నిర్మాత పరారీ..ధనుష్, శివకార్తికేయన్, శింబు లకు ఈడీ షాక్ ఇవ్వనుందా ?
డాన్ పిక్చర్స్ అధినేత ఆకాష్ బాస్కరన్ విచారణకు హాజరు కాకుండా పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నటులు శివకార్తికేయన్, ధనుష్, శింబులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించనున్నట్లు సమాచారం.
1 Min read
Share this Photo Gallery
- FB
- TW
- Linkdin
Follow Us
14
)
Image Credit : Asianet News
ఈడీ దాడులు
టాస్మాక్లో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో టాస్మాక్ ప్రధాన కార్యాలయం, మద్యం ఫ్యాక్టరీలపై ఈడీ దాడులు చేసింది. దాడుల్లో రూ.1000 కోట్ల అవినీతి జరిగినట్లు ఈడీ నివేదిక వెల్లడించింది.
24
Image Credit : Google
నిర్మాత ఆకాష్ బాస్కరన్ పరారీ
నిర్మాత ఆకాష్ బాస్కరన్ ఇంట్లో జరిపిన సోదాల్లో కీలక పత్రాలు, సమాచారం లభించినట్లు తెలుస్తోంది. దీంతో ఆకాష్ బాస్కరన్ను మే 21న నంగనంబాక్కంలోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేశారు. అయితే ఆయన విచారణకు హాజరు కాకుండా పరారీలో ఉన్నారు.
34
Image Credit : Google
ముగ్గురు హీరోలతో సినిమాలు
ఆకాష్ బాస్కరన్ శివకార్తికేయన్తో ‘పరాశక్తి’, ధనుష్తో ‘ఇడ్లీ కడై’, శింబు 49వ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాల్లో నటించడానికి డాన్ పిక్చర్స్ నుంచి శివకార్తికేయన్, ధనుష్, శింబులకు భారీగా నగదు చేతులు మారినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది.
44
Image Credit : Asianet News
శింబు, ధనుష్, శివకార్తికేయన్ కి షాక్ తప్పదా ?
ఆకాష్ బాస్కరన్ పరారీలో ఉండటంతో శివకార్తికేయన్, శింబు, ధనుష్లను విచారణకు పిలవాలని ఈడీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కనుక జరిగితే ఈ ముగ్గురు హీరోలకు చిక్కులు మొదలైనట్లే.