Devatha: రాధతో దేవి కోసం మాట్లాడిన దేవుడమ్మ... రాధతో చిన్మయి మధుర క్షణాలు!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెబర్ 6వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జానకమ్మ రుక్మిణి తో, నీకేమైనా బాధలు ఉన్నాయా? ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? నాకు చెప్పమ్మా మూడో కంటికి తెలియకుండా దాన్ని ఎలాగైనా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను అని అంటుంది. అప్పుడు రాధ, నాకే సమస్యలు లేవని చెప్పాను కదా ఇంక వదిలేయండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో రుక్మిణి తన గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది.
అప్పుడు వెనకాతల నుంచి దేవి గొంతు వినిపించి, ఏమో రాధమ్మ గదిలో ఉండడమే తప్ప కూతురికి సేవ చేయడం లేవా అని అంటుంది. అప్పుడు దేవి గొంతు వినిపిస్తుంది దేవి వచ్చిందా అని బయటకు చూసేసరికి అక్కడ దేవి ఉండదు. ఇంతలో చిన్నయి అక్కడికి వచ్చి, అమ్మ నేను ఎలా మాట్లాడాను? అచ్చు దేవి గొంతులాగే ఉన్నది కదా, దేవిని ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాను దేవి ఎలా మాట్లాడతాదో నాకు తెలియదా? ఇప్పుడు నువ్వు ఆనందంగానే ఉన్నావా అని అనగా రుక్మిణి చిన్మయి వెనకాతల పరిగెడుతూ ఏయ్ దొంగా అని ఆట పట్టిస్తుంది.
తర్వాత సీన్ చిన్మయి, రుక్మిణి నీ సోఫా మీద కూర్చోబెట్టి కళ్ళు మూసుకోమని చెప్తుంది. చాక్లెట్ ఇచ్చి నీ కోసమే తెచ్చాను అని అంటుంది.నాకోసం తెచ్చావా తల్లి అని రుక్మిణి అనగా, అవునమ్మా నువ్వు నాకోసం ఎప్పుడూ చేస్తూ ఉంటావు కదా! అందుకే నీకోసమే తెచ్చాను అమ్మ ఐ లవ్ యు అనుకొని వెళ్లి హద్దుకుంటుంది. అమ్మ నాకు దేవి లేకపోతే ఏదోలాగా ఉన్నదమ్మ,అసలు ఊసుపోవడం లేదు అని బాధపడుతుంది.
ఆ తర్వాత సీన్లో దేవి, చిన్ని రుక్మిణిని వొడిలో కూర్చోబెట్టుకొని ఆడుకుంటూ ఉంటుంది.అప్పుడు పక్కన కూర్చున్న దేవుడమ్మ,నువ్వు కూడా నాతోనే ఉండిపోవచ్చు కదా మీ అమ్మని అడుగుతాను అని అనగా అయితే మీరు నాకు రుక్మిణి నే ఇచ్చేయండి అని అంటుంది.మా ఇంట్లో ఉన్న చిన్న పాప కదా ఎలా చేస్తాము అని వాళ్ళు అనగా, మరి మా ఇంట్లో కూడా నేను చిన్న పాపని కదా ఎలా వచ్చేస్తాను అని అంటుంది దేవి.కనీసం పండగ అయ్యేంతవరకు ఉందమ్మా అంటుంది దేవుడమ్మ.అప్పుడు దేవి అమ్మని అడగమని అంటుంది.
ఆ తర్వాత సీన్లో రుక్మిణి చిన్మయికి భోజనం తినిపిస్తూ ఉంటుంది అప్పుడు చిన్నయి,అమ్మ నీ చేతి భోజనం చాలా బాగుందమ్మా.నాకు ఇలాగే తింటూ ఉండిపోవాలని ఉన్నది అని అంటుంది. ఇంతలో రుక్మిణికి ఫోన్ వస్తుంది. ఫోన్ ఎత్తగా నేను దేవుడమనమ్మ,రాధా బాగున్నావా? నిన్ను ఎప్పుడు నేను చూడలేకపోయాను కానీ నీ గురించి వింటూనే ఉంటాను అని అంటుంది. రుక్మిణి నోట్లో నుంచి మాట రాదు, తన కంట్లో నుంచి నీళ్లు వచ్చేస్తాయి.
ఏమమ్మా మాట్లాడవా? నీ కూతురు ఊరంతా అమ్మేసేలా మాట్లాడుతుంది, నువ్వు మాట బయటికి వస్తే చాలు అనుకున్న మాట్లాడడం లేదు. అది సరే కానీ నాకు నీ కూతుర్ని ఇక్కడే ఉంచుకోవాలని ఉన్నది,నాకు తెలుసు అది నీకు కష్టంగా ఉంటుంది. కనీసం పండగ అయినంత వరకు అయినా మేము ఇక్కడ దేవిని ఉంచుకుంటాం అమ్మ ఏమనుకోకు అని అనగా సరే అని అంటుంది రుక్మిణి. అప్పుడు థాంక్స్ అమ్మ అని ఫోన్ పెట్టేస్తుంది దేవుడమ్మ.
సరే దేవి మీ అమ్మ ఒప్పుకున్నది ఇంక మూడు రోజులు ఇక్కడే ఉండాలి. హాయిగా నువ్వు చిన్న పాపతో ఆడుకోవచ్చు అని అంటుంది దేవుడమ్మ.రుక్మిణి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి. అప్పుడే మాధవ్ అక్కడికి వస్తాడు.ఎప్పుడు మాట్లాడే ఆదిత్య తో నే మాట్లాడుతున్నావు కదా కళ్ళల్లో నీళ్లు ఎందుకు రావడం అని అడగగా నేను మాట్లాడింది మా అత్తగారితో అని చెప్పి ఏడుస్తుంది రాద.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!