- Home
- Entertainment
- RRR, రంగస్థలం చిత్రాలకి ఏమాత్రం తగ్గదు.. రామ్ చరణ్ తో మూవీపై సొంతూరిలో సుకుమార్ కామెంట్స్
RRR, రంగస్థలం చిత్రాలకి ఏమాత్రం తగ్గదు.. రామ్ చరణ్ తో మూవీపై సొంతూరిలో సుకుమార్ కామెంట్స్
చాలా రోజుల తర్వాత సుకుమార్ తన సొంత గ్రామం మట్టపర్రులో పర్యటించారు. తన సొంతూరిలో రామ్ చరణ్ తో చేయబోయే తదుపరి చిత్రం గురించి సుకుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
రామ్ చరణ్ తో సుకుమార్ రెండోసారి
పుష్ప 2 షూటింగ్ పూర్తి అయినప్పటి నుంచి దర్శకుడు సుకుమార్ తదుపరి ప్రాజెక్ట్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సుకుమార్ తన కొత్త చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయబోతున్నారనే సంగతి తెలిసిందే. దీని గురించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం రామ్ చరణ్.. బుచ్చి బాబు దర్శకత్వంలో పెద్ది అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ చిత్రం మొదలవుతుంది.
సొంతూరిలో సుకుమార్
పుష్ప 2 రిలీజ్ అయ్యాక సుకుమార్ కి కాస్త తీరిక సమయం దొరికింది. ఈ నేపథ్యంలో, సుకుమార్ ఇటీవల తన సొంతూరు ఆంధ్రప్రదేశ్ లోని మలికిపురం మండలం, మట్టపర్రు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తో చిత్రం గురించి సుకుమార్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్, ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి .
RRR, రంగస్థలం చిత్రాలని మించేలా..
షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది త్వరలోనే చెబుతాం అని సుకుమార్ అన్నారు. మా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని, ఆ తర్వాత రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా గుర్తింపు పొందారని సుకుమార్ అన్నారు. ఈ రెండు చిత్రాలకు తగ్గకుండా రామ్ చరణ్ తో తాను తీయబోయే చిత్రం ఉంటుందని సుక్కు అంచనాలు పెంచేశారు. ఈ సినిమాకు RC 17 అనేది వర్కింగ్ టైటిల్.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో..
ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి, ముఖ్యంగా రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ మళ్లీ చేతులు కలపడంతో ఇండస్ట్రీలో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ మూవీ అంటే దేవిశ్రీ మ్యూజిక్ ఉండాల్సిందే.
థియేటర్లకు ఆదరణ తగ్గలేదు
సుకుమార్ మాట్లాడుతూ ఇండస్ట్రీపై ఓటీటీ ప్రభావం గురించి కూడా తన అభిప్రాయాన్ని తెలిపారు. థియేటర్ల విషయంలో ప్రేక్షకుల అభిరుచి మారలేదు. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోని థియేటర్లకు ఎక్కువ ఆదరణ ఉంటుంది. పట్టణాల్లో ఓటీటీ ప్రభావం కొంత పెరిగింది అనేది వాస్తవమని సుకుమార్ తెలిపారు. తాను సుకుమార్ రైటింగ్స్ సంస్థని ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహించడం కోసమే అని తెలిపారు. ఆ విషయంలో తన సుకుమార్ రైటింగ్స్ సంస్థ విజయవంతం అయింది అని తెలిపారు.
ఇకపై ప్రతి ఏడాది వస్తా
ప్రతి ఏడాది తన సొంత ఊరు మట్టపర్రులోనే సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలనేది తన కోరిక అని సుకుమార్ అన్నారు. కానీ గత రెండేళ్లుగా పుష్ప 2 షూటింగ్ లో బిజీ షెడ్యూల్ లో ఇరుక్కుపోయానని, అందువల్ల తన సొంత ఊరికి రావడం కుదరలేదని తెలిపారు. ఇకపై క్రమం తప్పకుండా ఇక్కడికి వస్తానని తెలిపారు.