- Home
- Entertainment
- ప్రభాస్ , దీపికా పదుకొనే వన్స్ మోర్, స్పిరిట్ కోసం సెట్ చేసే పనిలో సందీప్ రెడ్డి వంగ
ప్రభాస్ , దీపికా పదుకొనే వన్స్ మోర్, స్పిరిట్ కోసం సెట్ చేసే పనిలో సందీప్ రెడ్డి వంగ
ప్రభాస్ , దీపిక పదుకునే కాంబినేషన్ లో వచ్చిన కల్కీ సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక ఈ కాంబో మరో సినిమా కోసం కలవబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపికాను నటింపచేయడానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
కూతురు పుట్టిన తర్వాత, దీపికా పదుకొనే తిరిగి సినిమాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారు. మీడియా కథనాల ప్రకారం ఆమె కొన్ని సినిమాలకు సంతకం చేశారు, అయితే ఈ ఏడాది మాత్రం దీపికా నుంచి ఎటువంటి సినిమా రిలీజ్ కావడంలేదు. దీపికా అన్ని సినిమాలు 2026-27లో థియేటర్లలో విడుదల కానున్నాయి. ఇక దీపికా గురించి ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read: 42 ఏళ్ల త్రిష ఆస్తి ఎన్ని కోట్లు? స్టార్ హీరోయన్ లగ్జరీ లైఫ్, నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?
మరీ ముఖ్యంగా ప్రభాస్ తో దీపికా సినిమా గురించి వార్త వైరల్ అవుతోంది. 'కల్కి 2898 AD' తర్వాత, ఆమె మళ్ళీ ప్రభాస్తో నటించబోతున్నట్టు తెలుస్తోంది. . సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయబోయే పాన్ ఇండియా సినిమా స్పిరిట్ లో వీరు కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి దీపికా భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.
Also Read: 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన సుమంత్, హీరోయిన్ తో అక్కినేని హీరో ప్రేమ, నిజమెంత?
<p>Prabhas, deepika</p>
సందీప్ వంగా రెడ్డి మళ్ళీ సినిమాను ఆఫర్ చేసినప్పుడు, దీపికా వెంటనే అంగీకరించారట. దీపికాకు స్క్రిప్ట్, ముఖ్యంగా ఆమె పాత్ర నచ్చిందట. ఆమె పాత్ర దర్శకుడు రాసిన బలమైన స్త్రీ పాత్రలలో ఒకటి అని చెబుతున్నారు. ఇది దీపికాను బాగా ఆకట్టుకుంది, అంతే కాదు ఆమె మొదటిసారి సందీప్తో పనిచేయడానికి ఉత్సాహంగా ఉంది.
Also Read: అభిషేక్ కంటే ముందు ఐశ్వర్య రాయ్ 7 ప్రేమకథలు, స్టార్ హీరోయిన్ ప్రేమించిన హీరోలు ఎవరో తెలుసా?
2024 చివరిలో చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉండడంతో, ఆమె గర్భవతి కావడంతో దీపికా పదుకొనే మొదట 'స్పిరిట్'లో పనిచేయడానికి నిరాకరించారు. అయితే, ప్రభాస్ మరో ప్రాజెక్ట్ షూటింగ్ సమయంలో గాయపడటంతో మూవీ టీమ్ సినిమా షూటింగ్ ను వాయిదా వేసింది. ఇప్పుడు, 'స్పిరిట్' కొత్త షూటింగ్ షెడ్యూల్ అక్టోబర్ 2025కి నిర్ణయించబడింది.
'స్పిరిట్'ని భూషణ్ కుమార్ తో కలిసి సందీప్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ఇది ప్రభాస్ , దీపికా పదుకొనే నటించబోతున్న యాక్షన్ చిత్రం. ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ 2025లో ప్రారంభమవుతుంది. 2027 ప్రారంభంలో విడుదల చేయాలని ప్లనా్ చేసుకుంటున్నారు. దీపికా ఈ చిత్రానికి ₹20 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. . దీపికా చివరిసారిగా 2024 చిత్రాలైన 'కల్కి 2898 AD' లో కనిపనించారు. ఈసినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది.