- Home
- Entertainment
- దాసరి నారాయణరావు వందల కోట్ల ఆస్తులు దోచుకున్నది వాళ్లే.. గురువుగారు గురువుగారు అంటూ కాజేశారు
దాసరి నారాయణరావు వందల కోట్ల ఆస్తులు దోచుకున్నది వాళ్లే.. గురువుగారు గురువుగారు అంటూ కాజేశారు
దర్శకరత్న దాసరి నారాయణరావు సంపాదించిన వందల కోట్ల ఆస్తులు ఏమయ్యాయి. గురువుగారు అంటూ నమ్మిన వాళ్లే దోచుకున్నారా? షాకింగ్ విషయాలు వెల్లడి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో దాసరి నారాయణ రావు
దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగు సినిమాని శాసించిన దర్శకుడు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ఆయన దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, నిర్మాతగా రాణించారు. మల్టీటాలెంటెడ్గా నిరూపించుకున్నారు. 150కిపైగా చిత్రాలకు దర్శకత్వం వహించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ల్లోకి ఎక్కారు. తెలుగులో అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్గా రికార్డు సృష్టించారు.
ఇండస్ట్రీ పెద్దగా దాసరి
దాసరి నారాయణ రావు తన సినిమాల్లో ఎక్కువగా సామాజిక అంశాలను చర్చించారు. సామాజిక సమస్యలు, లింగ వివక్ష, కుల వివక్ష, రాజకీయ అవినీతి వంటి అంశాలపై ఎక్కువగా సినిమాలు తీశారు. సమాజాన్ని తట్టిలేపే ప్రయత్నం చేశారు. అంతేకాదు టాలీవుడ్లో ఇండస్ట్రీ పెద్దగానూ చెలామణి అయ్యారు. దాసరి ఉన్నంత కాలం తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ సమస్య అయినా ఆయన వద్దకే వెళ్లేది, అందులో చాలా వరకు ఆయనే పరిష్కారించేవారు.
అత్యధిక పారితోషికం అందుకున్న దర్శకుడు దాసరి
దాసరి నారాయణరావు అప్పట్లో దర్శకుడిగా పీక్లో ఉన్నారు. మూడు షిఫ్ట్ ల్లో సినిమాలు చేసేవారు. స్టార్ హీరోల వెంట పరిగెత్తకుండా దొరికిన హీరోతో సినిమాలు తీసి విజయాలు అందుకున్నారు. ఎంతో మంది దర్శకులకు, నటీనటులకు, టెక్నీషియన్లకి ఆయన లైఫ్ ఇచ్చారు. చిన్న హీరోతోనూ సినిమా చేసి హిట్లు కొట్టిన చరిత్ర ఆయనది.
హీరోయిన్లతోనూ మూవీస్ చేసి హీరోలకు సమానంగా బాక్సాఫీసు వద్ద రచ్చ చేశారు. అయితే ఆ సమయంలో దర్శకుడిగా ఆయన పారితోషికం కూడా బాగానే తీసుకునేవారు. అత్యధిక పారితోషికం అందుకున్న దర్శకుడిగానూ నిలిచారు.
దాసరి వందల కోట్ల సంపాదన
ఇంకా చెప్పాలంటే తెలుగులో మరే దర్శకుడు సంపాదించని ఆస్తులు ఆయన సంపాదించారు. కానీ వాటిని నిలబెట్టుకోలేకపోయారు. ఆయన సన్నిహితులు, శిష్యులు చెప్పేదాన్ని బట్టి దాసరి సంపాదించిన ఆస్తుల విలువ వందల కోట్లు ఉంటుందట.
కానీ వాటిలో చాలా వరకు నమ్మినవాళ్లే కాజేశారట. తన చుట్టూ ఉన్నవాళ్లే మోసం చేశారట. గురువుగారు గురువుగారు అంటూ పంగనామాలు పెట్టారట. ఈ విషయాన్ని దర్శకుడు, దాసరి శిష్యుడు నందం హరిశ్చంద్రరావు వెల్లడించారు. ట్రీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను బయటపెట్టారు.
కొడుకులు పట్టించుకోలేదు, ఆస్తులన్నీ దొంగలపాలు
దాసరికి వచ్చిన ఆదాయాన్ని చూసుకునే ఇంటిమనుషులు లేరని, దానివల్లే ఆయన ఆస్తులన్నీ దొంగలపాలయ్యాయని తెలిపారు. దాసరి తన భార్య పద్మకి ఆర్థికపరమైన అధికారం ఇవ్వలేదని, తన వద్దకు వచ్చిన వాటితోనే ఆమె ఆస్తులు కొనిపెట్టిందని తెలిపారు.
అయితే దాసరి కొడుకులు అప్పటికీ ప్రయోజనకారులు కాలేదు, ఫ్యామిలీని, మనీని మ్యానేజ్ చేసే స్థితిలో లేరు. పెద్ద కొడుకు అమ్మాయితో వెళ్లిపోయాడు, చిన్న కొడుకు జల్సాలకే పరిమితమయ్యాడు, బాధ్యతలు తీసుకోలేదు. దాసరి కూడా కొడుకులను పట్టించుకోలేదు.
గురువుగారు గురువుగారు అంటూనే పంగనామాలు
దీంతో దాసరి తనకు వచ్చే సంపాదనని చూసుకునే బాధ్యతని తనకు నమ్మకమైన వారికి అప్పగించారు. వారిలో చాలా మంది మోసం చేశారు. ఎక్కువ బిల్లులు వేయడం, వడ్డీలు ఎక్కువ కట్టడం చేశారు. ఇక తన వద్ద ఫైనాన్స్ తీసుకున్నవాళ్లు ఎగొట్టడం, తాను ఫైనాన్స్ తీసుకుంటే ఎక్కువ వడ్డీలు కట్టడం ఇలా సంపాదించిన ఆస్తులన్నీ కరిగిపోయాయని,
తన చుట్టూ ఉన్నవాళ్లే, తనకు నమ్మకమైన వాళ్లే, రోజూ గురువుగారు గురువుగారు అంటూ తిరిగివాళ్లే ఆయన మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేశారని, ఆయన ఆస్తులను దోచుకున్నారని నందం హరిశ్చంద్రరావు తెలిపారు. దాసరి సంపాదించిన దాంట్లో ఇప్పుడు మిగిలిన ఆస్తులు సగం కూడా ఉండవని, అంతా తన చుట్టూ ఉన్నవాళ్లు, నమ్మకమైన వాళ్లే తిన్నారని హరిశ్చంద్రరావు వెల్లడించారు.
ఆస్తి కోసం కోర్ట్ మెట్లెక్కిన దాసరి కొడుకులు
ఆయన ఆస్తులను మంచిగా చూసుకునే ఫ్యామిలీ వాళ్లు ఎవరైనా ఉంటే ఇప్పుడు టాలీవుడ్లోనే రిచ్చెస్ట్ డైరెక్టర్గా దాసరి ఉండేవారని తెలిపారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక దాసరి ఎనిమిదేళ్ల క్రితం (మే 30న) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన ఆస్తుల కోసం ఇద్దరు కొడుకులు ఆ తర్వాత కోర్ట్ మెట్లు ఎక్కడం గమనార్హం.