Guppedantha Manasu: సాక్షి, దేవయాని నాటకం.. వసును రెచ్చగొట్టేందుకు ప్లాన్ చేసిన రిషీ!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 6వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. నాకు ఇంకా వేరే పనులు లేవనుకున్నావా.. నువ్వు ఎప్పుడు మెసేజ్ పెడితే రిప్లై ఇద్దామా అని ఎదురుచూస్తూ ఉంటాను అనుకున్నావా అని రిషీ వసుపై సీరియస్ అవుతాడు.. సరే సార్ అంటే.. నేను రిప్లై ఇచ్చే వరకు వేయిట్ చెయ్యి అని చెప్తాడు.. అంతే వసుధార ఓకే సార్ అని అంటుంది.
ఇక తర్వాత సీన్ లో మహేంద్ర జగతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.. సాక్షి ప్లాన్ తో వచ్చినట్టు ఉంది అని వసు కాపాడటానికి వచ్చినట్టు ఉంది అని మహేంద్ర అంటాడు. అతర్వాత సీన్ లో వసు, జగతి, మహేంద్ర ముగ్గురు భోజనం చేస్తుంటారు. అప్పుడే రిషీ ఎంట్రీ ఇస్తాడు. మీరు ఎప్పుడు వచ్చారు అని వసు అడగ్గా నా లంచ్ గురించి మాట్లాడుతున్నప్పుడే వచ్ఛాలే అని వెటకారంగా రిప్లై ఇస్తాడు.
అతర్వాత సీన్ లో రిషీ జగతికి వసుపై కంప్లైంట్ ఇస్తాడు. కాలేజ్ లో అనవసరమైన వాటిలో ఇన్వొల్వ్ అవుతుంది.. కాస్త చెప్పండి అవసరం లేదని అని అంటాడు. నేను ఎం చేశాను అని అంటే ఏమో ఎండి గారు చెప్పారు నువ్వు వినాల్సిందే అని అంటారు.. ఇక సీన్ కట్ చేస్తే రిషీ దేవయని, సాక్షి నాటకం సీన్ లోకి అడుగుపెడుతాడు.
అక్కడ డాక్టర్ సాక్షిని చెక్ చేసి ప్రమాదం తప్పిందని చెప్తుంది. ప్రమాదమా ఏం జరిగింది అని రిషీ దేవయానిని అడగ్గా నీకోసమే సాక్షి సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్తుంది. నువ్వు అంటే ప్రేమ.. పిచ్చి.. ప్రాణం రిషీ.. తప్పో వప్పో మొదట వద్దని వెళ్ళిపోయింది.. తర్వాత తప్పు తెలుసుకొని నీకోసమే వచ్చింది అని దేవయని చెప్తుంది.
తను వెళ్లడం నీకు నచ్చలేదు.. రావడం అస్సలు నచ్చలేదు.. ఒక అమ్మాయి ప్రేమను వెటకారం చేసేవాడివి నువ్వు కాదు.. కానీ తను నీ ఆస్తిపాస్తుల కోసం రాలేదు కదా.. క్షమించచ్చు కదా అని దేవయని అంటే రిషీ సీరియస్ అవుతాడు. ఆఖరికి లైబ్రరీ సీన్ గురించి కూడా చెప్తుంది. అంతేకాదు సాక్షిని పెళ్లి చేసుకో అని అంటే రిషీ మళ్లీ సీరియస్ అయ్యి నా నిర్ణయం ఎప్పుడో చెప్పేసాను అని అంటాడు.
సరే పెళ్లి వద్దు, ప్రేమ వద్దు స్నేహంగా అయిన మెలుగు..ఒక వ్యక్తిగా అయిన గౌరవించు అని చెప్తే రిషీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అతరవాత వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయ్యిందని ఇద్దరు సంతోషిస్తారు. ఇక ఇంట్లో మహేంద్ర వాళ్ళతో దేవయని చెప్తే వాళ్ళు ప్రశ్నిస్తే డాడ్ ఇక ఈ విషయం ఆపేయండి.. ఇది సున్నితమైన అంశం అని చెప్పి వెళ్ళిపోతాడు.
ఇక తర్వాత సీన్ లో వసుధార రిషీకి కాల్ చేసి ఈరోజు అంత రెస్టారెంట్ డ్యూటీలో ఉంటాను అని చెప్తుంది... నువ్వు రమ్మంటానే నేను వచ్చేస్తానా.. నేను రిషీంద్ర భూషణ్ ని నీకు క్లారిటీ ఇస్తా అగు అని చెప్పి సాక్షికి కాల్ చేసి కాఫీకి ఇన్వైట్ చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. తర్వాత ఎపిసోడ్ లో వసుధార పని చేసే రెస్టారెంట్ కు సాక్షి, రిషీ వెళ్తారు.. వసు ముందు కావాలనే సాక్షిపై కేర్ చూపిస్తాడు.. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.