరువాత ఆమె రావటం మానేసిందని చెప్పాడు.
సారా, సుశాంత్లు ఎప్పుడు ఫాం హౌస్కు వచ్చినా మూడు నాలుగు రోజుల పాటు అక్కడే ఉండేవారని వెల్లడించాడు. డిసెంబర్ 2018లో థాయిలాండ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత రాత్రి 11 గంటల సమయంలో వారు విమానాశ్రయం నుంచి నేరు ఫాంకు వచ్చినట్టుగా వెల్లడించాడు రాయిస్.
సారా అలీఖాన్, సుశాంత్ ఇంట్లో పనిచేసే వారితో కూడా ఎంతో ప్రేమగా ఉండేదని వెల్లడించాడు రాయిస్. ఆమె ప్రతీ ఒక్కరిని ఎంతో మర్యాదగా పలకరించేదని తెలిపాడు.
డామన్ ట్రిప్లో సారాకు ప్రపోజ్ చేయాలని సుశాంత్ అనుకున్నట్టుగా ఆయన వెల్లడించాడు. కానీ ఆ ట్రిప్ క్యాన్సిల్ అయ్యింది. తరువాత కేరళకు వెళ్లాలని కూడా ప్లాన్ చేశారు. కానీ అది కూడా జరగలేదు. 2019 ఫిబ్రవరి, మార్చిలో వారిద్దరు విడిపోయినట్టుగా నాకు తెలిసింది. 2019 జనవరి తరువాత వారు ఫాంకు రాలేదని చెప్పాడు.
2019 జనవరిలో సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా డామన్ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఆయనకు సంబంధించిన వస్తువులన్నింటినీ ప్యాక్ చేయాల్సిందిగా అబ్బాస్ (సుశాంత్ స్నేహితుడు) చెప్పాడు. అయితే అదే సమయంలో డామన్లో ప్రధాని ట్రిప్ ఉండటంతో హోటల్ రూమ్స్ ఖాళీ లేవన్న కారణంతో సుశాంత్ ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నాడని తెలిపాడు రాయిస్.
అయితే ఈ విషయాలు నాకు ప్రత్యక్షంగా తెలియదు. సుశాంత్ ఇద్దరు స్నేహితులు ఈ విషయాన్ని చర్చిస్తుండగా నేను విన్నాను. వారు సుశాంత్, సారాకు ఓ గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు అని మాట్లాడుకున్నారు అని రాయిస్ పోలీస్ విచారణలో వెల్లడించాడు.