- Home
- Entertainment
- Dhurandhar 2: అడ్వాన్స్ బుకింగ్స్ లో ధురంధర్ 2 సంచలనం.. యానిమల్, జవాన్ రికార్డులు బ్రేక్?
Dhurandhar 2: అడ్వాన్స్ బుకింగ్స్ లో ధురంధర్ 2 సంచలనం.. యానిమల్, జవాన్ రికార్డులు బ్రేక్?
రిలీజ్కు ముందే 'ధురంధర్ 2' విదేశాల్లో సంచలనం సృష్టిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా వస్తున్న ఈ సినిమా, అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్తోనే కోట్లు వసూలు చేసింది.

ట్రైలర్కు ముందే ‘ధురంధర్ 2’కు అదిరిపోయే రెస్పాన్స్
అమెరికాలో ప్రీ-సేల్స్తో పెరుగుతున్న 'ధురంధర్ 2' కలెక్షన్లు
ట్రేడ్ రిపోర్టుల ప్రకారం, అమెరికాలో అడ్వాన్స్ టికెట్ల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి. బుధవారం నాటి ప్రీ-సేల్స్ ద్వారానే ఈ సినిమా సుమారు 2.5 లక్షల డాలర్లు (దాదాపు రూ. 2 కోట్లు) వసూలు చేసింది. ఇక ఓపెనింగ్ డే కోసం ఇప్పటికే లక్ష డాలర్ల విలువైన టికెట్లు అమ్ముడయ్యాయి. అలాగే, శుక్ర, శనివారాల షోల కోసం కూడా చెరో లక్ష డాలర్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. మొత్తంగా, ఇప్పటివరకు సినిమా ప్రీ-సేల్స్ కలెక్షన్ దాదాపు 6 లక్షల డాలర్లకు చేరుకుంది. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.
రికార్డులు బద్దలు కొట్టే రేసులో ‘ధురంధర్ 2’
‘యానిమల్’ ప్రీమియర్ రికార్డుపై కూడా కన్ను
ఈ సినిమాకు వస్తున్న అద్భుతమైన స్పందన చూసి, ఇది 'యానిమల్' నార్త్ అమెరికా ప్రీమియర్ కలెక్షన్ల రికార్డును కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. 'యానిమల్' సినిమా ప్రీమియర్ షోల ద్వారా సుమారు 1.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇప్పటికీ ఇది పెద్ద రికార్డుగా నిలిచింది. `ధురంధర్` మొదటి భాగం సాధించిన భారీ విజయం కారణంగా, ఈ సీక్వెల్కు కూడా బలమైన ఓపెనింగ్ లభించే అవకాశం ఉందని సినీ నిపుణులు చెబుతున్నారు.
‘టాక్సిక్’ వాయిదాతో 'ధురంధర్ 2'కు కలిసొచ్చిన అదృష్టం
నిజానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 'టాక్సిక్' సినిమాతో పోటీ పడాల్సి ఉంది. కానీ ఇప్పుడు 'టాక్సిక్' రిలీజ్ జూన్కు వాయిదా పడింది. దీంతో 'ధురంధర్ 2'కు సోలో రిలీజ్ దొరికింది. నిర్మాతలు ఈ సినిమాను హిందీతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల నార్త్ ఇండియాతో పాటు సౌత్ మార్కెట్లో కూడా సినిమాకు మంచి బిజినెస్ జరుగుతుందని ఆశిస్తున్నారు. అయితే తెలుగులో ఇది `ఉస్తాద్ భగత్ సింగ్`తో పోటీపడబోతుంది.
ధురంధర్ 2 స్టార్కాస్ట్, రిలీజ్ డేట్ వివరాలు
ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయనతో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా 2026 మార్చి 19న థియేటర్లలోకి రానుంది. 2025 డిసెంబర్లో వచ్చిన మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.1300 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది. అప్పటి నుంచి ఈ సీక్వెల్పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

